‘మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న టెక్నాలజీని సినీ రంగంలోకి పరిచయం చేయాలనే దృఢ సంకల్పంతో దిల్ రాజు గారు ‘లోర్వెన్ AI’ స్టూడియోని లాంచ్ చేయడం అభినందనీయం. ‘లోర్వెన్ AI’ స్టూడియో ఎంటర్టైన్మెంట్ వరల్డ్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను’అన్నారు తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘లోర్వెన్ AI’ స్టూడియోని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ కి తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సినీ పరిశ్రమకు చెందిన అతిరధమహారధులు హాజరైన ఈ వేడుకు చాలా గ్రాండ్ గా జరిగింది. ‘లోర్వెన్ AI’ స్టూడియో లాంచ్ ఈవెంట్ లో తెలంగాణ ఐటీ మినిస్టర్ శ్రీ డి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నా…
Month: May 2025
మల్లేశం & 8 A.M. మెట్రో ఫేమ్ డైరెక్టర్ రాజ్ ఆర్, స్పిరిట్ మీడియా “23” మే 16న గ్రాండ్ రిలీజ్
మల్లేశం, 8 A.M. మెట్రో చిత్రాలతో ప్రశంసలు పొందిన దర్శకుడు రాజ్ ఆర్ నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ “23” తో వస్తున్నారు. స్టూడియో 99 నిర్మించిన ఈ చిత్రంలో తేజ, తన్మయి ప్రధాన పాత్రలు పోషించారు. వెంకట్ సిద్దారెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. మే 16న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాని స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్ సెన్సేషనల్ రెస్పాన్స్ తో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. కోసి కోయ్యంగానే సాంగ్ వైరల్ అయి సినిమాపై ఎక్సైట్మెంట్ ని పెంచింది. ఈ చిత్రానికి మార్క్ కె రాబిన్ మ్యూజిక్ అందిస్తున్నారు. సన్నీ…
JioStar Spends $10 Billion on Content, Surpassing YouTube’s $2.53 Billion
A recent fireside chat at WAVES between Uday Shankar, Vice Chairman of JioStar, and Vivek Couto, Managing & Executive Director of Media Partners Asia, titled “Media in India: Past 25 years and Journey Ahead – to 2047,” offered a compelling reflection on the evolution of Indian screen and video entertainment. Their insightful discussion traversed key milestones, challenges overcome, and the promising trajectory of this dynamic industry. Shankar commenced by highlighting the “spectacular global story” of Indian media’s surge over the past 25 to 30 years. He underscored the unique resilience…
కంటెంట్ కోసం $10 బిలియన్లు ఖర్చు చేస్తున్న జియోస్టార్
భారతదేశంలో గత 30 ఏళ్లుగా మీడియా, వినోద రంగంలో వస్తోన్న మార్పులు అందరం చూస్తూనే ఉన్నాం. అంతర్జాతీయ స్థాయిలో భారత్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వేవ్స్ (WAVES – వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్) సమ్మిట్ ఘనంగా జరిగింది. గురువారం (మే 1) నాడు జియో కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జియోస్టార్ వైస్ చైర్మన్ ఉదయ్ శంకర్, మీడియా పార్టనర్స్ ఆసియా మేనేజింగ్ & ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వివేక్ కౌటో మధ్య ఆసక్తికరమైన సంభాషణలు జరిగాయి. జియోస్టార్ వైస్ చైర్మన్ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ..‘గత 25 నుండి 30 సంవత్సరాలలో భారతీయ మీడియా రంగం గణనీయంగా మార్పులకు లోనైంది. స్ట్రీమింగ్ వీడియో వినియోగం పెరిగింది. 90ల ప్రారంభంలో…
హారర్-కామెడీ ‘శుభం’ ప్రమోషనల్ సాంగ్ ‘జన్మ జన్మల బంధం’ విడుదల
ప్రముఖ నటి సమంత నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. సమంత నేతృత్వంలోని వస్తున్న తొలి చిత్రం ‘శుభం’. ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత నిర్మిస్తున్న ఈ చిత్రాన్నికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన ‘శుభం’ ట్రైలర్కు విశేషమైన స్పందన వచ్చింది. మేకర్స్ ఈ క్రమంలో మ్యూజికల్ ప్రమోషన్స్లో భాగంగా మొదటి సింగిల్ ‘జన్మ జన్మల బంధం’ను విడుదల చేశారు. ఇది ప్రమోషనల్ వైబ్ కోసం రూపొందించి ఓ ఎనర్జిటిక్ రీమిక్స్ పాట. నిర్మాతతో పాటు ప్రధాన తారాగణం ఈ ప్రమోషనల్ సాంగ్లో కనిపిస్తారు. ఈ సాంగ్లో సమంత అందరి దృష్టిని ఆకర్షించేలా ఉన్నారు. టీం అంతా కూడా ఫుల్ వైబ్లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఈ ప్రమోషనల్ సాంగ్…
‘వేవ్స్ 2025’ లో నాగపూర్లో వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అభిషేక్ అగర్వాల్, విక్రమ్ రెడ్డి
