రాష్ట్రంలో జనవరి 2 నుంచి జనవరి 20 వరకు 20 సెషన్స్లో టెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. పరీక్షలకు 2,05,278 మంది హాజరయ్యారు. వీరిలో రెండు పేపర్లు కలిపి 83,711 (40.78 %) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇందులో పేపర్-1లో 69,476 మంది అభ్యర్థులకుగాను 41,327 (59.48 %) మంది క్వాలిఫై అయ్యారు. ఇక పేపర్-2లో మ్యాథ్స్ అండ్ సైన్స్లో 69,390 మంది పరీక్షకు హాజరుకాగా.. 23,755 (34.24 %) మంది అభ్యర్థులు అర్హత సాధించారు. సోషల్ స్టడీస్ పేపర్లో 66,412 మందికిగాను.. 18,629 (28.205 %) మంది అర్హత సాధించారు. మొత్తానికి పేపర్-1, పేపర్-2 రెండూ కలిపి 2,05,278 మంది పరీక్షలకు హాజరుకాగా.. 83,711 మంది ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణలో…
Author: M.D ABDUL
Pujya Gurudev Sri Sri Ravi Shankar Guruji launches the first song Shiva Shiva Shankara of the much-awaited film Kannappa
In an extraordinary turn of events, the highly awaited film Kannappa has just unveiled its first song Shiva Shiva Shankara on Monday. Making this moment even more special, Pujya Gurudev Sri Sri Ravi Shankar Guruji, the revered founder of the Art of Living Foundation, has graced the occasion by launching the song. This marks the first time Guruji has lent his presence to the music release of a film, making this a truly landmark event. The song has been launched at Sri Sri Ravi Shankar Ji’s ashram in Bangalore, with…
విష్ణు మంచు ‘కన్నప్ప’ నుంచి ‘శివా శివా శంకరా’ పాట విడుదల
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్గా ‘కన్నప్ప’ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. మంచు మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏప్రిల్ 25న ఈ మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కన్నప్ప టీం ప్రమోషన్స్ను మరింతగా పెంచేసింది. మ్యూజికల్ ప్రమోషన్స్లో భాగంగా కన్నప్ప నుంచి ఫస్ట్ సింగిల్ను రిలీజ్ చేశారు. బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్లో శ్రీ శ్రీ రవి శంకర్ గురూజీ చేతుల మీద ఈ పాటను విడుదల చేశారు. బెంగుళూరులోని శ్రీ శ్రీ రవిశంకర్ గారి ఆశ్రమంలో డా.మోహన్ బాబు, విష్ణు మంచు, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, కన్నడ డిస్ట్రిబ్యూటర్ రాక్లైన్ వెంకటేష్, నటి సుమలత, భారతి విష్ణువర్ధన్,…
నవంబర్ నుంచి ‘దేవర 2’ షూటింగ్ మొదలు…
ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ భారీ అంచనాల మధ్య వచ్చి బాక్సాఫీస్ దండయాత్ర చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో సీక్వెల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ‘దేవర పార్ట్-2’ స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. స్క్రీన్ ప్లే, కీలక సన్నివేశాలను ఆసక్తికరంగా మలిచేందుకు డైరెక్టర్ కొరటాల శివ, తన టీమ్తో గత కొన్ని వారాలుగా వర్క్ చేస్తున్నారు. అయితే ఈ ఏడాది నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇంకా అధికారిక అప్డేట్ రానప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్గా మారింది. కాగా ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటించారు. సైఫ్అలీ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అనిరుధ్ మ్యూజిక్ అందించారు. అలాగే, ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్,…
నా భర్తతో పెళ్లి మాత్రమే అయింది : సాక్షి అగర్వాల్
నటి సాక్షి అగర్వాల్ జనవరి 2, 2025న తన చిరకాల స్నేహితుడు నవనీత్ను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం గోవాలో జరిగింది.పెళ్లి తర్వాత కూడా సాక్షి అగర్వాల్ సినిమాల్లో నటిస్తున్నారు. సాక్షి అగర్వాల్ తాజాగా ఓ ఇంటర్య్వూలో తన వైవాహిక జీవితంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమా షూటింగ్ల్లో బిజీగా ఉండటం వల్ల ఇంకా వైవాహిక జీవితం ప్రారంభించలేదని సాక్షి చెప్పుకొచ్చింది. పెళ్లి మాత్రమే అయిందని, సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉండటం వల్ల వైవాహిక జీవితానికి టైమ్ కేటాయించలేదని ఈ భామ తెలిపింది. అయితే వాలెంటైన్స్ డే కోసం తమిళనాడు అంతా ట్రిప్ ప్లాన్ చేసుకున్నామని, ఆ తర్వాత యూరప్లో హనీమూన్కి వెళ్లాలని అనుకుంటున్నామని సాక్షి అగర్వాల్ చెప్పుకొచ్చింది.
