Kamal Haasan, Lokesh Kanagaraj’s Vikram Second Schedule Wrapped Up

Kamal Haasan, Lokesh Kanagaraj’s Vikram Second Schedule Wrapped Up

Universal hero Kamal Haasan and successful director Lokesh Kanagaraj have teamed up for an action thriller titled Vikram. Besides playing the lead role, Kamal Haasan is also producing the film in association with R Mahendran under Raaj Kamal Films International banner.Lokesh Kanagaraj managed to bring together three powerhouse performers – Kamal Haasan, Vijay Sethupathi and Fahadh Faasil – for Vikram. The first look of Vikram, which was unveiled in July this year, garnered the interest. The shooting is progressing at a brisk pace. Both Vijay Sethupathi and Fahadh Faasil joined…

టార్గెట్ల పేరుతో టార్చర్ ఆపండి: టీయూడబ్ల్యూజే నేత విరాహత్ అలీ

టార్గెట్ల పేరుతో టార్చర్ ఆపండి: టీయూడబ్ల్యూజే నేత విరాహత్ అలీ

యాడ్స్ టార్గెట్ల పేరుతో జర్నలిస్టులను మీడియా సంస్థల నిర్వాహకులు టార్చర్ పెడుతుండడంతో మానసిక వత్తిళ్లకు గురై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది… జర్నలిస్టులు వార్తల సేకరణకు నియామకం అవుతున్నారే తప్పా, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ చేసే పనులు చేయడానికి కాదని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అన్నారు. ఓ వైపు అప్పుల భారం, మరోవైపు తాను పనిచేస్తున్న మీడియా సంస్థ యాడ్స్ వేధింపులు భరించలేక మెదక్ జిల్లా నర్సాపూర్ వార్త పత్రిక సీనియర్ పాత్రికేయుడు ప్రవీణ్ కుమార్ గౌడ్ నిన్న రాత్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణాలను అతను సూసైడ్ నోట్ లో వెల్లడించాడు. కాగా సోమవారం నాడు అతని అంత్యక్రియలు నర్సాపూర్ లో జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా విరాహత్…

‘కొండపొలం’ ఆడియో లాంచ్ ఈవెంట్‌: అక్టోబర్ 8న విడుదల

kondapolam adiuo launch event at karnool

‘ఉప్పెన’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తరువాత మెగా సెన్సేషన్ వైష్ణవ్ తేజ్ రెండో చిత్రంతో అందరినీ మెస్మరైజ్ చేసేందుకు రెడీ అయ్యారు. క్రిష్ దర్శకత్వంలో రాబోతోన్న ‘కొండపొలం’ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 8న విడుదలకాబోతోంది. ఇక ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఆడియో లాంచ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎం కీరవాణి, రాజీవ్ రెడ్డి, క్రిష్, వైష్ణవ్ తేజ్, సాయి చంద్ తదితరులు పాల్గొన్నారు.సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి మాట్లాడుతూ.. ‘కర్నూలులో ఉన్న అభిమానులందరికీ థ్యాంక్స్. నాకు కర్నూలు జిల్లా అంటే చాలా ఇష్టం. మంత్రాలయం, శ్రీశైలం, జోగులాంబ ఇలా నాకు ఇష్టమైన పుణ్యక్షేత్రాలున్నాయి. ఆత్యన్యూనత భావం, అపనమ్మకం ఉన్నప్పుడు పాడుకునే మంత్రాన్ని నేను కంపోజ్ చేశాను. ఇక్కడకు వస్తూ వస్తూనే ఓ…

ప్రకాశ్ రాజ్‌కు ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంఘీబావం

prakashraj news

ఈ నెల 10వ తేదీన ‘మా’ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజు గారిని హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి తన ప్యానల్‌ సంపూర్ణ మెజారిటీతో గెలవాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లో జరిగే చిత్ర నిర్మాణాలలో స్థానిక కళాకారులకు అవకాశాలు కల్పించాలని, అందుకు ప్రకాశ్ రాజ్ తరపు నుండి పూర్తి సహకారం కావాలని వారు కోరారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజు ఏపీ మా ప్రతినిధులతో మాట్లాడుతూ.. నేను విశ్వ నటుడిగా ఉన్నాను. కనుక ఏ రాష్ట్రానికో, భాషకో పరిమితం చేయవద్దు. మా ఎన్నికలకు గాను సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రతి కార్మికుడి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండే విధంగా భవిష్యత్తు కోసం ముందుకు వెళ్తున్నాము. అన్ని రాష్ట్రాల్లోని కళాకారుల పరిస్థితి ఈ…

