జాతీయ అవార్డ్ గ్రహీత తనీష్ ఛటర్జీ, వెర్సటైల్ యాక్టర్ సత్య ఫేమ్ జె.డి.చక్రవర్తి ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నైజీరియాలో జరిగిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో దహిణి సినిమాను ప్రదర్శించారు. ఆ చిత్రంలో నటనకుగానూ ఉత్తమ నటిగా తనీష్ ఛటర్జీ, ఉత్తమ సహ నటుడిగా జె.డి.చక్రవర్తి అవార్డులను గెలుచుకున్నారు. జాతీయ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్, అంతర్జాతీయ స్థాయిలో విమర్శకులు ప్రశంసలు అందుకున్న దర్శకుడు రాజేష్ టచ్ రివర్ దర్శకత్వంలో దహిణి చిత్రం తెరకెక్కింది. పద్మశ్రీ అవార్డ్ గ్రహీత సునీతా కృష్ణన్ ఈ సినిమాను నిర్మించారు. తెలుగు సినిమాల్లోనే కాదు ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి ఇండియన్ సినిమాల్లోనే విలక్షణ నటుడిగా గుర్తింపు సంపాదించుకున్న జె.డి.చక్రవర్తి తొలిసారి దహిణి చిత్రంతో అంతర్జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంతో తను ప్రతాప్ బాబు అనే…