శ్రీకృష్ణ క్రియేషన్స్ బేనర్ పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా ` రూపొందుతోన్న చిత్రం`మా ఊరి పొలిమేర-2`. డా.అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెలాఖరులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ మాట్లాడుతూ…“సత్యం రాజేష్ నాకు మంచి మిత్రుడు. ఓటీటీలో తను నటించిన `మా ఊరి పొలిమేర` చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. దానికి సీక్వెల్ గా రూపొందుతోన్న `మా ఊరి పొలిమేర-2` టీజర్ కూడా చాలా…
