కోలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత కె. రాజన్ (85) ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఆయన అడయార్ కూవం నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే 85 ఏళ్ళ వయస్సులో రాజన్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. కుటుంబ సమస్యల వలనే ఆయన సూసైడ్ చేసుకున్నారని టాక్. ఏడాదిగా రాజన్.. కుటుంబంతో కలిసి ఉండడం లేదని, హోటల్ లో ఉండడం వలన రోజు కూతురు భోజనం తీసుకోని వస్తోందని తెలుస్తోంది. రాజన్ ‘బ్రహ్మసరిగళ్’ చిత్రంతో తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన చెన్నై డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. నిర్మాతగానే కాకుండా డైరెక్టర్ గా, రైటర్ గా కూడా వర్క్ చేశారు. నటుడిగా…
