ప్రపంచం లో అత్యధిక గేమ్ లవర్స్ ఆదరించే ఆట ఫుట్ బాల్ (సాకర్). ఈ ఆట నేపధ్యం లో యదార్ధగాద ఆధారంగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మైదాన్’. ప్రపంచ పటం లో ఫుట్ బాల్ ఆట రంగాన్ని భారత దేశానికి కూడా ఓ ప్రాముఖ్యత ఆపాదించిన ఓ కోచ్ నిజజీవిత కథతో ఈ చిత్రం తెరెకెక్కుతుంది. జీవితం లో నైనా, ఆటలో నైనా ఆత్మ విశ్వాసం, కష్టపడే తత్వంతో పాటు ఎన్నో త్యాగాలు చేస్తే గాని విజయం వరిస్తుంది. క్రీడా నేపధ్యం లో స్ఫూర్తివంతమైన కథగా మైదాన్ నిర్మించబడింది. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ గత ఏడాది రెండు సార్లు విడుదల తేదీ ని కూడా ప్రకటించారు . అయితే కరోనా మహమ్మారి కారణంగా ఆయా తేదీలలో విడుదల…
Author: M.D ABDUL - Tollywoodtimes
అక్టోబర్ 9న వస్తున్న ‘తీరం’ మంచి సక్సెస్ అవ్వాలి : మైటీ స్టార్ శ్రీకాంత్
అకి క్రియేటివ్ వర్క్స్, యల్ యస్ ప్రొడక్షన్స్ బ్యానర్లు పై శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, క్రిష్టెన్ రవళి, అపర్ణ నాయికా నాయకులుగా యం. శ్రీనివాసులు నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రం “తీరం” ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని అక్టోబర్ 9న అత్యధిక ధియేటర్సలలో గ్రాండ్ గా విడుదల కానుంది.. కాగా ఈ చిత్రం టీజర్ ను శత చిత్రాల కథానాయకుడు మైటీ స్టార్ శ్రీకాంత్ విడుదల చేశారు. ఆయన స్వగృహంలో జరిగిన ఈ కార్యక్రమంలో హీరో మరియు దర్శకులు అనిల్ ఇనమడుగు, శ్రావణ్ వైజిటి, సినెటేరియా అధినేత వెంకట్ బులెమోని, నటులు అజయ్, ఇజాజ్ జాన్, సునీల్ ఉప్పిరెట్ల, జై, కెమెరామెన్ శ్రవణ్ జి కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ బిజె తదితరులు పాల్గొన్నారు.. అనంతరం ఏర్పాటైన ప్రెస్ మీట్…
`నాట్యం` రెండో పాట విడుదల చేసిన విక్టరీ వెంకటేష్
నాట్యంఅంటే ఓ కథను డాన్స్ ద్వారా అందమైన రూపంలో చెప్పడమే. అలాంటి ఓ అద్భుతమైన కాన్సెప్ట్తో రూపొందిన చిత్రం నాట్యం. ఈ మూవీ ద్వారా ప్రముఖ కూచిపూడి డాన్సర్ సంధ్యారాజు నటిగా, నిర్మాతగా పరిచయం అవుతున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్, టీజర్కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల నటసింహ నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించిన ఈ సినిమాలో తొలి సాంగ్ నమః శివాయకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. తాజాగా నాట్యం సెకండ్ సాంగ్ పోనీ పోనీ ను విక్టరీ వెంకటేష్ విడుదల చేశారు. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. ”రేవంత్ దర్శకత్వంలో డాన్సర్ సంధ్య నటించిన నాట్యం సినిమా నుంచి ఈ పోనీ పోనీ సాంగ్ రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. విలక్షణ కథకు…
అక్టోబర్ 8న ‘నేను లేని నా ప్రేమకథ’ విడుదల
త్రిషాల ఎంటర్టైన్మెంట్స్, సరస్వతి క్రియేషన్స్, యస్.యస్.స్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ్ కందుకూరి, ఎ.భాస్కరరావు సంయుక్తంగా నిర్మించిన ‘నేను లేని నా ప్రేమకథ’ చిత్రం UFO Moviez INDIA LIMITED ద్వారా అక్టోబర్ 8న విడుదలకు సిద్ధమైంది. ఈ సంగీత ప్రేమకథా చిత్రానికి సురేష్ ఉత్తరాది దర్శకత్వం వహించగా.. నవీన్ చంద్ర మరియు గాయత్రి సురేష్ మరియు నూతన పరిచయం క్రిష్ సిద్ధిపల్లి, అదితి మ్యాకల్ తారాగణంగా కీలక పాత్రలో సీనియర్ నటుడు రాజా రవీంద్రలతో ఈ చిత్రం నిర్మించబడింది. ఇటీవల జెమినీ రికార్డ్స్(మ్యూజిక్) ద్వారా విడుదలైన ఈ చిత్ర సంగీతం శ్రోతలను, సినిమా అభిమానులను ఎంతగానో అలరించింది. వినూత్న కథాంశంలో, హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో ‘నేను లేని నా ప్రేమకథ’ చిత్రం నిర్మించబడిందని, అలాగే మా ప్రయత్నాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి సహకరిస్తున్న UFO Moviez వారికి ప్రత్యేక…
‘ఇదే మా కథ’ సినిమా కథ చెప్పగానే చాలా ఎగ్జైట్ అయ్యా: సుమంత్ అశ్విన్
సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఇదే మా కథ. గురు పవన్ దర్శకత్వంలో శ్రీమతి మనోరమ సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ గొల్లా ఈ చిత్రాన్ని నిర్మించారు. టాలీవుడ్ లోనే మొదటి రోడ్ జర్నీ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ సందర్బంగా హీరో సుమంత్ అశ్విన్ ఇంటర్వ్యూ…”డైరెక్టర్ ఓ ఫోటో సెషన్ చేద్దాం అన్నారు. సరే అండి అని చేశాం. హైదరాబాద్ నుంచి లడక్ కి ఓ జర్నీ ఉంటుంది. ఏదో రఫ్ గా చేసి ఆ ఫొటోస్ పంపించా. ఇది ఫైనల్ కాదనుకున్నా. డైరెక్టర్ చూసి నాకు ఇదే కావాలన్నారు. మొత్తం సినిమాలో అదే మెయిన్ టైన్ చేసాం.ఈ సినిమాలో ఒక్కొక్కరికీ ఒక్కో…
‘పెళ్లి సందD’ చిత్రం నుంచి ‘మధురానగరిలో యమునా తటిలో.. ’ అనే పాట విడుదల
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం ‘పెళ్లి సందD’. ఈ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ఆయన శిష్యురాలు గౌరి రోణంకి డైరెక్ట్ చేస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాల రూపకల్పనలో తన మేజిక్ను చూపిన ఈయన ‘పెళ్లిసందD’ లో అతిథి పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రం నుంచి ‘మధురానగరిలో యమునా తటిలో…’ అనే లిరికల్ పాటను మాస్ మహారాజా రవితేజ విడుదల చేశారు. సినిమా పెద్ద హిట్ కావాలని చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు.‘మధురా నగరిలో, మయునా తటిలో..మురళీ స్వరములే ముసిరిన ఎదలో..కురిసెనంట మురిపాల…
పూరి కోసం మహేష్ ట్వీట్ ?
