డిఫరెంట్ సినిమాలు, పాత్రలను ఎంచుకోవడమే కాదు.. ఆ పాత్రల్లో ఒదిగిపోయే నటన ఉంటే ప్రేక్షకుల హృదయాల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకోవచ్చు అనడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ సత్యదేవ్. ‘బ్లఫ్ మాస్టర్ , ఉమామహేశ్వరాయ ఉగ్రరూపస్య’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న సత్యదేవ్ మరోసారి ‘తిమ్మరుసు’గా మెస్మరైజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈస్ట్కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరుతో పాటు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్పై ‘మను’ వంటి డిఫరెంట్ చిత్రాన్ని అందించిన నిర్మాత సృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. శుక్రవారం ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్రయూనిట్. ఈ పాటను స్టార్ హీరోయిన్ సమంత అక్కినేని విడుదల చేసి యూనిట్ను అభినందించారు. ఇందులో సత్యదేవ్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సాంగ్లో హీరో…
Category: FILM NEWS
ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరడం పద్మశాలిల్లో నూతనోత్సాహం నింపింది : బొట్ల పరమేశ్వర్
టాలీవుడ్ టైమ్స్ – హైదరాబాద్ బ్యూరో: తెలుగుదేశం నాయకుడు ఎల్.రమణ తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్)లో చేరిన సందర్బంగా ఆయన చేరికను స్వాగతిస్తూ భువనగిరి యాదాద్రి జిల్లా ఆలేరు మాజీ జెడ్.పి.టి.సి బొట్ల పరమేశ్వర్ శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ బి.ఎస్ రాములు, అఖిల భారత మహిళా అధ్యక్షురాలు శ్రీమతి వనం దుష్యంతుల, తెలగాణ రాష్ట్ర పద్మశాలి మహిళా అధ్యక్షురాలు గుంటుక రూప, డా. క్రాంతి, శ్రీనివాస్, వనం విశ్వనాధం హైకోర్టు అడ్వకేట్ , ఎర్రమాద శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జెడ్.పి.టి.సి బొట్ల పరమేశ్వర్ మాట్లాడుతూ -” తెలుగుదేశం నాయకుడు ఎల్.రమణ తెలంగాణ రాష్ట్ర సమితి (టి.ఆర్.ఎస్)లో చేరిన సందర్బంగా తెలంగాణ రాష్ట్ర పద్మశాలిల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. కేసీఆర్ పాలనలో…
కవిత్వం// మేఘం మిగిల్చి వెళ్లిన వాన
రవీంద్రసూరి నామాల9848321079 ఆగి ఆగి కురుస్తున్నమధ్యాహ్నపు వాన మా చిన్నోడు ఏడుపు ఆపినిద్రలోకి వెళ్లిన నిశ్శబ్దంలావాన సాయంకాలం దాకాసన్న సన్నని ధారలుగాకురుస్తూనే ఉందిఆదాట్న,సగం నిద్రనుండి లేచిన చిన్నోడుతెల్లారిందనిపళ్ళుతోముకోవడానికిమారాం చేసినట్టుగావాన కసురుకుంటూఇంకా ముసురుపెడుతూనే ఉంది గెరువిస్తే బావుండుగేటుదాటాలనిపెద్దోడి చూపంతాతుంపర తుంపరచినుకులపైనే ఉంది వర్షాతిరేకాన్నిఆస్వాదిస్తున్న నా పెన్నుకెళ్లిప్రేమగా చూసిన మా ఆవిడవానకి తడపడమే కాదుకలపడం కూడా తెలుసంటూకిచెన్ లోనికెళ్లి పకోడీ తెచ్చిచలికి వెచ్చదనాన్ని కప్పింది మేఘం మిగిల్చి వెళ్లినసగం వానకి వందనం చేస్తూమల్లెప్పుడొస్తావనిఆకాశం వైపు చూస్తేకొంటెగా కన్నుగీటి తుర్రుమందిచిలిపి వానతెరిపిచ్చానుగా అంటూ…
‘మరణం’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
శ్రీమతి బి.రేణుక సమర్పణలో ఓషియన్ ఫిలిం ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సాగర్ శైలేష్, శ్రీ రాపాక ప్రధాన పాత్రలో సాగర్ శైలేష్ దర్శకత్వం లో విడుదలకు సిద్ధంగా ఉన్న హారర్ చిత్రం “మరణం”. కర్మ పేస్ (Karma Pays) ఉప శీర్షిక. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు చిత్రాన్ని వీక్షించి ఎటువంటి కటింగ్ లు లేకుండా యు / ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సందర్భంగా నటుడు దర్శకుడు సాగర్ శైలేష్ మాట్లాడుతూ “నా దర్శకత్వం లో వస్తున్నా 4 వ చిత్రం ఇది. మా చిత్రాన్ని మంచి బడ్జెట్ లో అద్భుతమైన టెక్నికల్ వ్యాల్యూస్ తో నిర్మించాము. నా టెక్నిషన్స్ చాలా కష్టపడరు మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. సినిమా అద్భుతంగా వచ్చింది. హాలీవుడ్ లో కన్జ్యూరింగ్ మరియు…
కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎస్.కె’ చిత్రం ప్రారంభం