చైతన్యను చూస్తుంటే గర్వంగా ఉంది : నాగార్జున
‘తండేల్’ మూవీ హిట్ కావడంపై అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నాగ చైతన్యను చూస్తుంటే తండ్రిగా గర్వంగా ఉందని ఆయన ఆ పోస్టులో రాసుకొచ్చారు. ‘తండేల్’ సినిమా విజయం సాధించడంపై చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. సాయి పల్లవిని డామినేట్ చేసిన ఏకైక హీరో ఈ మేరకు ఆ పోస్టులో.. ఈ సినిమా కోసం నువ్వు సవాళ్లు ఎదుర్కోవడం, నటుడిగా పరిధులు దాటడం చూశాను. ‘తండేల్’ సినిమా మాత్రమే కాదు, నీ ప్యాషన్, కష్టానికి నిదర్శనం అని నాగ చైతన్యను మెచ్చుకున్నారు. అక్కినేని అభిమానులు అంతా కుటుంబ సభ్యుల్లాగా ఎప్పుడూ మా వెన్నంటే ఉన్నారని తెలిపారు. ఫ్యాన్స్ ప్రేమకు, సపోర్టుకు ధన్యవాదాలు అని చెప్పారు. అలానే సాయి పల్లవిపై కూడా ప్రశంసలు కురిపించారు. దేవిశ్రీ ప్రసాద్ నువ్వు రాకింగ్. రైజింగ్ స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి,…
‘పుష్ప-2’పై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు
విశ్వక్ సేన్ నటించిన ‘లైలా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు చీఫ్ గెస్ట్గా వచ్చిన చిరంజీవి ‘పుష్ప-2’పై కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై చిరంజీవి మాట్లాడుతూ..అభిమానం వేరు, వ్యక్తిగతం వేరు. ఓ వ్యక్తి మన మనిషి కాదని, దూరం పెట్టడం సరి కాదని చిరంజీవి వ్యాఖ్యానించారు.ఇండస్ట్రీలో హీరోలంతా ఒకటే అని, ఇండస్ట్రీలో అందరూ ఒకటే అని మేసేజ్ని ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. మన ఇమేజ్, ఫ్యాన్ బేస్ పెరగాలంటే మనం చేసే సినిమా ఇస్తుంది తప్ప.. మనల్ని మనం దూరం చేసుకోవడం కాదంటూ హీరోలకు హితవు పలికారాయన. అలాగే ‘పుష్ప 2’ సినిమా పెద్ద హిట్ అయ్యింది. దానికి నేను గర్విస్తానని. ఇండస్ట్రీలో ఒక సినిమా బాగా ఆడింది అంటే ప్రతి ఒక్కరూ హర్షించాలని చిరంజీవి కోరారు. ఓ సినిమా హిట్ అయితే ఎంతో…
Aishwarya Rajesh Graces ‘Kolors Healthcare’ Event
▪️ Grand launch of ‘Kolors Healthcare 2.0’ unit ▪️ Just like ‘Sankranthiki Vastunnam’ movie, ‘Kolors’ should also be a blockbuster: Aishwarya Rajesh Aishwarya Rajesh, the fame of Sankranthiki Vastunnam movie, made a special appearance at the Banjara Hills branch of Kolors Healthcare. On this occasion, she inaugurated the new ‘Kolors Healthcare 2.0’ unit and personally reviewed the advanced healthcare services offered by the company. Speaking at the event, Aishwarya Rajesh emphasized the importance of healthcare for everyone. She appreciated the efforts of Kolors Healthcare in providing quality services using modern…
‘కలర్స్ హెల్త్ కేర్’లో ఐశ్వర్య రాజేష్ సందడి
▪️ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ మాదిరిగానే ‘కలర్స్’ కూడా బ్లాక్బస్టర్ కావాలి ▪️ ఘనంగా ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్ని ప్రారంభోత్సవం ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఫేమ్ ఐశ్వర్య రాజేష్ ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్’ (Kolors Healthcare) బంజారా హిల్స్ బ్రాంచీలో సందడి చేసింది. ఈ సందర్భంగా ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్ని ప్రారంభించింది. ఆధునిక టెక్నాలజీతో ఈ సంస్థ అందిస్తున్న సేవలను ఆమె స్వయంగా పరిశీలించింది. అనంతరం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరికీ హెల్త్ కేర్ ఎంతో ముఖ్యమని, ఈ సేవలను ఎంతో నాణ్యంగా, ఆధునిక టెక్నాలజీతో అందిస్తున్న ‘కలర్స్’ సంస్థ నిర్వాహకులను ఆమె అభినందించింది. ప్రతి ఒక్కరూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాము. అలాంటి సేవలను అందిస్తూ ఎంతో మందిని ఆరోగ్యపరంగా సంతృప్తి పరిచిన సంస్థ…
అంతర్జాతీయ అవార్డులు అందుకున్న “హ్యాట్సాఫ్ పోలీస్”
హ్యాట్సాఫ్ పోలీస్ చిత్రానికి అవార్డుల పరంపర కొనసాగుతుంది, 9వ తేది ఆదివారం హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఆడిటోరియం, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ లో ఇంటర్నేషనల్ మెగా ఫిల్మ్ ఫెస్టివల్ 2025 కార్యక్రమంలో ఉత్తమ నటుడు అవార్డును ప్రముఖ సినీ దర్శకులు, చిత్ర కథానాయకుడు రెడ్డెం యాదకుమార్ మరియు ఉత్తమ చిత్రం అవార్డును చిత్ర రచయిత, దర్శకులు జీ.వి. త్రినాధ్ లు ముఖ్య అతిథి ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు ఇండియన్ పొలిటీషియన్ వేణుగోపాలా చారి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాధా మనోహర్ దాస్, సినీ నటులు పుష్ప మహేష్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అవార్డుల ప్రధానం అనంతరం అతిధులు మాట్లాడుతూ రెండు అంతర్జాతీయ అవార్డులు అందుకోవడం అభినందనీయం అని మరిన్ని సమాజ హిత చిత్రాలు వీరి ద్వారా నిర్మితం అవ్వాలని, చిత్ర నిర్మాతలు పైడి…