కళింగ ఆర్ట్ క్రియేషన్స్ బేనర్ పై గూన అప్పారావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం `విప్లవ సేనాని వీర గున్నమ్మ`. ఆదిత్య భరద్వాజ్, మహీరా హీరో హీరోయిన్లుగా నటించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా 1940 ఏప్రిల్ 1న జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం సెన్సార్ పనుల్లో ఉంది. డిసెంబర్ మూడో వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత గూన అప్పారావు మాట్లాడుతూ…“ శ్రీకాకుళం జిల్లాలోని మందస ప్రాంతంలో జరిగిన జమీందారి వ్వతిరేఖ పోరాటం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ పోరాటాన్ని … సంఘటన స్థలంలోనే భారీగా చిత్రీకరించాం. అప్పుడు జరిగిన పోరాటంలో ఐదుగురు రైతులతో పాటు , ఇద్దరు పోలీసులు మృతి చెందుతారు. మరో…