‘ప్రేమ’తో కూడిన కుటుంబ కధా చిత్రం ‘రంగ్ దే’. ఈరోజు చిత్ర కధానాయిక ‘కీర్తిసురేష్’ పుట్టినరోజు సంధర్భంగా ‘రంగ్ దే’ లోని ఓ చిత్రాన్ని విడుదల చేసింది చిత్రం యూనిట్. చిరునవ్వు లొలికిస్తూ ముగ్ధ మోహన రూపంతో కూడిన నాయిక చిత్రం ఆకట్టుకుంటుంది.ఇటీవలే కొద్ది విరామం అనంతరం చిత్రం షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభమై నితిన్తో పాటు ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ పూర్తిచేసుకుంది. షూటింగ్కు సంబంధించి సేఫ్టీ మెజర్స్ పాటిస్తూ పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నెల చివరి వారంలో చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు, ‘ఇటలీ’లో పాటల చిత్రీకరణతో కొద్దిరోజులలోనే చిత్రం షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతి కానుకగా చిత్రం విడుదల అవుతుంది. యువ కథానాయకుడు ‘నితిన్’, మహానటి ‘కీర్తి సురేష్’ల తొలి కాంబినేషన్లో ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ…
Category: FILM NEWS
ప్రభాస్ ఫ్యాన్స్ కోసం బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్
“రెబల్ స్టార్” ప్రభాస్ హీరోగా గోపికృష్ణ మూవీస్, యూవి క్రియేషన్స్, డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. బాహుబలి1, బాహుబలి2, సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ని సొంతం చేసుకున్న “రెబల్స్టార్” ప్రభాస్ తన 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. “రెబల్స్టార్” ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తుంది. ఈ చిత్రాన్ని “రెబల్స్టార్” కృష్ణంరాజు గారు సమర్పించగా, వంశీ, ప్రమోద్, ప్రశీదలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఎన్నో సూపర్హిట్స్ అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థలు గోపికృష్ణ మూవీస్, యూవి క్రియెషన్స్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్లుక్కి విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో నవరాత్రులు అలానే అక్టోబర్ 23న రెబల్ స్టార్…
రవితేజ 67వ చిత్ర ప్రీ లుక్ వచ్చేస్తోంది
మాస్ మహారాజా రవితేజ, ‘రాక్షసుడు’ లాంటి బ్లాక్బస్టర్ అందించిన డైరెక్టర్ రమేష్ వర్మ కాంబినేషన్లో ఓ యాక్షన్ థ్రిల్లర్ను నిర్మించేందుకు ప్రముఖ నిర్మాత సత్యనారాయణ కోనేరు సిద్ధమవుతున్నారు. ఏ స్టూడియోస్తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ‘ఆర్టి67’ (రవితేజ 67వ చిత్రం) ప్రీ లుక్ పోస్టర్ను శనివారం విడుదల చేశారు. ఇందులో స్టైలిష్ డాన్స్ చేస్తున్నట్లున్న రవితేజ షాడో ఇమేజ్ను మనం చూడొచ్చు. ఈ హవీష్ ప్రొడక్షన్ మూవీ ముహూర్తం వేడుక ఆదివారం జరగనున్నది. అదేరోజు ఉదయం 11:55 గంటలకు ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయనున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌధరి నాయికగా నటించే ఈ చిత్రంలో డింపుల్ హయతి సెకండ్ హీరోయిన్గా ఎంపికయ్యారు. తారాగణం:రవితేజ, మీనాక్షి చౌధరి, డింపుల్ హయతి సాంకేతిక బృందం:దర్శకుడు: రమేష్ వర్మనిర్మాత: సత్యనారాయణ…
కీర్తి సురేష్కు మిస్ ఇండియా టీమ్ విశెష్
‘మహానటి’ సినిమాలో తన అద్భుతమైన నటనతో జాతీయ గుర్తింపును సంపాదించి స్టార్ హీరోయిన్గా ఎదిగారు కీర్తి సురేష్. చక్కటి రూపం, హావభావాలు కీర్తి సొంతం. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోతూ తన నటనతో పాత్రకు ప్రాణం పోసే కీర్తి సురేష్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మిస్ ఇండియా’. శనివారం(అక్టోబర్ 17) కీర్తిసురేష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలను అందిస్తోంది ‘మిస్ ఇండియా’ యూనిట్. మహానటి తర్వాత కీర్తిసురేష్ నటించిన తెలుగు చిత్రం ‘మిస్ ఇండియా’. నరేంద్రనాథ్ దర్శకత్వంలో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ పతాకంపై మహేష్ కోనేరు సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. కీర్తిసురేష్ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీస్లో హై బడ్జెట్తో రూపొందించిన చిత్రమిది. ఇప్పటికే విడుదలైన పాట, టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ సినిమా…
హైదరాబాద్లో నితిన్ మూవీ షూటింగ్
యూత్ స్టార్ నితిన్, క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్లో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘చెక్’. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ ఈనెల 10 నుండి హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనందప్రసాద్ మాట్లాడుతూ… “చెక్ టైటిల్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నటుడిగా నితిన్ స్థాయిని పెంచే చిత్రమిది. దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి చదరంగం నేపథ్యంలో చాలా విభిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, సాయి చంద్, సంపత్ రాజ్ తదితరులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. నవంబర్ 5 వరకు ఈ షెడ్యూల్ కొనసాగుతుంది, దాంతో దాదాపుగా సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది.” అని తెలిపారు. పోసాని కృష్ణ…
