Peene Ke Baad Song From Akash Puri’s Romantic Is Out

peene Ke Baad Song From Akash Puri’s Romantic Is Out

Dashing director Puri Jagannadh has provided story, screenplay and dialogues for his son Akash Puri’s next outing Romantic being helmed by his protégé Anil Paduri. Ketika Sharma is the leading lady in the film for which music is scored by Sunil Kashyap.First two songs of the film got good response and today they have come up with lyrical video of third single Peene Ke Baad. How people behave after they are drunk is the song is all about and also the kind of energy or kick gives the booze, when…

Shaan roped in as actor-singer for the Ilaiyaraaja musical ‘Music School’

Shaan roped in as actor-singer for the Ilaiyaraaja musical 'Music School'

by SALMA KHAN@Tollywoodtimes Renowned for his euphonious voice, singer Shaan has stepped aboard for Papa Rao’s Biyyala’s Hindi directorial debut, Music School, a musical by Ilaiyaraaja in the capacity of an actor. The director-writer was thoroughly impressed by the singer’s flamboyance as the latter sang in Ilaiyaraaja’s studio after which he was offered a part in the upcoming musical. Starring Sharman Joshi and Shriya Saran, the forthcoming musical shall witness Shaan in the role of Saran’s ex-boyfriend. What’s more is that apart from acting, he will also be singing a…

ఇళ‌య‌రాజా ‘మ్యూజిక్ స్కూల్’లో షాన్

Shaan roped in as actor-singer for the Ilaiyaraaja musical 'Music School'

వైవిధ్యమైన స్వరంతో పాటలు పాడుతూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ సింగర్ షాన్ ఇప్పుడు పాపారావు బియ్యాల దర్శకుడిగా పరిచయమవుతూ తెలుగు, హిందీ భాష‌ల్లో తెరకెక్కిస్తోన్న చిత్రం ‘మ్యూజిక్ స్కూల్‌’ కోసం న‌టుడిగా మారారు. మాస్ట్రో ఇళ‌య‌రాజా ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త‌న విల‌క్ష‌ణ గాత్రంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న సింగర్ షాన్ ‘మ్యూజిక్ స్కూల్’ ద‌ర్శ‌క నిర్మాత‌ల‌ను కూడా ఆక‌ట్టుకున్నారు. అయితే గాత్రంతోనే కాదు బాడీ లాంగ్వేజ్‌తోనూ. ఇళ‌య‌రాజా స్టూడియోలో ఓ పాట పాడిన ఈ సింగ‌ర్‌ను చూసి, పాత్ర‌కు స‌రిపోతాడ‌ని భావించి త‌మ‌ సినిమాలో న‌టించాల‌ని చిత్ర‌ ద‌ర్శ‌క నిర్మాత‌లు కోరారు. శ‌ర్మ‌న్ జోషి, శ్రియా శ‌ర‌న్ న‌టిస్తున్న ఈ చిత్రంలో శ్రియ మాజీ ప్రేమికుడుగా షాన్ క‌నిపించ‌బోతున్నారు. షాన్ ఈ సినిమాలో న‌టించ‌డంతో పాటు సినిమాలో పాట…

జర్నలిస్టుల సమస్యలపై నిర్లక్ష్యం తగదు

general news

టీయుడబ్ల్యుజె రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆగ్రహం జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్యం తగదని, వివిధ వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నట్లు గొప్పలు చెబుకుంటున్న పాలకులు జర్నలిస్టుల సంక్షేమాన్ని ఎందుకు విస్మరిస్తున్నారని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయుడబ్ల్యుజె) నాయకత్వం ప్రశ్నించింది.ఆదివారం నాడు హైదర్ గుడ లోని సెంటర్ పార్క్ హోటల్ కాన్ఫరెన్స్ హాలులో టీయుడబ్ల్యుజె రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై దాదాపు 6 గంటల పాటు సమావేశం చర్చించింది. ముఖ్యంగా కోవిడ్ తో పాటు వివిధ సంఘటనల్లో అకాల మరణం చెందిన జర్నలిస్టుల కుటుంబాలు దీనస్థితిలో జీవితాలు గడుపుతున్నా బాధితులను ప్రభుత్వం పట్టించుకోక పోవడం విచారకరమని ఐజేయూ జాతీయ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి ఆవేదన…

‘గోర్ మాటి’ పాటని ఆవిష్కరించిన చంద్రబోస్

gormaati movie still

బంజారా బిగ్ సినిమాస్ పతాకంపై శంకర్ జాదవ్ , కరిష్మా, అదిరే అభి, సిరిరాజ్ ప్రధాన తారాగణంగా శంకర్ జాదవ్ దర్శకత్వంలో రేఖ్య నాయక్ రెండు బాషల్లో నిర్మిస్తున్న చిత్రం తెలుగులో రాజ్ పుత్ (బార్న్ ఆఫ్ వారియర్), బంజారాలో గోర్ మాటి (పవర్ ఆఫ్ యూనిటీ). ఈ చిత్రానికి సంబంధించిన పాటని గీత రచయిత చంద్రబోస్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘ఇండియాలో 12 కోట్ల మంది బంజారాలు ఈ సినిమాను ఖచ్చితంగా చూడాల్సిన చిత్రం. కచ్చితంగా ఈ సినిమానిఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు. నటీనటులు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. దర్శకుడు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ చిత్రాన్ని ఆదరిస్తే ఇలాంటివి మరెన్నో చిత్రాలు వారు మీముందుకు తీసుకువస్తారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘జబర్దస్త్’…