ప్రపంచంలోనే బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ తో నాగపూర్లో మొదటిసారిగా నిర్మించబోయే ఈ సినిమా థియేటర్ భారతీయ సాంకేతిక రంగానికి ఒక మార్గదర్శకంగా నిలవనుంది. ఎంటర్ టైన్మెంట్ లో మోడరన్ ఇండియాకి ఇది ఒక గర్వకారణంగా మారబోతోంది. “వరల్డ్స్ బిగ్గెస్ట్ సినిమా స్క్రీన్ నిర్మించేందుకు అవకాశం దక్కడం నాకు గర్వకారణం. ఇండియన్ ఎంటర్ టైన్మెంట్ ప్రపంచ స్థాయిలోకి తీసుకెళ్లాలని ప్రధాని గారి లక్ష్యం. అదే ప్రేరణగా ఈ ప్రయత్నం మొదలైంది. మా విజన్ ని అర్థం చేసుకుని ఈ కలను నిజం చేసేందుకు మమ్మల్ని నమ్మిన ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు,” అని అభిషేక్ అగర్వాల్ అన్నారు. “సినిమాను మరింత గొప్పగా మార్చడమే మా UV క్రియేషన్స్ లక్ష్యం. గొప్ప సినిమాలు తీయడమే కాదు, అద్భుతమైన థియేటర్లు కూడా నిర్మించడమే మా ధ్యేయం. ప్రపంచపు అతిపెద్ద…
సినిమాల కోసం ఆస్తులు అమ్ముకున్నాం.. మూవీ డిజిస్టర్పై రకుల్ భర్త జాకీ భగ్నాని ఆవేదన
టాలీవుడ్లో ఒకప్పుడు టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో అవకాశాలు తగ్గాక బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ ఆడపాదడపా సినిమాలు చేస్తూ తన స్నేహితుడు జాకీ భగ్నానిని వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక కూడా వీరి రాత మారడం లేదు. రకుల్ నటిగా మంచి అవకాశాలు అందిపుచ్చుకోలేకపోతుంది. అలానే రకుల్ ప్రీత్ సింగ్ భర్త అయిన జాకీ నిర్మాతగా రాణించలేకపోతున్నారు. ఆయన బాలీవుడ్ అగ్ర నటులు అక్షయ్కుమార్, ట్రైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలలో ’బడే మియా ఛోటే మియా’ అనే భారీ బడ్జెట్ చిత్రం నిర్మించారు. గత ఏడాది వేసవిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే ఈ మూవీ వైఫల్యంపై తాజాగా జాకీ స్పందించారు. ఈ చిత్రం వలన తాము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని,…
‘హిట్-3’లో నాని నట విశ్వరూపం.. చీకటి కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం!
తెలుగు ప్రేక్షకులకు ఫ్రాంఛైజీ రుచిని ’హిట్’ సినిమాలు బలంగా చూపించాయి. నాని కీలక పాత్రలో ’హిట్: ది థర్డ్ కేస్’తో మూడో చిత్రం విడుదలయ్యింది. ప్రచార చిత్రాలు, ఫ్రాంఛైజీపై ఉన్న నమ్మకం ఈ సినిమాపై మరిన్ని అంచనాల్ని పెంచాయి. దర్శకుడు శైలేష్ కొలను మూడో సినిమాతో ఎలాంటి ప్రభావం చూపించాడు. క్రూరత్వం నింపుకొన్న అర్జున్ సర్కార్ అనే పోలీస్ పాత్రలో నాని నటన ఎలా ఉందన్నదే సినిమా కథ. అర్జున్ సర్కార్ (నాని) ఐపీఎస్ అధికారి. జమ్మూకశ్మీర్లోని హోమిసైడ్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (హిట్)లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో క్రూరమైన ఓ హత్య కేసు వెలుగులోకి వస్తుంది. అది ఎవరు చేశారో పరిశోధిస్తుండగా అచ్చం అదే తరహాలో దేశవ్యాప్తంగా 13 హత్యలు జరిగిన సంగతి వెలుగులోకి వస్తుంది. దీని వెనుక ఓ పెద్ద నెట్వర్క్ ఉందని అర్జున్ తెలుసుకుంటాడు.…
ఆచితూచి అడుగులేస్తున్న విశ్వక్సేన్!
టాలీవుడ్ యంగ్ హీరోలలో మాస్ క దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. లైలా డిజాస్టర్ తో కాస్త డిస్పాయింట్ అయిన విశ్వక్ సేన్ ఇప్పుడు చేయబోయే సినిమాల పట్ల ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు విశ్వక్ సేన్. బూతు, వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టు-కుని సినిమాలు చేస్తున్నాడు విశ్వక్. అందులో భాగంగా జాతి రత్నాలు దర్శకుడు కెవి అనుదీప్ తో ఫంకీ అనే చేస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరి కొన్ని కథలు వింటున్న విశ్వక్ సేన్ మరో సినిమాను కూడా లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు కల్ట్ అనే -టైటిల్…
వేవ్స్ సమ్మిట్లో ఒక్కటైన తారలు!
నాలుగు రోజులపాటు ప్రతిష్ఠాత్మకంగా వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ -వేవ్స్ ముంబై వేదికగా జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో అట్టహాసంగా ప్రారంభమైంది. ‘కనెక్టింగ్ క్రియేటర్స్.. కనెక్టింగ్ కంట్రీస్’ అనే ట్యాగ్ లైన్ తో ఈ వేవ్స్ సమ్మిట్ ను నిర్వహిస్తుంది. ఇది విూడియా, వినోద పరిశ్రమలను ఒకచోట చేర్చే నాలుగు రోజుల కార్యక్రమం కాగా, ఆ కార్యక్రమానికి విూడియా, వినోద రంగానికి చెందిన సీఈఓలు, పరిశ్రమలకి చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ సదస్సును ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు. వేవ్స్ అనేది కేవలం ఒక పదం కాదని.. ఇది సంస్కృతి, సృజనాత్మకత, చలనచిత్ర సంగీతం, గేమింగ్, కథ చెప్పడం.. లాంటి కలయిక అంటూ వివరించారు. గత వందేళ్లలో భారతీయ సినిమా ఉన్నత శిఖరాలకి కూడా చేరుకుందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ సమ్మిట్లో…