భారతి క్రియేషన్స్, కథెరిన్ ఫిల్మ్ వర్క్స్, మౌనిక ప్రొడక్షన్స్ సంస్థలు నిర్మిస్తున్న నూతన చిత్రం ‘ఎస్కె’ గురువారం ప్రసాద్ ల్యాబ్లో ప్రారంభమైంది. చిరంజీవి కుంచల్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. సర్దార్ సుర్జీత్ సింగ్ నిర్మాత. సీనియర్ నటుడు పృథ్వీ(30 ఇయర్స్ ఇండస్ర్టీ) కుమార్తె శ్రీలు ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయం కానుంది. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి చిత్రీకరించారు. దర్శకుడు చిరంజీవి కుమార్తె క్లాప్ ఇచ్చారు. నిర్మాత సర్దార్ సుర్జీత్ సింగ్ దర్శకుడికి స్ర్కిప్ట్ అందించారు. హీరో, దర్శకుడు ‘‘చిరంజీవి కుంచల్ మాట్లాడుతూ ‘‘అన్ని కమర్షియల్ హంగుతో కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. నా మొదటి మూవీ ‘జీఎఫ్’ విడుదలకు సిద్థంగా ఉండగానే మరో సినిమా రప్రారంభం కావడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు. నిర్మాత సర్దార్ సుర్జీత్ సింగ్ మాట్లాడుతూ……
‘సెబాస్టియన్ పిసి524’ బర్త్-డే లుక్ కు అద్భుత స్పందన
త్వరలో తెలుగు, తమిళ భాషల్లో విడుదల కథానాయకుడిగా పరిచయమైన ‘రాజావారు రాణిగారు’ సినిమాతో కంటెంట్ ఉన్న కుర్రాడని కిరణ్ అబ్బవరం పేరు తెచ్చుకున్నారు. టాలెంట్ ఉన్నోళ్లకు టాలీవుడ్ ఎప్పుడూ వెల్కమ్ చెబుతుంది. అలాగే, కిరణ్ అబ్బవరానికి వెల్కమ్ చెప్పింది. ‘రాజావారు రాణిగారు’ విజయం తర్వాత అతను చేస్తున్న ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’ ఆగస్టు 6న థియేటర్లలో విడుదల కానుంది. ఆ తర్వాత కొంచెం విరామం ఇచ్చి ‘సెబాస్టియన్ పిసి524’తో తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు కిరణ్ అబ్బవరం రానున్నారు. కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘సెబాస్టియన్ పిసి524’. ప్రమోద్, రాజు నిర్మించారు. ఇందులో నమ్రతా దరేకర్, కోమలీ ప్రసాద్ హీరోయిన్లు. నైట్ బ్లైండ్నెస్ (రేచీకటి) నేపథ్యంలో సరికొత్త కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి…
Birthday look of Kiran Abbavaram’s ‘Sebastian P.C. 524’ receives a huge response.
Film to be released in Telugu and Tamil With ‘Raja Varu Rani Varu’, Kiran Abbavaram successfully drew everyone’s attention. The film proved that he is a performer that Telugu cinema would warm up to. Since then, the young actor has been offered a few interesting projects. ‘SR Kalyanamandapam’, his promising movie, will hit the screens on August 6. After a gap, Kiran will be seen in ‘Sebastian P.C. 524’, a film that will be released in both Telugu and Tamil.Written and directed by Balaji Sayyapureddy, the film is being produced…
నక్సలిజం నేపథ్యంలో ‘మాజీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
హీరోస్ ఫిల్మ్స్ బ్యానర్పై బి. వినోద్ కుమార్ స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం ‘మాజీ’. ప్రస్తుతం ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని ఈ నెలాఖరుకు సెట్స్ మీదకి వెళ్ళడానికి సిద్ధం అవుతుంది. నక్సలైట్ బ్యాక్ డ్రాప్లో యాక్షన్ అండ్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. హీరో, నిర్మాత, దర్శకుడైన వినోద్ కుమార్ బర్త్ డే(జూలై16) సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. కొత్త, పాత నటీనటులందూ ముఖ్య పాత్రల్లో నటించనున్న ఈ చిత్ర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటిస్తామని నిర్మాత తెలియజేశారు. ఈ చిత్రానికి నిర్మాత మరియు దర్శకుడు: బి. వినోద్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. అనిల్ కుమార్, పిఆర్ఓ: బి. వీరబాబు
Still – Ram Charan From RRR
Still – Ram Charan From RRR
శర్వానంద్, శ్రీ కార్తిక్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఒకే ఒక జీవితం ప్రోమో విడుదల
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్ కెరీర్లో రూపొందుతోన్న 30వ చిత్రం ఒకే ఒక జీవితం. ఈ చిత్రం ద్వారా శ్రీ కార్తిక్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. సైన్స్ఫిక్షన్ ఎలిమెంట్స్తో ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్లుక్ పోస్టర్కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు ఈ సినిమాలో శర్వానంద్ పోషించిన ఆది పాత్రకి సంభందించి ఒక స్నీక్ పీక్ ప్రోమోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ వీడియోలో పాట పాడమని కొందరు ఆదీని కోరడం అలాగే మ్యూజిక్ ఇన్స్ట్రూమెంట్స్ ని చూపిస్తూ తరువాత కొన్ని సైన్స్ ఫిక్షన్ అంశాలతో ఈ ప్రోమో ముగుస్తుంది. చివరలో శర్వానంద్ గిటార్ వాయించడం…
