– అందమైన అనుభూతికి లోను చేస్తోన్న‘శాకుంతలం’ రిలీజ్ ట్రైలర్ – అనిర్వచనీయమైన ప్రేమ, భావోద్వేగాల కలబోత ”లేడీ కన్నులు, నెమలి నడక, సివంగి నడుము మనసుల పరిచయం కంటే మనుషుల పరిచయం గొప్పదా ఏం మనసెటు పోతే అటు పోరాదని ముని వాక్కు నీ కష్టానికి కన్నీళ్లు పెట్టగలమే కానీ.. కర్మను పంచుకోలేం పుట్టగానే తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యాను..మీ ప్రేమకు కూడా దూరమైతే ..” – వంటి అద్భుతమైన సంభాషణలు.. అంతకు మించి కళ్లు ఆనందంతో విప్పారే సన్నివేశాలు ఇవన్నీ కలబోసిన చిత్రమే ‘శాకుంతలం’ అని రిలీజ్ ట్రైలర్ను చూస్తుంటే అర్థమవుతుంది. ప్రతి సన్నివేశాన్ని కుంచెతో బొమ్మ గీసినట్లు అద్భుతంగా తెరకెక్కించారు ఎపిక్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్. మహాభారతంలోని అద్భుతమైన ప్రేమ కథగా మనం చెప్పుకునే దుష్యంత, శకుంతల ప్రేమగాథను మహా కవి కాళిదాసు…
Category: FILM NEWS
‘మ్యూజిక్ స్కూల్’ చిత్రం నుంచి ‘చదువే చదువంటారు..’ లిరికల్ సాంగ్ విడుదల
ఓ అపార్ట్మెంట్లో కొందరు చిన్న పిల్లలు కలిసి ఫుట్ బాల్ ఆడుతుంటారు. అంతలో వారి దగ్గరు వారి ఫ్రెండ్ వస్తుంది. ఈ మమ్మీలంతా ఎప్పుడూ చదువు చదువనే అంటుంటారు. పాట గీటా టైమ్ వేస్ట్ అంటారు. అంటూ ఇప్పటి తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నారనే విషయాన్ని పాట రూపంలో చక్కగా పాడింది. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎప్పుడూ చదువుకోకుండా అప్పుడప్పుడు ఆట పాటలను నేర్చుకోవాలనుని ఎందుకు చెబుతుందనే విషయం తెలియాలంటే మే 12న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ అవుతున్న ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శక నిర్మాత పాపారావు బియ్యాల. ఈ సినిమాను హిందీలో పి.వి.ఆర్, తెలుగులో ఎస్.వి.సి బ్యానర్పై దిల్ రాజు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. యామిని ఫిల్మ్స్ బ్యానర్పై షర్మన్ జోషి, శ్రియా శరన్, షాన్, సుహాసిని మూలే,…
సెన్సార్ లో ‘సూర్యా పేట్ జంక్షన్’.. ఈ నెలలోనే విడుదల
ఈశ్వర్ నయన సర్వర్ జంటగా ముఖ్య పాత్ర లో అభిమన్య సింగ్ ఐటమ్ సాంగ్ లో పూజ నటిస్తున్న చిత్రం “సూర్యా పెట్ జంక్షన్ ” ఇప్పటికే ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ టీజర్ మరియు ఈ చిత్రం లోని ఐటమ్ నంబర్ మ్యాచింగ్ మ్యాచింగ్ లిరికల్ సాంగ్ విడుదలయ్యాయి వాటికి మీడియా లో ప్రేక్షకుల్లో చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నాయి ఇదే ఉత్సాహం తో త్వరలో కాలేజ్ సాంగ్ నీ ఈ సినిమా ట్రైలర్ నీ త్వరలో విడుదల చేయబోతున్నాం అవి కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటాయి అని నమ్మకం ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా పూర్తి చేసుకున్న మా ‘సూర్యా పేట్ జంక్షన్’ మూవీనీ తరువాత వారం లో సెన్సార్ కి ఇచ్చి ఈ నెల ఆకరులో మూవీ నీ…
‘మీటర్’ హై స్పీడ్ లో వుంటుంది : నిర్మాత చిరంజీవి (చెర్రీ)
టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మీటర్’. నూతన దర్శకుడు రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్టైన్ మెంట్ నిర్మిస్తోంది. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అతుల్య రవి కథానాయికగా నటిస్తోంది. ఔట్ అండ్ ఔట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 7న సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో నిర్మాత చెర్రీ మీటర్ విశేషాలనిమీడియాతో పంచుకున్నారు. బాక్సాఫీసు కి ఏ రేంజ్ మీటర్ సెట్ చేశారు ? – టీజర్, ట్రైలర్…
తెలుగు చిత్రపరిశ్రమలో ‘బలగం’ ఓ చరిత్ర.. మా బాధ్యతను మరింత పెంచింది : నిర్మాత దిల్ రాజు
దిల్ రాజు సారథ్యంలో శిరీష్ సమర్పణలో దిల్రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై హర్షిత్, హన్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని వేణు ఎల్దండి తెరకెక్కించారు. మార్చి 3న విడుదలైన చిత్రం సూపర్ డూపర్ సక్సెస్ టాక్తో ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం సినిమాను అభినందిస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలోని రోజు రోజుకీ ఆదరణ పొందుతూ దూసుకెళ్తోంది. పల్లెటూళ్లలో అయితే తెరలు ఏర్పాటు చేసుకుని ఊరు ఊరంతా కలిసి సినిమాను చూస్తున్నారు.. ఎమోషనల్ అవుతున్నారు. అలాగే బలగం సినిమాకు 7 ఇంటర్నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దిల్ రాజు, దర్శకుడు వేణు, నిర్మాతలు హర్షిత్, హన్షిత తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్మీట్లో..…
