నిహాన్, వైష్ణవి కాంబ్లే జంటగా రవి బాసర దర్శకత్వంలో ఆర్ ఎస్ మూవీ మేకర్స్ పై రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ అయిత నిర్మాతలుగా నిర్మిస్తున్న చిత్రం మా ఊరి రాజారెడ్డి. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి మంచి స్పందన లభిస్తోంది. నేడు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. మార్చ్ 1న గ్రాండ్ గా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ వేణుగోపాల చారి గారు మాట్లాడుతూ : మా ఊరి రాజారెడ్డి అనే సినిమా స్వర్గీయ రాజా రెడ్డి గారిని గుర్తుకు చేసేలా ఉంటుంది. ఆయన అంచలంచెలుగా రాజకీయాల్లో ఒక నిష్ణాతుడైన ముఖ్యమంత్రిగా ఎదిగిన కథను మన ముందుకు తీసుకొస్తున్నారు. ఆయన మంచితనానికి నిదర్శనంగా ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా…