తన తనయుడు రామ్చరణ్ పుట్టినరోజు సందర్భంగా సురేఖ భక్తులకు అన్నదానం చేశారు. ‘అత్తమ్మ కిచెన్’ సారథ్యంలో 500 మందికి సురేఖ అన్నదానం చేశారు. చినజీయర్ స్వామి ఆశీస్సులతో అపోలో ఆస్పత్రిలోని దేవాలయంలో నిర్వహించిన పుష్కరోత్సవంలో పాల్గొన్న భక్తుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం’ అని ఇన్స్టాలో వీడియో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులను ఆమె దగ్గరుండి చూసుకున్నారు. ఉపాసన, కుటుంబసభ్యులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మరోవైపు, రామ్చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు విషెస్ చెప్పారు. ‘‘ఆస్కార్ పురస్కారం పొందిన చిత్రంలో నటించి, గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్చరణ్కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆనందం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. దైవ భక్తి మెండుగా ఉన్న చరణ్ సానుకూల దృక్పథంతో ఆలోచిస్తాడు. పెద్దల పట్ల గౌరవ మర్యాదలతో ఉంటాడు.…