అశోక్ సెల్వన్, నిత్యామీనన్, రీతూవర్మ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘నిన్నిలా నిన్నిలా’. బాపినీడు.బి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ బ్యానర్పై బీవీఎస్ఎన్.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అని.ఐ.వి.శశి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్లుక్ను సోమవారం రోజున విడుదల చేశారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ను అనౌన్స్ చేస్తామని నిర్మాతలు తెలిపారు. నటీనటులు:అశోక్ సెల్వన్, నిత్యామీనన్, రీతూవర్మ తదితరులు సాంకేతిక వర్గం:దర్శకత్వం: అని.ఐ.వి.శశినిర్మాత: బీవీఎస్ఎన్.ప్రసాద్సినిమాటోగ్రఫీ: దివాకర్ మణిసంగీతం: రాజేశ్ మురుగేశన్పాటలు: శ్రీమణిఆర్ట్: శ్రీ నాగేంద్ర తంగాలఎడిటింగ్: నవీన్ నూలిడైలాగ్స్: నాగ చందు, అనుష, జయంత్ పానుగంటి
Author: M.D ABDUL
‘బొమ్మ బ్లాక్బస్టర్’ సింగిల్ వదిలిన మెగా ప్రిన్స్
విజయీభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మిస్తున్న చిత్రం బొమ్మ బ్లాక్ బస్టర్. నూతన దర్శకుడు రాజ్ విరాట్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ టాలెంటెడ్ హీరో నందు విజయ్ కృష్ణ, డస్కీ బ్యూటీ రష్మీ గౌతమ్ జంటగా నటిస్తున్నారు. ముందుగా టైటిల్ ఆ తరువాత విడుదల చేసిన టీజర్తో అటు ఆడియెన్స్లో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో అనూహ్య స్పందన అందుకున్నారు బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్ర యూనిట్. ఈ నేపథ్యంలోనే నేడు బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రం ఆడియో ఆల్బమ్ నుంచి రాయే నువ్వు రాయే అనే పాటను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఇక ఈ సినిమాలో నందు ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్ ఫ్యాన్గా…
ప్రారంభమైన సత్యదేవ్ ‘తిమ్మరుసు’
‘బ్లఫ్ మాస్టర్’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి విలక్షణమైన కథా చిత్రాలు, పాత్రలతో ప్రేక్షకాభిమానుల ఆదరాభిమానాలు పొందుతున్న సత్యదేవ్ హీరోగా కొత్త చిత్రం ‘తిమ్మరుసు’ ఆదివారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిత్ర సినిమాటోగ్రాఫర్ అప్పూ ప్రభాకర్ క్లాప్ కొట్టారు. రాజా, వేదవ్యాస్ స్క్రిప్ట్ను అందజేశారు. ఈస్ట్కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరుతో పాటు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్ నిర్మాత సృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో రూపొందుతున్న ‘తిమ్మరుసు’ చిత్రానికి ‘అసైన్మెంట్ వాలి’ ట్యాగ్లైన్. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ – ” కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ హీరోగా, నటుడిగా.. సత్యదేవ్ తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. అలాంటి హీరో సత్యదేవ్తో సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ‘తిమ్మరుసు’ సినిమా…
‘ఇద్దరి లోకం ఒకటే’ ప్రచార చిత్రం విడుదల
యువ ప్రతిభాశాలి ‘అయ్యప్ప’ను కథానాయకుడిగా మరియు దర్శకుడిగా పరిచయం చేస్తూ ఉమాదేవి ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ అంకం సమర్పణలో వై.ఉమాదేవి నిర్మించిన విభిన్న ప్రేమకథాచిత్రం ‘ఇద్దరి లోకం ఒకటే’. అయ్యప్ప, అమృత పావని, దివ్య, శ్రీనివాస్ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ను తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి టి.ప్రసన్నకుమార్ రిలీజ్ చేయగా.. పోస్టర్ను యువ దర్శకులు జితేందర్-దర్శక నిర్మాత శివనాగు సంయుక్తంగా ఆవిష్కరించి ముక్కోణపు ప్రేమకథగా తెరకెక్కిన ‘ఇద్దరి లోకం ఒకటే’ చిత్ర బృందానికి మంచి పేరు తెచ్చిపెట్టాలని ఆకాంక్షించారు. పెద్ద మనసుతో తమ చిన్న చిత్రాన్ని ప్రోత్సహిస్తున్న అతిథులకు చిత్ర దర్శకుడు-కథానాయకుడు అయ్యప్ప కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరోయిన్లు అమృత పావని, దివ్య, శ్రీనివాస్, వంశీ పవన్, ఈశ్వరరావు వానపల్లి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీకాంత్,…
హరీష్ వదిలిన క్షీర సాగర మథనం గీతం
అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఆహ్లాదకర చిత్రం ‘క్షీర సాగర మథనం’. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్నఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటిస్తున్నారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు. ‘క్షీరసాగరమథనం’లోని ‘నీ పేరు పిలవడం… నీ పేరు పలకడం’ గీతాన్ని సంచలన దర్శకులు హరీష్ శంకర్ ట్విట్టర్లో విడుదల చేసి చిత్ర యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు. అజయ్ అరసాడ స్వర కల్పనలో.. శ్రీమణి రాసిన ఈ పాటను ‘రాములో రాముల’ ఫేమ్ అనురాగ్ కులకర్ణి ఆలపించారు. శ్రీ వెంకటేశ పిక్చర్స్తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ.. ‘క్షీర సాగర మథనం’ చిత్రం పోస్ట్…
‘లింగొచ్చా’ చిత్ర టీజర్ విడుదల ఎప్పుడంటే..?
శ్రీకల ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై బ్లాక్ స్టూడియోస్ సమర్పణలో యాదగిరి రాజు నిర్మిస్తున్న చిత్రం లింగొచ్చా. ఈ సినిమాతో ఆనంద్ బడా దర్శకునిగా చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. కెరాఫ్ కంచెర పాలెం ఫేమ్ కార్తీక్ రాజు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కార్తీక్కి జోడిగా సుప్యార్దే సింగ్ నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అటు ఇండస్ట్రీ వర్గాల్లో ఇటు ఆడియెన్స్లో లింగొచ్చా అనే టైటిల్కి అనూహ్య స్పందన రావడం చాలా ఆనందంగా ఉందని, ఈ నేపథ్యంలోనే చిత్ర టీజర్ను దసరా కానుకగా అక్టోబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత యాదగిరి రాజు, దర్శకుడు ఆనంద్ బడా తెలిపారు. ఈ సినిమాకు సంగీతాన్ని బికాజ్ రాజ్ అందిస్తున్నారు. నటీనటలు:కార్తీక్ రత్నమ్, సుప్యార్దే సింగ్, బెబీ ఫిదా మొగల్, మాస్టర్ ప్రేమ్ సుమన్,…
‘ఖిలాడి’గా మాస్ మహరాజా
మాస్ మహారాజా రవితేజ హీరోగా, డైరెక్టర్ రమేష్ వర్మ రూపొందించే యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఖిలాడి’ నిర్మాణ సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో హవీష్ క్లాప్ కొట్టగా, ఐ. శ్రీనివాసరాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. ఆదివారం ఉదయమే విడుదల చేసిన ‘ఖిలాడి’ ఫస్ట్ లుక్ పోస్టర్కు అన్నివైపుల నుంచీ అనూహ్యమైన రెస్పాన్స్ లభించింది. టోటల్ బ్లాక్ డ్రస్లో తనదైన స్టైల్ డాన్స్ మూవ్తో ఈ పోస్టర్లో రవితేజ ఆకట్టుకుంటున్నారు. ‘ప్లే స్మార్ట్’ అనేది ఈ సినిమా ట్యాగ్లైన్. రవితేజ డబుల్ రోల్ చేస్తున్న ఈ సినిమాని సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. ఏ స్టూడియోస్తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. హవీష్ ప్రొడక్షన్లో రూపుదిద్దుకుంటున్న ‘ఖిలాడి’ మూవీకి డాక్టర్ జయంతీలాల్ గడ (పెన్) సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. రవితేజ సరసన…
రంగ్దే.. కీర్తిసురేష్ లుక్ చూశారా..
