హైదరాబాద్: అత్యుత్తమ సిల్క్ చీరలు, డిజైనర్ ఎథ్నిక్ వేర్, బ్రైడల్ కలెక్షన్స్, పండుగల ప్రత్యేక వస్త్రాలకు ప్రీమియం గమ్యస్థానంగా నిలిచే ది సిగ్నేచర్ సిల్క్స్ తన నూతన షోరూమ్ను మెట్రో పిల్లర్ నెం. 741, కెపిహెచ్బి లో టాలీవుడ్ ప్రముఖ నటి శ్రీలీల ముఖ్య అతిథిగా విచ్చేసి షోరూమ్ను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి వినియోగదారులు, ఫ్యాషన్ అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున హాజరై సందడి చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డైరెక్టర్ శ్రీ ప్రకాశ్ సింగ్ గెహ్లాట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ నరేందర్ సింగ్ గెహ్లాట్ పాల్గొని అతిథులను ఆహ్వానించారు. సంప్రదాయ మరియు ఆధునిక శైలుల సమ్మేళనంతో అత్యుత్తమ నాణ్యత కలిగిన వస్త్రాలను వినియోగదారులకు ఒకే వేదికపై అందించాలనే తమ లక్ష్యాన్ని వారు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీలీల, ది సిగ్నేచర్ సిల్క్స్ యాజమాన్యానికి శుభాకాంక్షలు…
Year: 2026
‘కరుణామయ’ చిత్రం ప్రారంభం
బాబీ పిక్చర్స్ మీద ప్రొడక్షన్ నెంబర్. 1గా సంకాబత్తుల నాగేశ్వరరావు గారు నిర్మించనున్న చిత్రం ‘కరుణామయ’. చైతన్య శక్తి, స్వాతి శ్రీ జంటగా రాబోతోన్న ఈ సినిమాకి హర్షవర్దన్ పారెళ్ళ దర్శకత్వం వహించనున్నారు. ఆరాధ్య హైందవి సమర్ఫణలో ఫ్యామిలీ ఎమోషన్స్తో తెరకెక్కనున్న ఈ మూవీని ఈ ఏడాది డిసెంబర్ 23న విడుదల చేయనున్నారు. ఈ మేరకు నిర్వహించిన పూజా కార్యక్రమాలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వి. వి. వినాయక్ గారు వీ.ఎన్ ఆదిత్య గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారి చేతుల మీదుగా ఈ మూవీని లాంఛనంగా ప్రారంభమైంది. నిర్మాత సంకాబత్తుల నాగేశ్వరరావు మాట్లాడుతూ .. ‘‘క్రిస్మస్ సందర్భంగా మా సినిమాని ఈ ఏడాది డిసెంబర్ 23న రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. మాకు సహకరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా కోసం…
వర్మ చేతుల మీదుగా ‘ఫైట్ మహా’ టీజర్ విడుదల
సునీల్, అఖిల్ ఉడ్డెమారి, డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఫైట్ మహా’. కలలు నిజమైతే నిజం ఎవరిది అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు ఆనంద్ చంద్ర. న్యూ ఐ మూవీస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై ఏవీఎస్ రాజు, ఆర్.కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మిస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, కేరళలలో షూటింగ్ జరుపుకుని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర టీజర్ ను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకులు వంశీ, దర్శకుడు స్క్రిప్ట్ రైటర్ బీవీఎస్ రవి, పాటల రచయిత సిరాశ్రీ ఆర్జీవి…
మా మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు.. మేమంతా కలిసే ఉంటాం : జానీ మాస్టర్
సర్వసభ్య సమావేశంలో వచ్చిన మెజార్టీ అభిప్రాయంతోనే ముందుకు వెళ్తున్నాం. ఏక పక్ష నిర్ణయం ఎక్కడా తీసుకోలేదు – టీఎఫ్టీడీడీఏ అధ్యక్షురాలు సుమలత – డ్యాన్సర్ హెల్త్ ఇన్సూరెన్స్కి 18 లక్షలు విరాళంగా ఇచ్చిన జానీ మాస్టర్ తెలుగు సినిమా టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ధ్వర్యంలో జరిగిన కార్యక్రమం రసాభాసాగా మారింది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్కి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరి మధ్య గొడవ జరిగిందంటూ వార్తలు వ్యాపించాయి. ఇక ఈ మేరకు జానీ మాస్టర్, టీఎఫ్టీడీడీఏ అధ్యక్షురాలు సుమలత వివరణ ఇచ్చేందుకు సోమవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్లో జానీ మాస్టర్ మాట్లాడుతూ .. ‘సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు నిర్వహించాలా? వద్దా? అని చర్చించుకునేందుకు మేం అందరం…
‘శ్రీనివాస మంగాపురం’యాక్షన్ థియేట్రికల్ ట్రైలర్
శ్రీనుకు మంగా అంటే ప్రాణం. మొదట అతని ప్రేమను అంగీకరించని మంగా, అతని నిజమైన ప్రేమను చూసి చివరకు ప్రేమలో పడుతుంది. ఇద్దరి ప్రేమ అందంగా సాగుతున్న సమయంలో బళ్లారి రాజు వెంకటప్పయ్య నాయుడు వారి జీవితాల్లోకి వస్తాడు. వారి ప్రేమకు అతడే అతిపెద్ద అడ్డంకిగా మారతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? వారి ప్రేమ గెలిచిందా? అనేదే ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా కథ. సూపర్స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు అజయ్ భూపతి ఈ ప్రాజెక్ట్కు దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని ఈ చిత్రంతో కథానాయికగా తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తోంది. సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు…