నటుడు ప్రకాశ్ రాజ్ ఆవిష్కరించిన ‘రుద్రాక్షపురం’ టైటిల్ పోస్టర్

rudrakshapuram titil relesed

పీఆర్వో వీరబాబు ప్రధాన పాత్రలో టెన్ ట్రీస్ ఫిలం ప్రొడక్షన్ హౌస్ పతాకంపై కనకదుర్గ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం’. ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్‌ను విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ విడుదల చేసి, ఈ చిత్ర టైటిల్ విభిన్నంగా ఉందని, కొత్తదనంతో కూడిన ఈ చిత్రం విజయవంతం కావాలని చిత్రయూనిట్‌కు శుభాశీస్సులు అందించారు. ఈ టైటిల్ లుక్ లాంచ్ కార్యక్రమములో నిర్మాత సురేశ్ కొండేటి, నటులు హేమ, రమణా రెడ్డి, నటుడు అండ్ డిస్టిబ్యూటర్ రాఘవేంద్ర, అశోక్ మున్నూర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.‘‘అనంతపురం జిల్లా ‘రుద్రాక్షపురం’ ఫారెస్ట్‌లో 2018‌లో జరిగిన ఓ యధార్థ సంఘటనను ఆధారంగా తీసుకొని దర్శకుడు ఆర్.కె. గాంధీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆయన కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. మంచి సాంకేతిక…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జనసేన’ను కర్ణాటకలో విస్తరిస్తున్న డి.ఎస్.రావ్-వి.సముద్ర

pawankalyan news

జనసేనాధినేతగా అప్రతిహతంగా సాగుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు వి.సముద్ర తెలుగులో రూపొందించిన “జైసేన” చిత్రాన్ని కన్నడలో అనువదిస్తున్నారు ప్రముఖ నటుడు-నిర్మాత డి.ఎస్.రావు.శ్రీకాంత్, సునీల్, తారక్ రత్న, శ్రీరామ్, సత్యం రాజేష్, ప్రవీణ్, హరీష్ గౌతమ్, అభినవ్ మణికంఠ, విశ్వకార్తికేయ, నీతూ గౌడ్, ఆరాధ్య, మనోచిత్ర, అజయ్ ఘోష్, చమ్మక్ చంద్ర, డి.ఎస్.రావ్, పృథ్వి ముఖ్యపాత్రలు పోషించిన “జై సేన” చిత్రం మెగా-పవర్ ఫ్యాన్స్ తోపాటు అందరినీ అమితంగా ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని గణపతి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డి.ఎస్.రావ్ కన్నడ ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగులో ఘన విజయం సాధించిన “జై సేన” కన్నడలోనూ మంచి విజయం కైవసం చేసుకోవడం ఖాయమని దర్శకుడు వి.సముద్ర పేర్కొన్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: వాసు, కూర్పు: నందమూరి హరి, నిర్మాత: డి.ఎస్.రావ్, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం:…

సెన్సార్ సన్నాహాల్లో “ఎక్కడికో ఈ అడుగు’

ekkadiko ee adugu telugu movie

‘ఎఫెక్ట్స్ రాజు’గా పరిశ్రమ వర్గాలకు సుపరిచితుడైన రాజు బొనగాని దర్శకత్వంలో… ‘స్కై లైన్ ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై తొలి ప్రయత్నంగా అట్లూరి శ్రీనివాస్ నిర్మిస్తున్న విభిన్న ప్రేమకథా చిత్రం “ఎక్కడికో ఈ అడుగు”. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెన్సార్ సన్నాహాల్లో ఉంది. గోపీకృష్ణ-ప్రియాంక చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆర్తి రాజ్, జయప్రకాష్ (తమిళ్), తోటపల్లి మధు, పిల్లా ప్రసాద్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 1990లో జరిగిన ఓ యదార్ధ సంఘటన ఆధారంగా.. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన “ఎక్కడికో ఈ అడుగు” అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం తమకుందని, సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న తమ చిత్రాన్ని నవంబర్ ద్వితీయార్ధంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు రాజు బొనగాని తెలిపారు. నిర్మాత అట్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ…”చిత్ర నిర్మాణంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్…

సెన్సార్ కార్యక్రమాల్లో ‘1948 – అఖండ భారత్’

(the murder of mahathma)

ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎం.వై.మహర్షి నిర్మిస్తున్న చిత్రం ”1948-అఖండ భారత్ ”. అన్ని భారతీయ మరియు ముఖ్య అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. గాంధీ జయంతి సందర్బంగా ఈ చిత్రం తాజా పోస్టర్ ను రిలీజ్ చేశారు.అలేఖ్య శెట్టి హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ చిత్రంలో గాంధీగా రఘనందన్, నాథురాం గోడ్సే గా డా. ఆర్యవర్ధన్ రాజ్, సర్ధార్ వల్లభాయ్ పటేల్ గా శరద్ దద్భావల, నెహ్రుగా ఇంతియాజ్, జిన్నాగా జెన్నీ, అబ్దుల్ గఫర్ ఖాన్ గా సమ్మెట గాంధీ ప్రధాన పాత్రలు పోషించగా సుమారు 92 ముఖ్య పాత్రలతో భారీగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్నట్లు నిర్మాత ఎం.వై.మహర్షి తెలిపారు. గాంధీజీని ఎవరు చంపారన్నది అందరికి తెలుసు. కానీ ఎందుకు.. ఏ పరిస్థితుల్లో చంపాల్సి…