మహమ్మారి కరోనా కారణంగా అనేక ఇతర సమస్యల గురించి వివరణ.. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ పేర్ని నాని ఆహ్వానం మేరకు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధులు సమావేశమై తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై తమ ఆందోళన వ్యక్తం చేశారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జగన్ మోహన్ రెడ్డి గారు ఓపికగా అర్థం చేసుకోవడం మరియు మా ఆందోళనలన్నింటికీ సానుకూలంగా స్పందించడం అలాగే సమీప భవిష్యత్తులో మా ఆందోళనలన్నీ అనుకూలంగా పరిష్కరించబడతాయని హామీ ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు.మన తెలుగు రాష్ట్రాలను కరోనా మహమ్మారి కారణంగా ఇతర సమస్యల రాష్ట్ర విభజన తాకిడికి గురైన పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితి కారణంగా, మా పరిశ్రమ అత్యంత దయనీయ మైన పరిస్థితిలో ఉంది. వివిధ…
Category: FILM NEWS
‘రిపబ్లిక్’ సాయితేజ్ కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుంది: ఐశ్వర్యా రాజేశ్
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. దేవ కట్టా దర్శకుడిగా జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ ఇంటర్వ్యూ విశేషాలు… మేం ఉండేది చెన్నైలోనే అయితే ఆహారంతినే పద్దలు అన్నీ మన తెలుగువాళ్లలాగానే ఉంటాయి. ఉదాహరణకు తమిళులు సాంబార్లో కూరలు కలుపుకుని తింటారు. కానీ మన తెలుగువాళ్లు అన్నంలో కలుపుకుని తింటారు. మేం ఎప్పుడైన ఫంక్షన్స్కు వెళ్లినప్పుడు మన స్టైల్లో తింటుంటే విచిత్రంగా చూస్తుంటారు. నేను చేపలు పులుసు, చికెన్ కూర బాగా చేస్తాను. మిగతా వంటలను కూడా బాగా చేస్తాను. ఓ రోజు దేవకట్టాగారు ఫోన్ చేసి రిపబ్లిక్ సినిమా గురించి చెప్పి మైరా పాత్ర ఉందని…
తళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్రాజు నిర్మాతగా భారీ చిత్రం
అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు తళపతి విజయ్. తను చేసే ప్రతి సినిమాతో అతని పాపులారిటీ మరింతగా పెరుగుతోంది. విజయ్ తన 66వ సినిమాను నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై జాతీయ అవార్డు గెలుచుకున్న నిర్మాత దిల్ రాజు, శిరీష్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు.ఈ రోజు ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. తళపతి విజయ్, వంశీ పైడిపల్లి మరియు దిల్ రాజు కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ పై అటు ప్రేక్షకుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో విపరీతమైన బజ్ నెలకొని ఉంది. సినిమా రంగం పట్ల అభిరుచి, నైపుణ్యం కలిగిన వ్యక్తుల కలయికతో ఈ సినిమా ఒక క్రేజీ ప్రాజెక్ట్గా మారింది.ప్రస్తుతం విజయ్ నెల్సన్ దర్శకత్వంలో చేస్తోన్న తన…
Thalapathy Vijay’s 66th Film With Vamshi Paidipally and Dil Raju
With a massive following among all sections Thalapathy Vijay’s popularity has been growing even bigger with every film that he does. For his next movie Thalapathy Vijay will be teaming up with National Award-Winning director Vamshi Paidipally. This film will be produced by the National-Award winning producer Dil Raju & Shirish under their production house Sri Venkateswara Creations. The leading production house will be mounting up this big-budgeted film on a grand scale.The film has been announced officially today, much to the contentment of fans and movie buffs.Given the collaboration…
‘రిపబ్లిక్’ అద్భుత విజయాన్ని సాధించాలి: ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవర్స్టార్ పవన్కళ్యాణ్
అక్టోబర్ 1న విడుదల సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. దేవ కట్టా దర్శకుడిగా జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదలవుతుంది. శనివారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ వేడుకకి పవర్స్టార్ పవన్కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో…పవర్స్టార్ పవన్కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘నేనెప్పుడూ తేజ్ ఫంక్షన్స్కు రాలేదు. తన మొదటి సినిమా సమయంలో వచ్చానని అనుకుంటున్నాను. దానికి కారణం.. ఇంట్లో మా అక్కయ్య కొడుకుగా తనను ట్రైనింగ్ పంపించి ఏదైనా చేయొచ్చు. . గోకులంలో సీత సినిమా విషయానికి వచ్చేసరికి అన్నయ్య సపోర్ట్ తీసుకోలేదు. ఏ సినిమా వచ్చిందో అలాగే చేశాను. అలాగే తేజ్ కానీ, వైష్ణవ్ కానీ..…
‘విక్రమ్’లోని ‘కలయా నిజమా..’ పాట విడుదల