లఖింపూర్ రైతు హంతకులను శిక్షించాలని మౌనదీక్ష

pcc monadheeksha

ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఉత్తర ప్రదేశ్ లఖింపూర్ రైతు హంతకులను శిక్షించాలని సోమవారం పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపట్టిన మౌనదీక్షలో పాల్గొన్న పీసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు, యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

భద్ర ప్రొడక్షన్ ‘తగ్గేదే లే’ ఫస్ట్ లుక్ విడుదల

thaggedele telugu movie first look vidudhala

టాలీవుడ్‌లో కొత్త బ్యానర్ ప్రారంభమైంది. నిర్మాతలు ప్రేమ్ కుమార్ పాండే, పీవీ సుబ్బారెడ్డి సంయుక్తంగా కలిసి ప్రారంభించిన భద్ర ప్రొడక్షన్‌ను ఈ రోజు ఎంఈఐఎల్ పీపీరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. భద్ర ప్రొడక్షన్స్ పతాకంపై మొదటి చిత్రంగా తగ్గేదేలే.. అనే ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, అనన్య సేన్ గుప్తా, రవి శంకర్, రాజా రవీందర్, నాగ బాబు, అయ్యప్ప శర్మ, పృథ్వీ తదితరులు నటించారు. భద్ర ప్రొడక్షన్ కంపెనీ లోగోను ఎంఈఐఎల్ పీపీరెడ్డి ఆవిష్కరించగా.. నిర్మాతలు ప్రేమ్ కుమార్ పాండే, పీవీ సుబ్బారెడ్డి తగ్గేదేలే ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.నిర్మాత ప్రేమ్ కుమార్ పాండే మాట్లాడుతూ.. ‘మంచి కథలను చెప్పేందుకు ఈ ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించాం. మన చరిత్రలో ఎన్నెన్నో కథలున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కల్చర్ ఉంటుంది. మన…

‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు

maa adyakshudigaa manchu vishnu

హోరాహోరీగా సాగిన ఈ పోరులో మంచు కుటుంబానికే ‘మా’ పీఠం దక్కింది. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా మంచు విష్ణు గెలుపొందారు. విమర్శలు, వివాదాల మధ్య రసవత్తరమైన పోరు సాగిన ఎన్నికల్లో మొదటి నుంచి ఆధిక్యంలో ఉన్న ఆయన ప్రకాశ్‌రాజ్‌పై ఊహించని ఘన విజయం సాధించారు. జాయింట్‌ సెక్రటరీగా మంచు విష్ణు ప్యానల్‌కు చెందిన గౌతమ్‌ రాజు గెలుపుపొందగా, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ నుంచి శ్రీకాంత్‌ అధిక ఓట్లతోవిజయాన్ని కైవసం చేసుకున్నారు. . వైస్‌ ప్రెసిడెంట్‌గా మంచు విష్ణు టీమ్‌ నుంచి పృథ్వీ రాజ్‌ విజయం సాధించారు. మొత్తం మీద ఈసీ మెంబర్స్ గా ప్రకాశ్ రాజ్ 11, మంచు విష్ణు 7 గెలుచుకున్నారు. ‘మా’ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నప్పుడే అందరిలో ఉత్కంఠ నెలకొంది. ప్రకాశ్ రాజ్ ప్యానల్‌ నుండి జబర్దస్త్…

అట్టహాసంగా సినీ గోయర్స్ స్వర్ణోత్సవ సినిమా అవార్డుల వేడుకలు

cine goyers awards

హాజరైన గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ సినిమా రంగం మాత్రమే కాదు, ఏ రంగం లో అయినా పురస్కారాలు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తాయని, బాధ్యతను మరింత పెంపొందిస్తాయని, అన్ని విధాలుగా రాణించేందుకు దోహదపడతాయని తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ అన్నారు. ప్రతిష్టాత్మక సినీ గోయర్స్ 52వ స్వర్ణోత్సవ ఫిలిం అవార్డుల వేడుకలు శుక్రవారం శిల్పకళా వేదిక లో అట్టహాసంగా జరిగాయి.ముఖ్యఅతిధిగా విచ్చేసిన గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ సమాజం లో అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన వినోద మాధ్యమం సినిమా అని, బాధ్యతాయుత సినిమాలు నిర్మించాలని కోరారు. దక్షిణాది రాష్ట్రాల్లో టాలీవుడ్ సినిమా కు ప్రత్యేక గుర్తింపు ఉందని, లక్షల మంది సినిమా రంగం లో ఉపాధి పొందుతున్నారని అభినందించారు. సమాజం లో నెలకొన్న పరిస్థితులను అధిగమించేందుకు సినిమా రంగం కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.డాక్టర్…