దిల్ రాజుగారిని అబాసు పాలు చేయొద్దు.. చిల్లర ప్రయత్నాలు మానుకోండి : ‘బలగం’ వివాదంపై వేణు ఎల్దండి

దిల్ రాజుగారిని అబాసు పాలు చేయొద్దు.. చిల్లర ప్రయత్నాలు మానుకోండి : ‘బలగం’ వివాదంపై వేణు ఎల్దండి

తెలంగాణ సంస్కృతి, సాంప్ర‌దాయాల‌ను ప్ర‌తిబింబిస్తూ రూపొందిన చిత్రం ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీధర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై వేణు ఎల్దండి ద‌ర్శ‌క‌త్వంలో హ‌ర్షిత్‌, హ‌న్షిత నిర్మించిన ఈ చిత్రం మార్చి 3న థియేట‌ర్స్‌లో విడుద‌లైంది. స‌క్సెస్‌ఫుల్ టాక్‌తో మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకుంటుంది. ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల‌ను సైతం సినిమా ఆక‌ట్టుకుంటోంది. మ‌నంద‌రి జీవితాల్లో జ‌రిగిన , మ‌నం చూసిన ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని మ‌నిషికి బందాలే గొప్ప బ‌లం.. బ‌ల‌గం అనే చాటి చెప్పేలా సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమా క‌థ నాదంటూ జ‌ర్న‌లిస్ట్ గ‌డ్డం స‌తీష్ అనే వ్య‌క్తి మీడియా ముందు ఆరోప‌ణ‌లు చేశారు. ఈ వ్య‌వ‌హారంపై చిత్ర ద‌ర్శ‌కుడు వేణు ఎల్దండి మాట్లాడుతూ .. ‘‘మాది చాలా పెద్ద…