* కెసిఆర్ కుటుంబం ఓ దొంగల ముఠా * టీపీసీసీ ప్రధానకార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ కెసిఆర్ కుటుంబం ఓ దొంగల ముఠా అని టీపీసీసీ ప్రధానకార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. పదేళ్ల టీఆర్ ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతికి అంతం లేదని పేర్కొన్నారు, భూముల అమ్మకాలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనుల్లో అవినీతి జరిగినా కాళేశ్వరం అవినీతి అనకొండ అని ఆయన పేర్కొన్నారు, వాటాల పంపకాల తేడాతోనే కే సీ ఆర్ కుటుంబం లో అంతర్గత కుమ్ములాటలు నెలకొన్నాయని చెప్పారు, కవిత చిలక పలుకులు పలుకుతూ కే సీ ఆర్ ను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు, ముఖ్యమంత్రిగా కే సీ ఆర్ ఆజ్ఞ లేనిదే కుటుంబం లో చీమ కూడా కదలలేని పరిస్థితి ఉండే దని వివరించారు,…
