‘కిస్మత్’ నాన్ స్టాప్ కామెడీ : టీజర్ విడుదలలో చిత్ర టీమ్ కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ సంయుక్తంగా శ్రీనాథ్ బాదినేని దర్శకత్వంలో నిర్మిస్తున్న బడ్డీ కామెడీ ఎంటర్ టైనర్ ‘కిస్మత్’. నరేష్ అగస్త్య, అభినవ్ గోమఠం, విశ్వ దేవ్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రియా సుమన్ కథానాయికగా నటిస్తుండగా, సిహెచ్ భానుప్రసాద్ రెడ్డి సహ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్లుక్ని ఇటీవలే విడుదల చేసి సినిమాలోని ప్రధాన పాత్రధారులను పరిచయం చేశారు. ఈరోజు ఈ సినిమా టీజర్ను హీరో శ్రీవిష్ణు లాంచ్ చేశారు. బిగ్ ఫెయిల్యూర్ అయిన ముగ్గురు బడ్డీ దోస్తులు తమ జీవితంలో ఏదైనా అద్భుతం జరగాలని ఆశిస్తుంటారు. విశ్వ దేవ్ హోప్ కోల్పోయి ఉంటాడు, అభినవ్ గోమతం రచయితగా…