వంద కోట్ల క్లబ్లోకి ‘మా ఇంటి బంగారం’
బాక్సాఫీస్ వద్ద హిస్టరీ క్రియేట్ చేసిన సమంత రీసెంట్గా సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ రిలీజై సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ‘మా ఇంటి బంగారం’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అధికారికంగా రూ.100 కోట్ల మార్క్ను దాటి.. భారతీయ సినిమా చరిత్రలోనే రూపొందిన మహిళా ప్రధాన చిత్రాల్లో అతిపెద్ద కమర్షియల్ విజయాల్లో ఒకటిగా తన స్థానాన్ని మరింత బలపరచుకుంది. ఈ చిత్రం తన బడ్జెట్పై 300 శాతం పైగా రికవరీ సాధించడం విశేషం. తెలుగు లో ఇప్పటివరకు వచ్చిన మహిళా ప్రధాన సినిమాల్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచింది. తాజాగా మా ఇంటి బంగారం సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద అధికారికంగా రూ.100 కోట్ల మార్క్ దాటి అరుదైన రికార్డ్ను క్రియేట్ చేసింది.…
గానకోకిల జానకి మృతికి ఫిల్మ్ క్రిటిక్స్ సంతాపం
భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. తన మధురమైన గాత్రంతో కొన్ని దశాబ్దాల పాటు కోట్ల మంది ప్రేక్షకులను మైమరపించిన లెజెండరీ సింగర్, గానకోకిల ఎస్. జానకి ఇకలేరు అంటే నమ్మశక్యం కావడం లేదు అని తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల జెవి ప్రసాద్ రావు, కార్యదర్శి సురేష్ కొండేటి సంతాపం ప్రకటించారు. దక్షిణ భారత గానకోకిలగా పేరుగాంచిన జానకి అన్ని భాషల్లో కలిపి దాదాపు 50 వేలకు పైగా పాటలను పాడారు. తెలుగు చలన చిత్రసీమలో ఆణిముత్యాల్లాంటి పాటలకు ఆమె ప్రాణం పోశారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో అద్భుతమైన పాటలను ఆలపించారు. ఆమె గాన మాధుర్యానికి నాలుగు జాతీయ అవార్డులు సహా, వివిధ సినీ అవార్డులు వరించాయి. సంగీత ప్రపంచానికి జానకి చేసిన సేవలను గుర్తించిన…
మంచి సినిమా ఇస్తే ఆడియెన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు: ‘లెనిన్’ సక్సెస్ మీట్లో నిర్మాత కింగ్ నాగార్జున
‘లెనిన్’ను ఆదరిస్తోన్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్.. సక్సెస్ మీట్లో అఖిల్ అక్కినేని అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో నిర్మాత సూర్య దేవర నాగవంశీ అఖిల్ అక్కినేని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్తో సక్సెస్ ఫుల్గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో శనివారం చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్లో.. నిర్మాత కింగ్ నాగార్జున మాట్లాడుతూ ‘‘అన్నమయ్య’ చేశాక నేను దేవుడ్ని ఏదీ అడిగింది లేదు. కానీ తిరుపతిలో ఈవెంట్ అయ్యాక..…
తెలుగు సినిమా చాలా అడ్వాన్స్గా ఉంది : హీరోయిన్ రాషా తడానీ
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని అజయ్ భుపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ నటుడు డాక్టర్ మోహన్ బాబు పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. నిర్మాత పి. కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన మూడు పాటలు, టీజర్లు, పోస్టర్లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ రాషా తడాని మీడియాతో మాట్లాడుతూ సినిమా విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే……
ఆ దివ్యాంగురాలిని ఆదుకుంటాను : చదలవాడ శ్రీనివాసరావు
ప్రకృతి వల్ల కలిగిన విపత్తులలోనే కాకుండా ఇలాంటి సందర్భంలో కూడా మనుషులు మానవతా దృక్పదంతో ఆలోచించ వలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది అని ప్రఖ్యాత నిర్మాత, దర్శకుడు చదలవాడ శ్రీనివాసరావు అన్నారు. రంగారెడ్డి జిల్లా షాబాద్లోరాజ్ కుమార్ అనే ప్రబుద్దుడు తన భార్య ఇద్దరు పిల్లలతో పాటు తనపై కేసుపెట్టిన మైనర్ బాలిక..ఆమె తల్లిని అత్యంత దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ .. సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునేంత దారుణమైనది. సమాజం ఆధునికంగా ఎంతో ముందుకు వెళుతున్నా ఇలాంటి ఆటవిక చర్యలు ..మాత్రం ఆగడంలేదు. మనుషులు ఇంత క్రూరంగా ఎందుకు తయారవుతున్నారో అంతు చిక్కడం లేదు. ఈ పాశవిక చర్య నా మనసును తీవ్రంగా భాదించింది. మనం ఎలాంటి సమాజంలో ఉన్నాము అనే ది అస్సలు అర్థం కావడంలేదు.…
