Promising young hero Naga Shaurya’s landmark 20th film ‘LAKSHYA’ is currently in post-production stages. Santhossh Jagarlapudi is directing the film where Ketika Sharma is paired opposite Naga Shaurya.Presented by Sonali Narang, the film is produced by Narayan Das K. Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar in Sree Venkateswara Cinemas LLP, and Northstar Entertainment Pvt Ltd banners.The makers yesterday unveiled a poster asking netizens to speculate release date of the film. The poster showed four different dates. The makers came up with a new poster today and it confirms, Lakshya…
Category: FILM NEWS
‘లైగర్’ సెట్లో డైరెక్టర్ పూరిజగన్నాధ్ బర్త్డే సెలబ్రేషన్స్
మోస్ట్ హ్యపెనింగ్ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాధ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ లైగర్. సాలా క్రాస్ బ్రీడ్ అనేది ట్యాగ్లైన్. ప్యాన్ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ సినిమాపై అటు అభిమానుల్లో ఇటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం లైగర్ చిత్రీకరణ గోవాలో జరుగుతుంది. ఈ రోజు(సెప్టెంబరు 28) డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా లైగర్ సెట్లో పూరిజగన్నాధ్ బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరిగాయి. ఈ వేడుకల్లో చిత్ర యూనిట్ సమక్షంలో బర్త్డే కేక్ కట్ చేశారు పూరి జగన్నాధ్. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి.లైగర్ చిత్రం ద్వారా ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ మొదటి సారిగా ఇండియన్ స్క్రీన్కు పరిచయమవున్నారు. ఈ అనౌన్స్మెంట్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇండియా వైడ్…
నిజ జీవితాలే ‘హంస’కు ప్రేరణ : దర్శకుడు సయ్యద్ గఫార్
‘హంస’ షార్ట్ ఫిలిం ఈనెల 18 తేదీన శనివారం సాయంత్రం రవీంద్ర భారతిలో జరిగే ‘సినివారం’ కార్యక్రమంలో ప్రదర్శించారు ఒక రచయిత, దర్శకుడు ఓ కథను ఇలాగే చెప్పాలి అనుకుంటారు. తీరా ఆ కథ నిర్మాతల దగ్గరికి వెళ్లేసరికి దాన్ని వాళ్లు కమర్షియల్ చూపులో చూస్తారు. కథల్లోకి కమర్షియాలిటీ చొరబడిందంటే ఆ కథను ఉన్నది ఉన్నట్టు చూపించలేం. సినిమాల్లో ఎక్కువగా జరుగుతున్నది ఇదే. అప్పుడు కమర్షియల్ అంశాలు అంటూ కథలో కొత్త కొత్త మార్పులు సూచిస్తారు. తప్పని పరిస్థితుల్లో మనసు చంపుకుని ఆ మార్పులకు నడుం బిగిస్తున్నారు కొందరు రియలిస్టిక్ కథలను, సినిమాలను ఇష్టపడే రచయితలు, దర్శకులు. మీరలా కథను చప్పగా తీస్తే చూసే ప్రేక్షకులు థ్రిల్ ఫీలవ్వరు కాబట్టి మార్పులు చెయ్యవల్సిందే అంటారు. కాదంటే అవకాశం చేజారుతుంది. వాళ్లు అవునన్నట్టు తలూపితే ఓ సినిమా పడుతుంది.…
తనిష్క్ రెడ్డి, అంకిత సాహు హీరోహీరోయిన్లుగానటిస్తున్న చిత్రం ప్రారంభం
తనిష్క్ రెడ్డి ఎంటర్టైన్మెంట్ సమర్పణలో ఏ.వి క్రియేటివ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ పతాకంపై తనిష్క్ రెడ్డి, అంకిత సాహు హీరోహీరోయిన్లుగా మాధవ్ మూర్తి దర్శకత్వంలో రిచా భట్నాగర్, విజయ లక్ష్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్ర పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వెంకట్ యాదవ్(ప్రవీణ్ యాదవ్) తొలి ముహూర్తపు సన్నివేశానికి హీరో, హీరోయిన్ పై క్లాప్ కొట్టగా, జ్యోత్స్న కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అనంతరం చిత్ర యూనిట్ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హీరో తనిష్క్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘చిత్ర నిర్మాతలు బ్యాక్ ఎండ్లో ఉండడం వలన నేను తనిష్క్ రెడ్డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ను ఎగ్జిక్యూట్ చేయవలసి వచ్చింది. నన్ను హీరోని చేసిన వెంకట్ గారికి, మరియు నిర్మాతలకు ధన్యవాదాలు. మా…
ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నటుడు పైడి జయ రాజ్: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్
బాలీవుడ్ లో మొదటి తరం హీరోల్లో ఒకరిగా స్టార్ ఇమేజ్ అందుకుని విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన మహా నటుడు పైడి జయ రాజ్. తెలంగాణ ప్రాంతం నుండి మూకీల సమయంలోనే హీరోగా బాలీవుడ్ లో నిలదొక్కుకున్న నటుడు. సెప్టెంబర్ 28న అయన 112వ జన్మదినం సందర్బంగా జయంతి వేడుకలు మంగళవారం ఫిలిం ఛాంబర్ లో ప్రముఖ నటుడు జైహింద్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పైడి జయ రాజ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అయన మాట్లాడుతూ .. పైడి జయరాజ్ తెలంగాణ నటుడు. అప్పట్లో అందరు సినిమాల్లో రాణించాలని…
గోవాలో రెండో షెడ్యూల్ జరుపుకోనున్న’రొమాంటిక్ రివెంజ్’
కె.ఆర్.ప్రొడక్షన్ పతాకంపై రమేష్ కావలి దర్శకత్వంలో అర్జున్ ఆర్య, కావ్య, బెల్లంకొండ సుదర్శన్ రామ్, వర్మ, శ్రీజడే, తేజశ్వని దేశాయ్, రాముప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షకీలగారి సెలబ్రిటీస్ గ్రూప్ సమక్షంలో భువనేశ్వరి ప్రాపర్టీస్ సి.ఇ.ఒ. ఆర్. ఆనంద్ స్వామి గారి ఆశీస్సులతో.. రమేష్ సిద్ధు ప్రొడక్షన్ మ్యాన పవర్ సపోర్ట్ తో ‘రొమాంటిక్ రివెంజ్’ మువీని ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో గ్రాండ్ గా పూర్తి చేసుకుంది. వచ్చేనెల మొదటి వారంలో గోవాలో షెడ్యూల్ ని పూర్తి చేస్తాం. కె.ఆర్.డిజిటల్ ఒ.టి.టి. ద్వారా మా చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తాం. అలాగే… మా సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి థియేటర్లలో కూడా ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకువస్తాం. అలాగే మా కెమెరామెన్ తాజ్ (జిడికె) అద్భుతమైన పనితీరుతో సినిమా మరింత అందంగా తయారవుతోంది. అర్జున్ ఆర్య, కావ్య,…
ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మాత వెంకట్ ఇక లేరు
ఆర్.ఆర్.మూవీ మేకర్స్ నిర్మాత వెంకట్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో మృతి చెందారు. ఆయన పూర్తి పేరు జె .వి వెంకట్ ఫణింద్ర రెడ్డి. తెలుగు సినిమా రంగంలో వెంకట్ అంటే తెలియనివారు వుండరు . కొన్ని రోజుల నుంచి ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని తెలిసింది.. చికిత్స కోసం హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. సోమవారం ఉదయం 5. 30 గంటలకు తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు . వెంకట్ వయసు 57 సంవత్సరాలు. తెలుగులో ది ఎండ్ , సామాన్యుడు , మాయాజాలం ,హంగామా, గుండమ్మగారి మనవడు, బహుమతి, కిక్, ప్రేమ కావాలి, డాన్ శ్రీను, పైసా , ఢమరుకం, బిజినెస్ మెన్ , లవ్లీ, విక్టరీ, ఇంగ్లిష్ లో డివోర్స్ ఇన్విటేషన్ చిత్రాలను నిర్మించారు .…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమ
మహమ్మారి కరోనా కారణంగా అనేక ఇతర సమస్యల గురించి వివరణ.. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ మంత్రి శ్రీ పేర్ని నాని ఆహ్వానం మేరకు, తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రతినిధులు సమావేశమై తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై తమ ఆందోళన వ్యక్తం చేశారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ప్రభుత్వానికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాము. జగన్ మోహన్ రెడ్డి గారు ఓపికగా అర్థం చేసుకోవడం మరియు మా ఆందోళనలన్నింటికీ సానుకూలంగా స్పందించడం అలాగే సమీప భవిష్యత్తులో మా ఆందోళనలన్నీ అనుకూలంగా పరిష్కరించబడతాయని హామీ ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు.మన తెలుగు రాష్ట్రాలను కరోనా మహమ్మారి కారణంగా ఇతర సమస్యల రాష్ట్ర విభజన తాకిడికి గురైన పరిశ్రమలో ప్రస్తుత పరిస్థితి కారణంగా, మా పరిశ్రమ అత్యంత దయనీయ మైన పరిస్థితిలో ఉంది. వివిధ…
‘రిపబ్లిక్’ సాయితేజ్ కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుంది: ఐశ్వర్యా రాజేశ్
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. దేవ కట్టా దర్శకుడిగా జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్యా రాజేశ్ ఇంటర్వ్యూ విశేషాలు… మేం ఉండేది చెన్నైలోనే అయితే ఆహారంతినే పద్దలు అన్నీ మన తెలుగువాళ్లలాగానే ఉంటాయి. ఉదాహరణకు తమిళులు సాంబార్లో కూరలు కలుపుకుని తింటారు. కానీ మన తెలుగువాళ్లు అన్నంలో కలుపుకుని తింటారు. మేం ఎప్పుడైన ఫంక్షన్స్కు వెళ్లినప్పుడు మన స్టైల్లో తింటుంటే విచిత్రంగా చూస్తుంటారు. నేను చేపలు పులుసు, చికెన్ కూర బాగా చేస్తాను. మిగతా వంటలను కూడా బాగా చేస్తాను. ఓ రోజు దేవకట్టాగారు ఫోన్ చేసి రిపబ్లిక్ సినిమా గురించి చెప్పి మైరా పాత్ర ఉందని…
తళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్రాజు నిర్మాతగా భారీ చిత్రం
అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు తళపతి విజయ్. తను చేసే ప్రతి సినిమాతో అతని పాపులారిటీ మరింతగా పెరుగుతోంది. విజయ్ తన 66వ సినిమాను నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయనున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై జాతీయ అవార్డు గెలుచుకున్న నిర్మాత దిల్ రాజు, శిరీష్ భారీ స్థాయిలో నిర్మించనున్నారు.ఈ రోజు ఈ సినిమాని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. తళపతి విజయ్, వంశీ పైడిపల్లి మరియు దిల్ రాజు కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ పై అటు ప్రేక్షకుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో విపరీతమైన బజ్ నెలకొని ఉంది. సినిమా రంగం పట్ల అభిరుచి, నైపుణ్యం కలిగిన వ్యక్తుల కలయికతో ఈ సినిమా ఒక క్రేజీ ప్రాజెక్ట్గా మారింది.ప్రస్తుతం విజయ్ నెల్సన్ దర్శకత్వంలో చేస్తోన్న తన…
