వైభవంగా వేదశ్రీ-సోమశేఖర్ కళ్యాణోత్సవం

The grand wedding of Vedashree-Somashekhar
Spread the love

హైదరాబాద్, ఏప్రిల్ 18 : హైదరాబాద్ కు చెందిన శ్రీమతి కోడెం సుధ -కోడెం రమేష్ ల ఏకైక కుమార్తె చి.ల.సౌ వేదశ్రీ వివాహం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన శ్రీమతి గొట్టిపాముల ధనలక్ష్మి – కీ.శే కాశీనాథ్ ల కనిష్ఠపుత్రుడు సోమశేఖర్ తో వైభవంగా జరిగింది. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్ర కృష పంచమి శుక్రవారం (18-ఏప్రిల్-2025) రోజు ఉదయం 10.26 నిమిషములకు మూలనక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ సుమూహూర్తమున జరిగిన ఈ కళ్యాణోత్సవం కోడెం స్రవంతి-నాగేష్, కోడెం ప్రమీల-సుదర్శన్, కోడెం శ్రీ గణేష్, బిజ్జ శాంతి- శ్రీకాంత్, కటకం శ్రీనివాస్, వివేక్, సాగర్ మరియు బంధు మిత్రుల అభినందనలతో ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా జరిగిన వేదశ్రీ-సోమశేఖర్ ల కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో హాజరైన బంధు మిత్రులు నూతన వధూవరులైన వేదశ్రీ-సోమశేఖర్ లపై అక్షింతలు వెదజల్లుతూ ఈ జంట కలకాలం అన్యోన్యంగా సుఖమయమైన జీవితం గడపాలని, నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో, పిల్లాపాపలతో విలసిల్లాలని కోరుకున్నారు. హైదరాబాద్ లోని ముషీరాబాద్ కశిష్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఈ వేదశ్రీ-సోమశేఖర్ ల కళ్యాణోత్సవంలో కోడెం రమేష్ మిత్రులైన ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జూకంటి శంకర్, నంది అవార్డు గ్రహీత, సీనియర్ జర్నలిస్ట్ ఎం.డి అబ్దుల్, మాయ శ్రీనివాస్, చిట్టిమల్ల భాస్కర్, జర్నలిస్ట్ శివకుమార్-రమ (ప్రధానోపాధ్యాయురాలు-టంగుటూరు), ప్రిన్సిపాల్ సురేష్, జూకంటి శ్రీధర్ తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Related posts

Leave a Comment