‘విక్రమ్’ చిత్రంలోని ” కలయా నిజమా..” అంటూ సాగే లిరికల్ వీడియో పాటను ప్రముఖ సినీ గీత రచయిత చంద్రబోస్ విడుదలచేశారు.నాగవర్మను హీరోగా పరిచయం చేస్తూ, హరిచందన్ దర్శకత్వంలో ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. హీరో నాగవర్మ సరసన దివ్యాసురేశ్ కథానాయికగా నటించింది.*కాగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్లో విడుదలకు సన్నద్ధమవుతోంది.ఈ నేపథ్యంలో చంద్రబోస్ చేతుల మీదుగా ఈ పాటను విడుదల చేశారు.అనంతరం ముఖ్య అతిథి చంద్రబోస్ మాట్లాడుతూ, “కలయా నిజమా… అనే పల్లవితో సాగే ఈ పాటలో రచయిత కాసర్ల శ్యామ్ అద్భుతమైన సాహిత్యాన్ని పొందుపరిచారు. చిత్రంలో సందర్భాను సారంగా వచ్చే విషాదభరిత ఈ పాట గుండెలను పిండేశాలా ఆకట్టుకుంటోంది. హీరో నాగవర్మ తన హావభావాలతో పాటను రక్తికట్టించారు. సురేష్ ప్రసాద్ సంగీతం, సత్య మాస్టర్…
‘మాతృదేవోభవ’ (ఓ అమ్మ కథ) పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి
శ్రీవాసవి మూవీస్ పతాకంపై కె.హరనాథ్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చోడవరపు వెంకటేశ్వరావు నిర్మాతగా అరంగేట్రం చేస్తున్న చిత్రం “మాతృదేవోభవ”. ‘ఓ అమ్మ కథ’ అన్నది ఉప శీర్షిక. సీనియర్ నటి సుధ తన కెరీర్ లో తొలిసారి టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ చిత్రం ద్వారా పతంజలి శ్రీనివాస్-అమృతా చౌదరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ప్రముఖ రచయిత మరుదూరి రాజా సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రంలో సుమన్, రఘుబాబు, పోసాని, చమ్మక్ చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.షూటింగ్ తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు కె.హరనాథ్ రెడ్డి మాట్లాడుతూ… “ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని అవమానవీయ సంఘటనలకు అద్దం పడుతూ ప్రముఖ రచయిత కె.జె.ఎస్.రామారెడ్డి (సితారె) రాసిన కథతో ఈ చిత్రాన్ని రూపొందించాం. భర్తను కోల్పోయి పిల్లల కోసమే…
Naga Shaurya,Ritu Varma stared Varudu Kaavalenu releasing in October 15 on the ocassion of Dussehra.
Young Hero Naga Shaurya and Heroine Ritu Varma starer Varudu Kaavalenu under the direction of Lakshmi Sowjanya in the production of prestigious banner Sitara Entertainments.Makers have announced through a poster that they’re releasing the movie on the auspicious day if Dussehra on October 15.“Varudu Kaavalenu will be a mix of Love,fun,emotional ride and audience will love it”Already the songs Kola Kale ilaa‘ and ‘Digu Digu Naga,‘Manasulone Nilichipoke Maimarapula Madhurima” which got released won the hearts of audience.Recently released teaser has received tremendous response from both audience and social media.First glimpse,…
అక్టోబర్ 15న నాగశౌర్య-రీతువర్మల ‘వరుడు కావలెను‘ విడుదల
అక్టోబర్ 15న నాగశౌర్య-రీతువర్మల ‘వరుడు కావలెను‘ విడుదలప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘. ఈ చిత్రాన్ని విజయదశమి పర్వదినాన అక్టోబర్ 15 న విడుదల చేయనున్నట్లు నేడు అధికారికంగా ప్రకటిస్తూ ఓ ప్రచారచిత్రాన్ని విడుదల చేశారు. ఇప్పటికే చిత్రం నుంచి విడుదల అయిన ‘‘‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ఎలా’, అలాగే ‘దిగు దిగు నాగ’, ‘‘మనసులోనేనిలిచి పోకె మైమరపుల మధురిమ పాటలు బహుళ ప్రజాదరణ పొందినాయి. దీనికి ముందు ఇప్పటివరకు విడుదల చేసిన చిత్రాలు, ప్రచార చిత్రాలు వంటి వాటికి కూడా ప్రేక్షకాభిమానులనుంచి ఎన్నో ప్రశంసలు లభించాయి. సామాజిక మాధ్యమాలలో కూడా వీటికి ప్రాచుర్యం లభించింది.ప్రస్తుతం…
అక్టోబర్ 2న ‘ఇదే మా కథ’ విడుదల
ప్రపంచంలోని చాలా మంది వ్యక్తులకు తమ కలల గమ్యస్థానానికి వెళ్లాలనే కోరిక ఉంటుంది. అలా విభిన్న నేపథ్యం ఉన్న నలుగురు బైక్ రైడర్లు తమ గమ్యానికి చేరుకునే మార్గంలో ఒకరికొకరు పరిచయమై ఒకరి గురించి మరొకరు ఏం తెలుసుకున్నారు? గమ్యానికి ఎలా చేరుకున్నారు? అనే ఆసక్తికర కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే మా కథ.ఈ రోడ్ జర్నీ చిత్రంలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించారు. గురు పవన్ దర్శకత్వంలో శ్రీమతి మనోరమ సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ గొల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు.టాలీవుడ్ లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కాన్సెప్ట్ టీజర్ను ఇటీవల విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేశారు. ఆ టీజర్కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది.…
