ప్రముఖ నటి జయంతి(76) కన్నుమూశారు. గత కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న ఆమె సోమవారం ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. జయంతి మరణంతో దక్షిణాది చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆమె మృతి పట్ల తెలుగు, తమిళ, కన్నడ చిత్రపరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. జయంతితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. కర్ణాటకలోని బళ్లారికి చెందిన జయంతి 1963లో ‘జెనుగూడు’ అనే కన్నడ చిత్రంతో నటిగా రంగప్రవేశం చేశారు. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో సుమారు 500కు పైగా చిత్రాల్లో ఆమె నటించారు. నందమూరి తారకరామారావు, ఎంజీ రామచంద్రన్, రజనీకాంత్, రాజ్కుమార్ వంటి అగ్రకథానాయకుల సినిమాల్లో జయంతి కీలకపాత్రలు పోషించారు. ‘కొండవీటి సింహం’, ‘బొబ్బిలి యుద్ధం’, ‘పెదరాయుడు’ వంటి చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జయంతి.
Category: FILM NEWS
రామప్పకు ప్రపంచ వారసత్వ గుర్తింపు
ఈ విజయం వెనుక ఇరువురు మహానుభావుల కృషి కాకతీయుల కాలంలో 1213వ సంవత్సరం లో రామప్ప అనే శిల్పి నైపుణ్యం తో తయారైన రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు లభించడం తెలుగు వారందరికీ గర్వ కారణం! ఇందుకు కృషి చేసిన అధికారుల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ వరకు అందరిని అభినందించాల్సిందే! పత్రికలూ, ఛానెల్స్, ప్రజలు అందరూ అదే చేస్తున్నారు, సంతోషం! అయితే, రామప్ప విశిష్టతను వెలుగులోకి తీసుకొచ్చిన ఇద్దరు మహానుభావులను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి! అవును, అందులో ఒకరు భరత కళాప్రపూర్ణ పద్మశ్రీ నటరాజ రామకృష్ణ గారు, ఇంకొకరు పద్మభూషణ్ డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు! ఇప్పుడు సంతోషించేందుకు వారిద్దరూ లేరు! వారే ఉండి ఉంటే, ఈ ఆనంద సమయం ఇంకో సందడి తో నిండి ఉండేది! ఇవాళ…
నిఖిల్ కుమార్ రైడర్ షూటింగ్ తిరిగి ప్రారంభం
మాజీ ప్రధాన మంత్రి హెచ్డీ దేవగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’, ‘ఒక లైలా కోసం’, ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం రైడర్. కాశ్మీరా పరదేశి హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని చంద్ర మనోహరన్ నిర్మిస్తున్నారు. లహరి మ్యూజిక్ సంస్థ ఈ చిత్రంతో నిర్మాణరంగంలోకి అడుగుపెట్టింది. అర్జున్ జన్య సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీషా కుడువల్లి సినిమాటోగ్రాఫర్. ఇప్పటికే విడుదలైన రైడర్ మోషన్పోస్టర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ రోజునుండి రైడర్ మూవీ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక వీడియోను విడుదలచేసింది చిత్రయూనిట్. తెలుగు, కన్నడ భాషలలో రూపొందుతున్న ఈ చిత్రంలో దత్తన్న, అచ్యుత కుమార్, రాజేష్ నటరంగ, శోభరాజ్ ముఖ్య పాత్రల్లో…
‘క్రేజీ అంకుల్స్’ టైటిల్ సాంగ్ విడుదల
యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా క్రేజీ అంకుల్స్.. ఈ సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు..ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేసింది.. ఈ కామెడీ రైడ్ ఆగస్ట్లో థియేటర్స్ లో విడుదల కానుంది. క్రేజీ అంకుల్ టైటిల్ లిరికల్ సాంగ్ని యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదలచేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ల్యాబ్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశానికి ప్రముఖ పారిశ్రామిక వేత్తలు శ్రీధర్ రావు, లక్ష్మణరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో..శ్రీముఖి మాట్లాడుతూ – ‘‘క్రేజీ అంకుల్స్’ సినిమాకు మొదట్నుంచే మంచి రెస్పాన్స్ వస్తుంది. థియేటర్స్లో చూడాల్సిన చక్కని ఫ్యామిలీఎంటర్టైనర్ మూవీ ఇది.…
నటసార్వభౌమ కైకాలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి- సురేఖ దంపతులు
మెగాస్టార్ చిరంజీవి – నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మధ్య అనుబంధం గురించి తెలిసినదే. ఆ ఇద్దరూ ఎన్నో క్లాసిక్ హిట్స్ లో కలిసి నటించారు. యముడికి మొగుడు, మెకానిక్ అల్లుడు, కొదమ సింహం, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ఖైదీనంబర్ 786, .. ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కలిసి నటించారు. చిరంజీవి కథానాయకుడిగా కైకాల నిర్మాతగా కొన్ని సినిమాలు తెరకెక్కాయి. తన కెరీర్ ఆద్యంతం మెగాస్టార్ చిరంజీవితో జర్నీ సాగించానని వారికి తానంటే ఎంతో అభిమానమని కైకాల చెబుతారు. ఇక కైకాల సత్యనారాయణ అంటే తండ్రి సమానులుగా గౌరవిస్తారు మెగాస్టార్ చిరంజీవి. ఆదివారం కైకాల పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి – సురేఖ దంపతులు ఫిల్మ్ నగర్ లోని కైకాల సత్యనారాయణ ఇంటికి వెళ్లి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కైకాలతో చాలా…
