హైదరాబాద్ బ్యూటీ అమ్రిన్ ఖురేషి మంచి కథా బలమున్న చిత్రాల్లో నటిస్తూ.. అన్ని భాషల్లోనూ హీరోయిన్గా మంచి విజయాలు అందుకోవాలన్నదే నా లక్ష్యం’’ అని అన్నారు అమ్రిన్ ఖురేషి. రెండు బాలీవుడ్ భారీ చిత్రాల్లో నటిస్తోన్న పక్కా హైదరాబాదీ ఆమె. తెలుగులో సూపర్హిట్ అయిన ‘సినిమా చూపిస్తమావ’ చిత్రాన్ని ‘బ్యాడ్బాయ్’ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ప్రముఖ నటుడు వెటరన్ హీరో మిథున్ చక్రవర్తి తనయుడు నమషి చక్రవర్తి సరసన హీరోయిన్గా అమ్రిన్ నటిస్తోంది. రాజ్కుమార్ సంతోషి దర్శకత్వంలో ఇన్బాక్స్ పిక్చర్స్ బ్యానర్పై సాజిద్ ఖురేషి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్గా విడుదలకానుంది. ఇటీవల హైదరాబాద్కి వచ్చింది అమ్రిన్ ఖురేషితో మాట్లాడడం జరిగింది.. ఆ విశేషాలు మీకోసం.. నేను హైదరాబాద్లోనే పుట్టాను. శివ శివాని పబ్లిక్ స్కూల్లో చదువుకున్నా.…
Category: FILM NEWS
అందరి దృష్టి ఆలియాపైనే!
బాలీవుడ్ లో ఎందరు టాప్ హీరోయిన్లు ఉన్నా.. అందరి దృష్టి ఆలియాపైనే! కెరీర్ ప్రారంభించిన తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికల జాబితాలో చేరిపోయింది ఈ కుర్రబ్యూటీ. సీనియర్ భామల సైతం ఈ ఆలియా ముందు దిగదుడుపే అన్నంతగా ఎదిగేసింది. ఒక్కో సినిమాకి 8-10 కోట్ల పారితోషికం అందుకునే రేంజు ఆమెది. అలాంటి డిమాండ్ ఉన్న స్టార్ ని దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తన ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ కోసం లాక్ చేయడం ఆసక్తికరం. ఆలియా ఇప్పటికిప్పుడు వరుసగా నాలుగైదు పాన్ ఇండియా సినిమాలతో బిజీ. అయినా ఎస్.ఎస్.రాజమౌళి పీరియడ్ డ్రామా ఆర్.ఆర్.ఆర్ కి ఎలాంటి ట్రబుల్ ఇవ్వకుండా సెట్లో పాల్గొనడం ఆసక్తికరం. ఈ క్రేజీ మూవీ లో నటించేందుకు ఆమె ఎన్నో జాగ్రత్తలు తీసుకుందిట. ఈ సినిమాలో రామ్ చరణ్ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు…
కియరాకే ఆ చాన్సు ఎందుకు వచ్చింది?
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ వార్ రూపంలో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. గడిచిన ఏడాది అతడికి అన్నిరకాలుగా బాగా కలిసొచ్చింది. అయితే ఈపాటికే ప్రారంభం అవుతుంది అనుకున్న క్రిష్ 4 కి సంబంధించిన అధికారిక ప్రకటన అయితే ఏదీ వెలువరించలేకపోవడం హృతిక్ అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరిచింది. ప్రతిసారీ ఇదిగో వస్తున్నాం అదిగో వస్తున్నాం! అంటున్నా కానీ క్రిష్ ఫ్రాంఛైజీ కొత్త సినిమాపై సరైన సమాచారం లేదు.వార్ బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల వసూళ్లను సాధించింది. కానీ సదరు స్టార్ హీరో అప్పటి నుండి ఎటువంటి ప్రకటనలు చేయలేదు. కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రిపేర్ చేయడం కూడా ప్రారంభించలేదు. తాజా నివేదిక ప్రకారం.. హృతిక్ హాట్ స్టార్ మూవీ కోసం ప్రిపరేషన్ లో ఉన్నాడని తెలిసింది. అది డిజిటల్ రంగంలో తనకు పెద్ద అరంగేట్రం అవుతుంది. దీంతో…
సాయిరామ్ శంకర్ కు ‘రిసౌండ్’ కలిసొచ్చేనా?