‘ప్రేమ’తో కూడిన కుటుంబ కధా చిత్రం ‘రంగ్ దే’. ఈరోజు చిత్ర కధానాయిక ‘కీర్తిసురేష్’ పుట్టినరోజు సంధర్భంగా ‘రంగ్ దే’ లోని ఓ చిత్రాన్ని విడుదల చేసింది చిత్రం యూనిట్. చిరునవ్వు లొలికిస్తూ ముగ్ధ మోహన రూపంతో కూడిన నాయిక చిత్రం ఆకట్టుకుంటుంది.ఇటీవలే కొద్ది విరామం అనంతరం చిత్రం షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమై నితిన్తో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేసుకుంది. షూటింగ్కు సంబంధించి సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల చివరి వారంలో చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు, ‘ఇటలీ’లో పాటల చిత్రీకరణతో కొద్దిరోజులలోనే చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల అవుతుంది. యువ కథానాయకుడు ‘నితిన్’, మహానటి ‘కీర్తి సురేష్’ల తొలి కాంబినేషన్లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ…
ప్రభాస్ ఫ్యాన్స్ కోసం బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్
“రెబల్ స్టార్” ప్రభాస్ హీరోగా గోపికృష్ణ మూవీస్, యూవి క్రియేషన్స్, డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. బాహుబలి1, బాహుబలి2, సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ని సొంతం చేసుకున్న “రెబల్స్టార్” ప్రభాస్ తన 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. “రెబల్స్టార్” ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తుంది. ఈ చిత్రాన్ని “రెబల్స్టార్” కృష్ణంరాజు గారు సమర్పించగా, వంశీ, ప్రమోద్, ప్రశీదలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎన్నో సూపర్హిట్స్ అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థలు గోపికృష్ణ మూవీస్, యూవి క్రియెషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్లుక్కి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో నవరాత్రులు అలానే అక్టోబర్ 23న రెబల్ స్టార్…
రవితేజ 67వ చిత్ర ప్రీ లుక్ వచ్చేస్తోంది
మాస్ మహారాజా రవితేజ, ‘రాక్షసుడు’ లాంటి బ్లాక్బస్టర్ అందించిన డైరెక్టర్ రమేష్ వర్మ కాంబినేషన్లో ఓ యాక్షన్ థ్రిల్లర్ను నిర్మించేందుకు ప్రముఖ నిర్మాత సత్యనారాయణ కోనేరు సిద్ధమవుతున్నారు. ఏ స్టూడియోస్తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘ఆర్టి67’ (రవితేజ 67వ చిత్రం) ప్రీ లుక్ పోస్టర్ను శనివారం విడుదల చేశారు. ఇందులో స్టైలిష్ డాన్స్ చేస్తున్నట్లున్న రవితేజ షాడో ఇమేజ్ను మనం చూడొచ్చు. ఈ హవీష్ ప్రొడక్షన్ మూవీ ముహూర్తం వేడుక ఆదివారం జరగనున్నది. అదేరోజు ఉదయం 11:55 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయనున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌధరి నాయికగా నటించే ఈ చిత్రంలో డింపుల్ హయతి సెకండ్ హీరోయిన్గా ఎంపికయ్యారు. తారాగణం:రవితేజ, మీనాక్షి చౌధరి, డింపుల్ హయతి సాంకేతిక బృందం:దర్శకుడు: రమేష్ వర్మనిర్మాత: సత్యనారాయణ…
