డైనమిక్ హీరో అడివి శేష్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ‘మేజర్’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ పనులను అడవి శేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 26/11 హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు శేష్. మేజర్ లో అడవి శేష్ కథానాయకుడిగా నటించడమే కాకుండా కథ, స్క్రీన్ప్లే కూడా అందించారు. శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న ‘మేజర్’ కొత్త విడుదల తేదీ ఖరారైయింది. జూన్ 3న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ లో అడివి శేష్ నుదిటిపై గాయంతో కనిపించగా,…
Year: 2022
Adivi Sesh’s Pan India Film Major Releasing Worldwide On June 3rd
Actor Adivi Sesh’s first Pan India film Major is presently in post-production phase. Sesh is closely overseeing the works, since it’s his most ambitious project. From the time, he planned to make a film on the life of 26/11 hero Major Sandeep Unnikrishnan, Sesh has been very attentive about every aspect of the making of Major. Besides doing the lead role, Sesh has also penned story and screenplay of the movie. Directed by Sashi Kiran Tikka, Major gets a new release date. The movie will grace the cinemas worldwide on…
సుమ లేకపోతే ‘జయమ్మ పంచాయితీ సాధ్యమయ్యేది కాదు : దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు
పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన ‘జయమ్మ పంచాయితీ’ విడుదలకు సిద్ధమైయింది. వెన్నెల క్రియేషన్స్ పతాకం పై బలగ ప్రకాష్ నిర్మించిన ‘జయమ్మ పంచాయితీ’ మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైయింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ కలివరపుతో ముఖాముఖి. – నేను శ్రీకాకుళం సమీపంలోని గ్రామం నుండి వచ్చాను. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాక సినిమాపై ఇంట్రెస్ట్ తో షార్ట్ ఫిల్మ్స్ చేశాను. స్టార్ హీరోలతో పనిచేయాలని కొన్నాళ్లుగా అనుకుంటున్నాను. స్టార్ హీరోతో సినిమా తీయడం అంత ఈజీ కాదనే విషయం అర్థమయ్యేసరికి నాకు టైం పట్టింది. అప్పుడే 60 నుంచి 70 లక్షల బడ్జెట్తో సినిమా తీయడానికి కొంతమంది మిత్రులతో కలిసి పనిచేశాను. – ‘జయమ్మ పంచాయితీ’ ఒక పొటెన్షియల్ స్క్రిప్ట్ గా వస్తుందని…
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులుగా కొల్లి రామకృష్ణ
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు శ్రీ నారాయణదాస్ కిషన్ దాస్ నారంగ్ గారు 19-04-2022 వ తేదీన స్వర్గస్థులైనందున, ఈ విషయమై 27-04-2022 వ తేదీన జరిగిన కార్యవర్గ సమావేశంలో ఫిలిం ఛాంబర్ నియమ నిబంధనలు అనుసరించి ఉపాధ్యక్షులైన శ్రీ కొల్లి రామకృష్ణ గారిని (మెసర్స్ రిథమ్ డిజిటల్ థియేటర్ ప్రైవేట్ లిమిటెడ్), తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. శ్రీ కొల్లి రామకృష్ణ గారి పదవీకాలం 31-07-2022 వ తేదీ వరకు ఉండును. -కె.ఎల్. దామోదర్ ప్రసాద్, ఎం. రమేష్, గౌరవ కార్యదర్శులు
బి. సుమతి ఐపీఎస్ విడుదల చేసిన ‘ఫోకస్’ చిత్రంలోని అషురెడ్డి స్పెషల్ లుక్ పోస్టర్!!
యంగ్ హీరో విజయ్ శంకర్, `బిగ్బాస్` ఫేమ్ అషూరెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం `ఫోకస్`. సుహాసిని మణిరత్నం, భానుచందర్ కీలక పాత్రలలో నటిస్తున్నఈ చిత్రానికి జి. సూర్యతేజ దర్శకుడు. మర్డర్ మిస్టరీ బ్యాక్డ్రాప్లో ఆద్యంతం ఉత్కంఠమైన కథ కథనాలతో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్కి మంచి రెస్పాన్స్ రాగా ఇటీవల విడుదలైన ఫోకస్ మూవీ టీజర్ ఐదు లక్షలకు పైగా వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అషురెడ్డి మొదటిసారిగా పోలీస్ ఆఫీసర్గా కనిపించనుంది. తాజాగా ఆమె లుక్ను బి. సుమతి ఐపీఎస్ (డీఐజీ, మహిళా భద్రతా విభాగం) విడుదల చేసి చిత్ర యూనిట్కు ఆల్ ది బెస్ట్ తెలిపారు.
