తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న చిత్రాలో సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ హైప్ ఉంది. కాగా ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ముఖ్యపాత్రలో నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్నారట. ఆస్కార్ అవార్డు గ్రహిత కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ మూవీని నిర్మాత కె.ఎల్ నారాయణ ఇంచుమించు రూ. 1,000 కోట్ల బడ్జెట్తో నిర్మిస్తున్నారట. రెండు భాగాలుగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ నుండి, తాజాగా మొదటి భాగం విడుదలకి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. రిపోర్ట్ ప్రకారం, ఈ చిత్రాన్ని మార్చి 25, 2027 న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు- ఫిలిం సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు రెండో భాగాన్ని 2029 లో విడుదల…