‘విరూపాక్ష’ సినిమాకు కథే హీరో.. పాత్రల పరిచయ కార్యక్రమంలో సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్
సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పాటలకు స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి పాత్రలను పరిచయం చేస్తూ నిర్వహించిన కార్యక్రమంలో చిత్రయూనిట్ పాల్గొంది. సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘2019లో ఈ కథ విన్నాను. చిన్న ఆఫీస్లో ఈ…
విడుదలైన అన్ని థియేటర్స్ లో విజయంతంగా ప్రదర్శింపబడుతున్న చిత్రం ‘పరారీ’ : సక్సెస్ మీట్ లో సీనియర్ నటులు సుమన్
గాలి ప్రత్యూష సమర్పణలో,శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై యోగేశ్వర్, అతిధి జంటగా సాయి శివాజీ దర్శకత్వంలో, జివివి గిరి నిర్మించిన లవ్ అండ్ క్రైం కామెడీ ఎంటర్టైనర్ చిత్రం “పరారీ”..ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్ కు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 30న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్నీ థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సంధర్భంగా చిత్రయూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది..ఈ సందర్బంగా.. సీనియర్ నటులు సుమన్ మాట్లాడుతూ..ఎంతో కష్టపడి తీసిన నిర్మాత గిరి గారికి “పరారి” సినిమా హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి గురు, శుక్రవారం నాడు ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీ కి పరిచయం అవుతుంటారు. అయితే యోగేష్ నటించిన…
‘రావణాసుర’ మాములుగా వుండదు.. దద్దరిల్లుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో రవితేజ
మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే భారీ అంచనాలని నెలకొల్పింది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా సినిమా రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో ‘రావణాసుర’ ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ.. మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ .. దర్శకుడితో మాంచి సింక్ లో వుండి ప్రతి సెట్ చాలా…
చిన్న సినిమాకి పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు ధన్యవాదములు : హీరో రాజ్ కార్తికేన్
చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన వ్యక్తి దర్శకుడైతే తను కోల్పోయింది అమ్మనే కాదు జీవితంలో వెలకట్టలేని అమ్మ ప్రేమను అని తెలుసుకొని అమ్మ ప్రేమను,అమ్మాయి ప్రేమకు ముడిపెడుతూ ఒక మతాంతర ప్రేమకథ ఇతివృత్తంగా తెరకెక్కించిన చిత్రమే “రాజ్ కహానీ”. భార్గవి క్రియేషన్స్ పతాకంపై రాజ్ కార్తికేన్,చంద్రికా అవస్తి, సోనియా సాహా, ప్రియా పాల్, సాయి, జబర్దస్త్ ఫణి, నటీనటులు గా రాజ్ కార్తికేన్ టైటిల్ రోల్ లో నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భాస్కర రాజు, ధార్మికన్ రాజు లు సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ సంగీత దర్శకుడు స్వర్గీయ చక్రి తమ్ముడు మహిత్ నారాయణ్ సంగీతం సమకూర్చగా యస్.యస్.వి. ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించారు. మార్చి 24 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సంధర్భంగా…
సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్ `పోప్స్ ఎక్సార్సిస్ట్` ఏప్రిల్ 7న రాబోతుంది!!
అతీంద్రియ శక్తుల నేపథ్యంలో ది పోప్స్ ఎక్సార్సిస్ట్ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి జూలియస్ అవేరీ దర్శకత్వం వహించారు. అమెరికన్ అతీంద్రియ భయానక చిత్రం ఇది. పోప్ యొక్క భూతవైద్యుడు ఫాదర్ గాబ్రియెల్ అమోర్త్గా రస్సెల్ క్రోవ్ నటించారు. ఈ చిత్రంలో డేనియల్ జొవట్టో, అలెక్స్ ఎస్సో మరియు ఫ్రాంకో నీరో కూడా నటించారు. సోనీ పిక్చర్స్ ద్వారా ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏప్రిల్ 7న విడుదల కాబోతుంది. కథగా చెప్పాలంటే, తండ్రి గాబ్రియేల్ ఒక యువకుడిని భయంకరమైన పరిశోధనను ట్రైనింగ్ ఇస్తాడు. అప్పుడు వాటికన్ శతాబ్దాల నాటి కుట్రను వెలికితీస్తాడు. ఆ క్రమంలో ఒక ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేటర్, దెయ్యం పట్టిన ఒకరిని బయటకు పంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అస్థిరమైన దెయ్యాల నివాసం, శతాబ్దాల నాటి రహస్యం వెనుక చాలా పెద్ద కుట్ర వెలుగులోకి…
