•కంటోన్మెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ జివి.వెన్నెల గద్దర్ హిమాయత్నగర్, ప్రజాతంత్ర, మార్చి 03 : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి గడిచిన 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కంటోన్మెంట్ బోర్డు టీపీటీ నిధులను ఇటీవల రాష్ట్ర సీఎం ఎ.రేవంత్ రెడ్డి విడుదల చేయడం హర్షనీయమని కంటోన్మెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ డాక్టర్ జివి.వెన్నెల గద్దర్ అన్నారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తన విజ్ఞప్తి మేరకు సీఎం ఎ.రేవంత్ రెడ్డి పెండింగ్ లో ఉన్న రూ.48 కోట్ల 50 లక్షలు విడుదల చేయడం జరిగిందని గుర్తు చేశారు. దీనికి కంటోన్మెంట్ బోర్డు తరపున ఆమె సీఎం ఎ.రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.కంటోన్మెంట్ బోర్డు టీపీటీ నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వ…