సాయిరామ్ శంకర్ హీరోగా ‘రిసౌండ్’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. ఈ చిత్రం ద్వారా ఎస్.ఎస్. మురళీకృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాశీ సింగ్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని సురేష్ రెడ్డి, అయ్యప్పరాజు, రాజారెడ్డి నిర్మిస్తున్నారు. ఇదివరకు లాక్డౌన్ అనంతరం హైదరాబాద్లో షూటింగ్ పునరుద్ధరించి, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఒంగోలులో జరుగుతోంది. ఈ షెడ్యూల్లో కొన్ని ప్రధాన ఘట్టాలతో పాటు రెండు పాటలను చిత్రీకరిస్తున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. ‘రిసౌండ్’ టైటిల్కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇందులో ఓవైపు ఎంటర్టైన్ చేస్తూ, మరోవైపు యాక్షన్తో అలరించే పాత్రను సాయిరామ్ శంకర్ చేస్తున్నారు. సాయిప్రకాష్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్న ఈ చిత్రానికి స్వీకార్ అగస్తి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సారైనా సాయిరామ్ శంకర్ కు ‘రిసౌండ్’ కలిసొచ్చేనా?
రకుల్ ప్రీత్ సింగ్ రియల్ హీరో ఎవరో తెలుసా?
రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్ ను కాపాడుకోవడంలో ఎప్పటికప్పుడు ఆచి తూచి అడుగులు వేస్తోంది. కెరీర్ పరంగా మరో రెండేళ్ల పాటు ఎలాంటి డోకాలేనన్ని ప్రాజెక్టులతో యమబిజీగా ఉంది. చాలామంది రకుల్ బాగా వెనకబడి పోయిందని దుమారం లేపారు. ఇండస్ట్రీ వర్గాల్లో ఇక ఆమె పని అయిపోయిందని కూడా రూమర్సు సృష్టించారు. దాంతో రకుల్ కు బాగా మండిపోయింది. రేస్ లో వెనకబడుతోందన్న కథనాల నడుమ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులకు సంతకాలు చేసి కెరటంలా రివ్వుమని దూసుకొచ్చింది. తనపై విమర్శలు వచ్చిన ప్రతిసారీ ఇదే రకంగా సమాధానమిస్తూ తన చాకచక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇటీవల ఓ సందర్భంలో రకుల్ రకరకాల విషయాలపై మనసు విప్పి మాట్లాడింది. ఈ భామ ఇప్పటికి పలు చిత్రాలతో బిజీగా ఉన్నానని చెప్పింది. రాబోయే రెండుమూడేళ్ల వరకు బిజీగానే ఉన్నానని అంది.…
అర్జున్ రెడ్డి బ్యూటీ అంతపని చేసిందా?