‘బోగన్’ తొలి గీతం ‘సింధూర’ విడుదల
జయం రవి, అరవింద్ స్వామి కాంబినేషన్తో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘బోగన్’ చిత్రాన్ని అదే పేరుతో ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తెలుగు ప్రేక్షకులకి అందిస్తున్నారు. ఇటీవలే విడుదలైన బోగన్ తెలుగు వెర్షన్ ట్రైలర్ కు అనూహ్య స్పందన లభించిన నేపథ్యంలో ఈ చిత్రం ఆడియో నుంచి సింధూర అనే పాటను విడుదల చేశారు యూనిట్ సభ్యులు. తమిళ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇమామ్ ట్యూన్ చేసిన ఈ పాటను తెలుగులో సమీర భరధ్వాజ్ ఆలపించారు. అలానే భువనచంద్ర ఈ పాటకు లిరిక్స్ అందించారు. ఈ సందర్భంగా నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ మా బ్యానర్ నుంచి బోగన్ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నామని ప్రకటన వచ్చినప్పటి నుంచి అటు ప్రేక్షకుల నుంచి ఇటు ఇండస్ట్రీ వర్గాల…
‘క్రాక్’ స్పెషల్ సాంగ్లో వర్మ పోరి
మాస్ మహారాజా రవితేజ, బ్లాక్బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్’ షూటింగ్ ముగింపు దశలో ఉంది. హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన ఒక సెట్లో ప్రస్తుతం రవితేజ, అప్సరా రాణిలపై ఒక ఐటమ్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఎస్. తమన్ స్వరాలు కూర్చిన ఈ మాస్ సాంగ్ను రామజోగయ్య శాస్త్రి రాశారు. ఈ సాంగ్కు జాని మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్నారు. పేరుపొందిన తమిళ నటులు సముద్రకని, వరలక్ష్మీ శరత్కుమార్ పవర్ఫుల్ క్యారెక్టర్లు పోషిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలతో, ఉద్వేగభరితమైన కథ, కథనాలతో సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్పై బి. మధు ‘క్రాక్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.…
ఆనంద సాయికి పవన్ అభినందనలు
యాదాద్రి ఆలయ ముఖ్య ఆర్కిటెక్ట్, ప్రముఖ కళా దర్శకుడు ఆనంద సాయి ఇటీవలే ‘ధార్మికరత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం స్వీకరించిన క్రమంలో జనసేన అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్ శుక్రవారం సాయంత్రం ఆనంద సాయిని అభినందించారు. హైదరాబాద్లోని తన కార్యాలయంలో ఆనంద సాయిని శాలువాతో సత్కరించి.. లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ నిర్మాణంలో ఎంతో నిష్టతో పాలుపంచుకోవడం ప్రశంసనీయం అన్నారు. ఆలయ నిర్మాణం, సంబంధిత వాస్తు అంశాలపై ఎంతో పరిశోధన చేసిన ఆయనకు ధార్మికరత్న పురస్కారం దక్కడం సముచితం అని చెప్పారు. నటుడు నర్రా శ్రీను ఈ సత్కారంలో పాల్గొని అభినందనలు తెలియచేశారు. శ్రీ శాంతికృష్ణ సేవా సమితి ఇటీవల హైదరాబాద్లోని బిర్లా ఆడిటోరియమ్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఆనంద సాయి…
మంచు విష్ణుకి విక్టరీ వెంకటేష్ హెల్ప్
ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో విష్ణు మంచు నటిస్తోన్న హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ ‘మోసగాళ్లు’ ఒకటి. ఇది తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఏక కాలంలో నిర్మాణమవుతున్న క్రాస్-ఓవర్ ఫిల్మ్. అలాగే తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల కానున్నది. ‘మోసగాళ్లు’ చిత్రాన్ని నిర్మిస్తోన్న విష్ణు మంచు ఇదివరకెన్నడూ లేని విధంగా దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ రిలీజ్ చేసిన టీజర్కు అద్వితీయమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా ఆసక్తికరమైన అప్డేట్ ఏమంటే.. ఇదివరకు ‘మోసగాళ్లు’ టైటిల్ కీ థీమ్ మ్యూజిక్ను రిలీజ్ చేసిన విక్టరీ వెంకటేష్, ఇప్పుడు తన వాయిస్ ఓవర్ను ఈ చిత్రానికి అందిస్తుండటం విశేషం. ఈ సినిమా స్టోరీని ప్రారంభం నుంచి ముగింపు దాకా ఆయన నెరేట్ చేయనున్నారు. టీజర్ రిలీజ్ అయినప్పట్నుంచీ ఇండస్ట్రీ వర్గాల్లో, ప్రేక్షకుల్లో మంచి…
నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ 4వ ఫిల్మ్
హ్యాండ్సమ్ హీరో నాగశౌర్య, టాలెంటెడ్ డైరెక్టర్ అనీష్ కృష్ణ కాంబినేషన్లో ప్రొడక్షన్ నంబర్ 4గా ఒక రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ను నిర్మించేందుకు ఐరా క్రియేషన్స్ సన్నాహాలు ప్రారంభించింది. శుక్రవారం సోషల్ మీడియాలో కాన్సెప్ట్ పోస్టర్ను రిలీజ్ చేయడం ద్వారా అఫిషియల్గా ఆ మూవీని ప్రకటించారు. ఉష ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా ఆహ్లాదకరమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనుంది. డైరెక్టర్ అనీష్ కృష్ణకు ఇది మూడో సినిమా. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇదివరకు నాగశౌర్య సూపర్ హిట్ ఫిల్మ్ ‘ఛలో’కు ఆయన బ్లాక్బస్టర్ మ్యూజిక్ అందించారు. ఆ సినిమాలోని ‘చూసీ చూడంగానే..’ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో మనకు తెలుసు. షూటింగ్కు సన్నాహాలు జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడి చేయనున్నారు. సాంకేతిక బృందం:డైరెక్టర్: అనీష్ కృష్ణనిర్మాత: ఉష ముల్పూరిసమర్పణ:…