సూపర్ స్టార్ మహేష్ బాబు – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్.. వీళ్లిద్దరి కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం పోకిరి. ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసింది. సరికొత్త రికార్డులను సృష్టించింది. ఆతర్వాత మహేష్ – పూరి కలసి చేసిన మరో సినిమా బిజినెస్ మేన్. ఈ సినిమా కూడా రికార్డులను సృష్టించింది. ఇలా మహేష్, పూరి కలిసి చేసిన పోకిరి, బిజినెస్ మేన్ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. మహేష్ తో పూరి జగన్నాథ్.. జనగణమన సినిమా చేయాలి అనుకున్నారు. కథ రెడీ చేశారు. మహేష్ కి కథ చెప్పారు. తనకు నచ్చిందని చెప్పారు మహేష్. అయితే.. ఏమైందో ఏమో…
వంద కోట్ల పరుగులో శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’
యువ సమ్రాట్ అక్కినేని నాగచైతన్య – ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన విభిన్న ప్రేమకథా చిత్రం లవ్ స్టోరీ. ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. మంచి కథను.. నిజాయితీగా చెప్పే దర్శకుడు శేఖర్ కమ్ముల. నాగచైతన్య – సాయిపల్లవి కాంబినేషన్లో మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి లవ్ స్టోరీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే.. కరోనా కారణంగా చాలా సార్లు వాయిదా పడింది. టీమ్ మాత్రం లవ్ స్టోరీ ఎన్ని సార్లు వాయిదా పడినా.. ఎప్పుడూ వచ్చినా విజయం మాత్రం ఖాయం అని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ఆ నమ్మకమే నిజమైంది.సినిమా పై ఎంత నమ్మకం ఉన్నా.. సినిమాను థియేటర్లో చూడడానికి జనాలు వస్తారా..? రారా..? అనే టెన్షన్ ఉండేది. ఆ టెన్షన్ అన్నింటికి చెక్…
‘మా’ ఎన్నికల్లో చిరు ఓటు ఎవరికి?
‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల వ్యవహారం రోజు రోజుకూ తీవ్రంగా వేడెక్కుతోంది. అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ఇద్దరూ నువ్వా నేనా? అన్నట్టుగా పోటీ పడుతున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేది ఉత్కంఠగా మారింది. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు నామినేషన్స్ వేయడం జరిగింది. మంచు విష్ణు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆసక్తికర విషయాలు చెప్పడం జరిగింది. వీరిద్దరి మధ్య ఏర్పడిన పోటీతో మా ఎన్నికలు రాజకీయ ఎన్నికలను తలపిస్తున్నాయి. సినీ ప్రముఖులే కాకుండా.. సామాన్యులు సైతం మా ఎన్నికల గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. చిరంజీవి.. ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తున్నట్టుగా నాగబాబు ప్రకటించారు. అయితే.. చిరంజీవి మీడియా ముందుకు వచ్చి ప్రకాష్ రాజ్ కి సపోర్ట్ చేస్తున్నట్టుగా ప్రకటించలేదు. దీంతో నిజంగానే…
ఆది సాయికుమార్ ‘అతిధి దేవో భవ’ నుండి ‘బాగుంటుంది నువ్వు నవ్వితే’ పాట విడుదల
ఆది సాయి కుమార్, నువేక్ష హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘అతిధి దేవో భవ’. శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పొలిమేర నాగేశ్వర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుండి మొదటిపాటగా ఓ ప్రేమ గీతాన్ని విడుదలచేశారు. ఆ పాట సంగీత ప్రియుల్ని అలరిస్తోంది. బాగుంటుంది నువ్వు నవ్వితే అంటూ సాగే ఈ గీతానికి భాస్కర భట్ల సాహిత్యం అందించగా లేటెస్ట్ సింగింగ్ సెన్సేషన్ సిద్ శ్రీరామ్, నూతన మోహన కలిసి ఈ పాటను ఆలపించారు. శేఖర్ చంద్ర మంచి బాణీలు సమకూర్చారు. యూత్ని విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ పాట యూట్యూబ్లో దూసుకుపోతోంది. ఈ పాటతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించబోతోన్నారు. ఈ…