అర్జున్ రెడ్డి బ్యూటీ అంతపని చేసిందా!?.. టాలీవుడ్ లో ఎవ్వరినోటా విన్నా తాజాగా ఇదే మాట! తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ను అందుకున్న షాలిని పాండేకు ఆ విజయం కలిసి రాలేదు. ఎంతో ఆశగా అవకాశాల కోసం ఎదురుచూసినా, తెలుగులో ఈమెకు ఎక్కువ ఆఫర్లు రాలేదు. దాంతో బాలీవుడ్ వైపు తొంగి చూశింది. అటు వైపునకు వెంటనే అడుగులు వేసింది. అనూహ్యంగా అక్కడ ఈ అమ్మడు యశ్ రాజ్ ఫిలింలో ఒక్కసారే మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే ఒక ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతుండగా మూడులో మరో ప్రాజెక్ట్ గా జునైద్ ఖాన్ తో సినిమా చేయబోతుంది. ఈమెకు ఈ మూడు ప్రాజెక్ట్ లతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ రావడం ఖాయం అంటున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్…
వీరభద్రం దర్శకత్వంలో ఆది సాయి కుమార్
లవ్లీ రాక్స్టార్ ఆది సాయికుమార్ హీరోగా ప్రముఖ దర్శకుడు ఎం. వీరభద్రం దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని విజన్ సినిమాస్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ప్రముఖ వ్యాపారవేత్త డా. నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కిరాతక అనే పవర్ఫుల్ టైటిల్ను కన్ఫర్మ్ చేసింది చిత్ర యూనిట్. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ మూవీలో ఆది సాయికుమార్ సరసన హీరోయిన్గా పాయల్ రాజ్పూత్ నటిస్తోంది. ఈ సందర్భంగా.. చిత్ర దర్శకుడు ఎం. వీరభద్రం మాట్లాడుతూ – ఆది కుమార్ హీరోగా నేను దర్శకత్వం వహించిన చుట్టాలబ్బాయి సినిమా కమర్షియల్గా మంచి విజయం సాధించింది. మరోసారి మా ఇద్దరి కాంబినేషన్లో అద్భుతమైన సినిమా రాబోతుంది. స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. ఆది…
‘Vision Cinemaas’ Production Film In Hit Combination Of Aadi Saikumar And M. Veerabhadram Is Titled As ‘Kirathaka’… Payal Rajput As Heroine
News is out that a big budgeted film to be made with Lovely Rockstar Aadi SaiKumar as Hero in M. Veerabhadram’s Direction. This Biggie will be made as a different crime thriller in ‘Vision Cinemaas’ banner as ‘Production No:3’. Popular Industrialist Dr. Nagam Tirupathi Reddy is Producing this film. The makers have confirmed a Powerful Title ‘Kirathaka’ for this flick. Payal Rajput will be seen as Heroine with Aadi SaiKumar in this movie which will go to sets very soon. On this occasion..Director M. Veerabhadram said, ” My previous outing…
‘మా’ అధ్యక్ష పోటీలో మంచు విష్ణు
తెలుగు చిత్రపరిశ్రమలో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలకు రంగం సిద్ధమయ్యింది. ఈసారి ‘మా’ అధ్యక్ష పోటీలో యంగ్ హీరో మంచు విష్ణు బరిలోకి దిగనుండటం ఎన్నికలపై ఆసక్తిని రేపుతోంది. కొత్త తరం కొత్త ఆలోచనలతో ముందుకు సాగితే మేలు జరుగుతుందనే అభిప్రాయంతో విష్ణు ఈ నిర్ణయం తీసుకున్నారు. పక్కా ప్రణాళికతోనే విష్ణు అడుగులు వేస్తున్నారు. తండ్రి, డా. మోహన్ బాబు ఆశీస్సులతో పాటు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి ప్రముఖ నటులను, నటీమణులను కూడా విష్ణు సంప్రదించి ఈ ఎన్నికల్లో పోటీలో నిలబడటానికి సిద్ధమయ్యారు. సీనియర్ నటీనటులు విష్ణు నిర్ణయానికి మద్దతు తెలపడంతో విష్ణు గెలుపుకి ఎక్కువ అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘మా’ సభ్యుల సంక్షేమం, ‘మా’ సొంత భవనం ఏర్పాటుకు కృషి… ఇవి ప్రధాన ఎజెండాగా ముందుకు సాగాలని మంచు…
ఆలేరు నూతన ఎస్.ఐ ఇద్రిస్అలీకి సత్కారం
టాలీవుడ్ టైమ్స్ – ఆలేరు…… యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నూతన ఎస్.ఐగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ఇద్రిస్అలీని కొలనుపాక మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిసి సత్కరించారు.
