ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘పుష్ప ది రైజ్’ భారీ అంచనాల మధ్య డిసెంబర్ 17న పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో కూడా మంచి వసూళ్ళతో దూసుకుపోతోంది. అయితే సినిమా పరంగా కాకుండా ఈ సినిమాలో ఐకాన్ స్టార్ నటనకి మాత్రం ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు. పుష్ప రాజ్ గా ఐకాన్ స్టార్ చేసిన నటన వీరలెవెల్లో ఉందంటున్నారు. మరి అల్లు అర్జున్ నటనపై ఇప్పుడు సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఓ రేంజ్ లో తన ఆనందంతో బన్నీని ఎలివేట్ చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ ఒక హైపర్ సోనిక్ మిస్సైల్ కన్నా తక్కువ కాదని, ప్రతి ఒకరూ…
Category: FILM NEWS
సభ్యత్వాలను వెంటనే పూర్తి చేయాలి.. నిర్లక్ష్యం చేస్తే ప్రత్యామ్నాయ చర్యలు తప్పవు: కే.విరాహత్ అలీ
మన యూనియన్ రాష్ట్ర కార్యవర్గం తీసుకున్న నిర్ణయం మేరకు అన్ని జిల్లాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేసి జిల్లా మహాసభలు నిర్వహించాలని కోరుతున్నాం. యూనియన్ పిలుపుపై స్పందించి ఇప్పటికే పలు జిల్లాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తి దశకు చేరుకుంది. కొన్ని జిల్లాలు సభ్యత్వాల జాబితాను కార్యాలయంలో సమర్పించి మహాసభలకు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం సభ్యత్వాల సేకరణ, మహాసభల నిర్వహణ పట్ల జిల్లా శాఖల బాధ్యులు నిర్లక్ష్యం వహిస్తుండడం సరైంది కాదు. డిసెంబర్ చివరి కల్లా సభ్యత్వాల నమోదు, మహాసభలు పూర్తి చేయాలనే రాష్ట్ర కార్యవర్గ నిర్ణయాన్ని ధిక్కరించడం విచారకరంగా భావిస్తున్నాం. ఏది ఏమైనా జనవరి మొదటి వారం లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయని జిల్లాల్లో రాష్ట్ర కార్యవర్గమే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోక తప్పదని సూచిస్తున్నాం. -నగునూరి శేఖర్…
ఆలేరులో కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి వర్ధంతి
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి 10వ వర్ధంతి సందర్బంగా 100 మంది పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎం.ఏ ఏజాజ్ మీడియాకు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుమారుడు కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి వర్ధంతి సందర్బంగా ప్రతీ ఏడు సేవా కార్యక్రమాలు, రక్తదానాలు నిర్వహించడం జరుగుతుందని, ఎందరో నిరుపేదలకు సాయం చేస్తూ అడుగడుగునా నేనున్నానంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎల్లవేళలా ముందుంటున్నారని, అందులో భాగంగానే కోమటిరెడ్డి ప్రతిక్ రెడ్డి 10వ వర్ధంతి సందర్బంగా 100 మంది పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ సెక్రటరీ జనగామ ఉపేందర్ రెడ్డి, నీలం పద్మ వెంకటస్వామి,…
మెగాస్టార్ చిరంజీవి ఆచార్య విడుదల వాయిదా పడిందా?
మెగాస్టార్ చిరంజీవి. మెగాపవర్స్టార్ రామ్చరణ్ హీరోలుగా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య’. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందంటూ నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వార్తలను నిర్మాతలు ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ….‘‘మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతోన్న ‘ఆచార్య’ సినిమా రిలీజ్ డేట్ మారుతుందని వినిపిస్తున్న వార్తల్లో నిజం లేదు. ముందు ప్రకటించినట్లే ఫిబ్రవరి 4నే ఆచార్య చిత్రాన్నిప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నాం. ఇప్పటికే డబ్బింగ్ వర్క్…
తమిళ పరిశ్రమలో సత్తా చాటిన తెలుగు దర్శకుడు
ఇప్పుడు యావత్ దేశం తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూస్తోంది. తెలుగులో వస్తున్న సినిమాలు ఏమిటి? తెలుగులో ప్రతిభావంతులైన దర్శకులు ఎవరు? అని ఆరా తీస్తోంది. తెలుగు కథలతో పాటు కొంత మంది తెలుగు దర్శకులను అక్కడ సినిమా ఇండస్ట్రీకి తీసుకువెళుతున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘జెర్సీ’, ‘అల… వైకుంఠపురములో’ వంటి సినిమాలు హిందీలో, ఇతర భాషల్లో రీమేక్ అవుతున్నాయి. అలాగే, ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమానూ తమిళంలో రీమేక్ చేశారు. హేమంబర్ జాస్తి దర్శకత్వం వహించారు. ‘కేరాఫ్ కాదల్’ పేరుతో ఆ సినిమా విడుదలైంది. హేమంబర్ జాస్తి తెలుగువారే. ‘రాజకుమారుడు’, ‘ఒక్కడు’ సహా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన పలు చిత్రాలకు ఆయన కో – డైరెక్టర్గా పని చేశారు. దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు, మణిరత్నం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, గుణశేఖర్ తదితర దిగ్గజ దర్శకుల…
ఆలేరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా కలకుంట్ల లోకేష్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలానికి చెందిన కలకుంట్ల లోకేష్ ను ఆలేరు మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమిస్తూ ఆ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామక పత్రాన్ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి చేతులమీదుగా లోకేష్ అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు నా వంతు కృషి చేస్తానని అలాగే ఆలేరు మండలంలోని అన్ని గ్రామాల్లో యూత్ కాంగ్రెస్ గ్రామ కమిటీలు నియమించి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేస్తానని తెలియజేయడం జరిగింది. అలాగే తన నియామకానికి సహకరించిన పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారికి,రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్…
మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన సత్యదేవ్ ‘గాడ్సే’ టీజర్
వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తోన్న చిత్రం ‘గాడ్సే’. గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వంలో సీకే స్క్రీన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ను సోమవారం మెగాస్టార్ చిరంజీవివిడుదల చేసి, సినిమా పెద్ద విజయం సాధించాలని ఎంటైర్ యూనిట్ను అభినందించారు. టీజర్ను గమనిస్తే .. 78 సెకన్ల వ్యవధి. ఇందులో సేవ పేరుతో దోచుకుంటూ దేశంలోని యువత సహా అందరి ప్రజలను మోసం చేస్తున్న రాజకీయ వ్యవస్థపై ఓ యువకుడు ఎలా తిరుగుబాటు చేశాడనేదే గాడ్సే సినిమా అని అర్థమవుతుంది. టీజర్లో చాలా రేసీగా ఇన్టెన్స్తో ఉంది. ‘ఏ నినాదం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు’. అనే పవర్ ఫుల్ డైలాగ్తో టీజర్ ప్రారంభమైంది. సత్యదేవ్ పాత్రధారి అయిన గాడ్సేను పట్టుకోవడానికి మిలటరీ…
సుధీర్బాబు,హర్ష వర్ధన్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి ప్రొడక్షన్ నెం.5 ప్రారంభం
ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్ లతో మన ముందుకు రాబోతున్నారు హీరో సుధీర్ బాబు. తన కెరీర్లో 15వ చిత్రంగా హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. సోనాలి నారంగ్, సృష్టి సమర్ఫణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి పతాకంపై ప్రొడక్షన్ నెం.5గా నారాయణ్ దాస్ కె నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుధీర్ బాబు కోసం ఒక భిన్నమైన కథను రెడీ చేశారు దర్శకుడు హర్ష వర్ధన్. ఈ సినిమాలో ఇంత వరకూ చూడని సరికొత్త అవతారంలో సుధీర్ బాబు కనిపించనున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ రోజు హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు షాట్కు నిర్మాత పుస్కుర్ రామ్మోహన్ రావు క్లాప్ కొట్టి స్క్రిప్ట్ను దర్శకుడికి అందజేశారు. వచ్చే వారం నుండి ఈ మూవీ…
‘బంగార్రాజు’ నుంచి పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ ‘వాసివాడి తస్సాదియ్యా’ విడుదల
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్లో రాబోతోన్న బంగార్రాజు సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో మ్యూజిక్ ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఇందులో భాగంగా తాజాగా పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అంటూ వాసివాడి తస్సాదియ్య అనే పాటను విడుదల చేశారు. ఈ పాటలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. నాగార్జున, నాగ చైతన్య కలిసి ఇందులు స్టెప్పులు వేస్తుండగా.. ఫరియా అబ్దుల్లా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బంగార్రాజుకు పెళ్లయిపోతుందనే బాధను ఫరియా అబ్దుల్లా ఈ పాటలో వివరిస్తారు. ఈ పాటను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల రచించారు. మోహన భోగరాజు, సాహితి చాగంటి, హర్షవర్దన్ చావలి కలిసి ఆలపించారు. నాగార్జున పంచెకట్టులో కనిపిస్తుండగా..…
తమిళ పరిశ్రమలో సత్తా చాటిన తెలుగు దర్శకుడు
ఇప్పుడు యావత్ దేశం తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూస్తోంది. తెలుగులో వస్తున్న సినిమాలు ఏమిటి? తెలుగులో ప్రతిభావంతులైన దర్శకులు ఎవరు? అని ఆరా తీస్తోంది. తెలుగు కథలతో పాటు కొంత మంది తెలుగు దర్శకులను అక్కడ సినిమా ఇండస్ట్రీకి తీసుకువెళుతున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘జెర్సీ’, ‘అల… వైకుంఠపురములో’ వంటి సినిమాలు హిందీలో, ఇతర భాషల్లో రీమేక్ అవుతున్నాయి. అలాగే, ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమానూ తమిళంలో రీమేక్ చేశారు. హేమంబర్ జాస్తి దర్శకత్వం వహించారు. ‘కేరాఫ్ కాదల్’ పేరుతో ఆ సినిమా విడుదలైంది. హేమంబర్ జాస్తి తెలుగువారే. ‘రాజకుమారుడు’, ‘ఒక్కడు’ సహా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన పలు చిత్రాలకు ఆయన కో – డైరెక్టర్గా పని చేశారు. దర్శకేంద్రులు కె. రాఘవేంద్రరావు, మణిరత్నం, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, గుణశేఖర్ తదితర దిగ్గజ దర్శకుల…