ప్రజల హృదయాల్లో కేసీఆర్ కు సుస్థిరస్థానం : తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పిటీసీ బొట్ల పరమేశ్వర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మాజీ జెడ్పిటీసీ బొట్ల పరమేశ్వర్ హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆయన టీఆర్ఎస్ ప్లీనరీ వేదిక వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టే నాటికి రాష్ట్ర సాధన కోసం చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయని, నిస్పృహలో ఉన్న తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి రాజకీయ ప్రక్రియ ద్వారా రాష్ట్రాన్ని సాధిస్తానని కేసీఆర్ ముందడుగు వేశారని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఇంతితై వటుడింతై అన్నట్లు 2001 నుంచి నేటి వరకు 21 ఏండ్లుగా ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి బలమైన సిద్దాంత పార్టీగా పేరుగాంచిందన్నారు.…
అత్యంత వైభవంగా వడ్డేపల్లి సాయి ఆకాష్-శివానిల వివాహా వేడుక
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన కీ.శే. వడ్డేపల్లి సోమయ్య & శ్రీమతి కనకలక్ష్మి గార్ల మనవడు, శ్రీ వడ్డేపల్లి ఆంజనేయులు & శ్రీమతి వడ్డేపల్లి పుణ్యవతిల కుమారుడు అయిన సాయి ఆకాష్ వివాహం శ్రీ చిట్టూరి ఉదయ భాస్కర్ & శ్రీమతి శ్రీ వంశీ గార్ల ఏకైక పుత్రిక చి.ల.సౌ. శివానితో విశాఖపట్టణంలోని ఎన్.ఆర్.ఫంక్షన్ హాల్ లో అత్యంత వైభవంగా జరిగింది. స్వస్త్రిశ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత్ నామ సంవత్సర చైత్ర బహుళ సప్తమి శనివారం తేది 23-04-2022 ఉదయం 10:41 నిమిషములకు ఉత్తరాషాఢ నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తమునందు జరిగిన ఈ వివాహానికి ఆత్మీయులు, బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. శ్రీమతి & శ్రీ ఎన్.ప్రశాంత్-దీప్తి , వి. వెంకటేష్ -శైలజ, కె. గోపాల్-కవిత, వి. శోభారాణి, వి. లక్ష్మణ్-స్వప్న,…
నూతన వధూవరులు వడ్డేపల్లి సాయి ఆకాష్-శివానిలను ఆశీర్వదించిన బోట్ల పరమేశ్వర్
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణానికి చెందిన కీ.శే. వడ్డేపల్లి సోమయ్య & శ్రీమతి కనకలక్ష్మి గార్ల మనవడు, శ్రీ వడ్డేపల్లి ఆంజనేయులు & శ్రీమతి వడ్డేపల్లి పుణ్యవతిల కుమారుడు అయిన సాయి ఆకాష్ వివాహం శ్రీ చిట్టూరి ఉదయ భాస్కర్ & శ్రీమతి శ్రీ వంశీ గార్ల ఏకైక పుత్రిక చి.ల.సౌ. శివానితో విశాఖపట్టణంలోని ఎన్.ఆర్.ఫంక్షన్ హాల్ లో అత్యంత వైభవంగా జరిగింది. స్వస్త్రిశ్రీ చాంద్రమాన శ్రీ శుభకృత్ నామ సంవత్సర చైత్ర బహుళ సప్తమి శనివారం తేది 23-04-2022 ఉదయం 10:41 నిమిషములకు ఉత్తరాషాఢ నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశ సుముహూర్తమునందు జరిగిన ఈ వివాహానికి ఆత్మీయులు, బంధుమిత్రులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. శ్రీమతి & శ్రీ ఎన్.ప్రశాంత్-దీప్తి , వి. వెంకటేష్ -శైలజ, కె. గోపాల్-కవిత, వి. శోభారాణి, వి. లక్ష్మణ్-స్వప్న,…
కీలక అంశాలపై ఐజేయూ కార్యవర్గం సుదీర్ఘ చర్చ : మథురలో ముగిసిన సమావేశాలు
దేశంలో మీడియా సంస్థల, జర్నలిస్టుల స్థితిగతులు, భావ ప్రకటన స్వేచ్ఛను హరించే కుట్రలు, పాత్రికేయులపై దాడులు, హత్యలు తదితర అంశాలపై రెండు రోజుల పాటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని మథుర నగరంలో జరిగిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలకమైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఐజేయూ కార్యవర్గం, వివిధ రాష్ట్రాల జర్నలిస్టుల సంఘాల ప్రధాన బాధ్యులు, పాల్గొన్న ఈ సమావేశం మంగళవారం సాయంత్రం ముగిసింది. మే 10 న జర్నలిస్టుల జాతీయ నిరసనదినం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మే 10 న “జాతీయస్థాయి నిరసనదినం” పాటించాలని ఐ.జే.యు. జాతీయ కార్యవర్గ సమావేశం పిలుపు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర నగరంలోని గోవర్ధన్ ప్యాలస్ సమావేశమందిరంలో జరుగుతున్న రెండురోజుల జాతీయ కార్యవర్గ సమావేశాలు…
‘1996 ధర్మపురి’ చిత్రానికి ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు : హీరో గగన్ విహారి
మహా ప్రస్థానం, అత్తారింటికి దారేది, క్షణం, నిన్ను కోరి,శైలజారెడ్డి అల్లుడు, కృష్ణార్జున యుద్ధం,118, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలలో విలన్ గా, సోదరుడుగా, స్నేహితుడుగా నటించి ప్రేక్షకులలోను, పరిశ్రమలోను నటుడుగా మంచిపేరు తెచ్చుకున్న నటుడు గగన్ విహారి. తాజాగా “1996 ధర్మపురి”చిత్రంతో.హీరోగా పరిచయ మయ్యాడు.శేఖర్ మాస్టర్ సమర్పణలో భాస్కర గ్రూప్ ఆఫ్ మీడియా బ్యానర్ లో గగన్ విహారి, అపర్ణ దేవి జంటగా జగత్ దర్శకత్వంలో భాస్కర్ యాదవ్ దాసరి నిర్మించిన చిత్రం”1996 ధర్మపురి”. .ఓషో వెంకట్ సంగీతం ఆందించిన ఈ చిత్రానికి మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 22 న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైన ప్రతి చోటా విజయవంతంగా ప్రదర్శింప బడుతూ ప్రేక్షకాదరణ పొందుతున్న సందర్భంగా చిత్ర హీరో గగన్ విహారి మీడియాతో మాట్లాడుతూ… నాకు యాక్టింగ్…