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా ప్రభు ఏకగ్రీవ ఎన్నిక
ప్రధాన కార్యదర్శి పర్వతనేని రాంబాబు కోశాధికారిగా హేమసుందర్ ఘన విజయం సభ్యుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తామని హామి గత యాబై సంవత్సరాలుగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు జూలై 25న హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో సీనియర్ జర్నలిస్ట్ ప్రభుని అధ్యక్షడుగా, మిగతా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోగా, ఒక్క కోశాధికారి పోస్ట్ కోసం హేమసుందర్, నాగభూషణం మధ్య పోటీ జరిగింది.. ఈ పోటీలో హేమసుందర్ సునాయాసంగా మంచి మెజార్టీతో ఘన విజయం సాధించారు. సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ రావు రిటర్నింగ్ అధికారిగా ఈ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్బంగా ఫిల్మ్ క్రిటిక్స్ నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన ప్రభు మాట్లాడుతూ..కరోన టైంలో సభ్యుల సంక్షేమం కోసం గత కమిటీ…
‘ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రువు ఎవరో తెలుసా…నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే ..’
టీజర్తోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్యల ఎనిమి యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కలిసి నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎనిమీ’. పది సంవత్సరాల క్రితం దర్శకులు బాలా తెరకెక్కించిన ‘వాడు–వీడు’ సినిమా తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తోన్న చిత్రమిది. ఇది హీరో విశాల్ 30వ చిత్రం కాగా, ఆర్యకు 32వ మూవీ. ‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి, మమతా మోహన్దాస్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్రాజ్ ఒక కీలక పాత్రలో నటించారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది. విశాల్, ఆర్య అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఎనిమి మూవీ టీజర్ని ఈ రోజు…
25న ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం
సమావేశం: జూలై 25, ఆదివారం, ఉదయం 10గంటలకు వేదిక: ప్రెస్క్లబ్, సోమాజిగూడ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులకు నమస్కారం…జూన్ 30న జరిగిన కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, జూలై 25వ తేదీ ఆదివారం ఉదయం 10గంటలకు జనరల్ బాడీ సమావేశం జరగనుంది. అదే రోజు ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. మెంబర్ షిప్ రెన్యువల్ కూడా ప్రతి మెంబరు తప్పనిసరిగా చేయించుకోవాలి.అజెండా: జనరల్ బాడీ సమావేశం, ఎన్నికలు, మెంబర్షిప్ రెన్యువల్ సభ్యులు 2019-2021 సంవత్సరానికిగాను రెన్యువల్ 200+200= 400 చెల్లించాలి. ఈ రెండు సంవత్సరాలు కంటే అంతకుముందు బకాయిలు ఉన్నవారు 1000 (వెయ్యిరూపాయలు) చెల్లించాలి. ఏ ఒక్కరు మిస్ కాకుండా అందరూ తప్పనిసరిగా హాజరుకావాలి. వచ్చేటప్పుడు ఒక పాస్ఫొటో తీసుకురాగలరు. అది ఐడీ కార్డ్ కోసం. మనకు ఏ అవసరం వున్నా అన్నిచోట్ల అసోసియేషన్ ఐడీ కార్డు…
ఫ్యామిలీస్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా ‘ఇష్క్’ : హీరో తేజ సజ్జ
చెల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన తేజ సజ్జా ఇటీవల జాంబీరెడ్డి సినిమాతో సూపర్హిట్ సాధించారు. ప్రస్తుతం హీరో తేజ సజ్జ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోహీరోయిన్లుగా యస్.యస్. రాజుని దర్శకుడిగా పరిచయం చేస్తూ దక్షినాదిలోని సుప్రసిద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న చిత్రం ఇష్క్. ఈ సినిమా జులై 30న విడుదలవుతున్న సందర్భంగాహీరో తేజ సజ్జా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అయిన తరువాత థియేటర్స్ లో రిలీజ్ అవుతున్నసినిమా ఇది. రెగ్యులర్ సినిమా కథలకు దూరంగా కొత్త కాన్సెప్ట్, కొత్త కంటెంట్ తో వస్తోంది. ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ వరకు నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఆడియన్స్ను ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తుంది. కెరీర్ స్టార్టింగ్ డేస్లోనే ఇలాంటి…
సత్యదేవ్ ‘తిమ్మరుసు’ సెన్సార్ పూర్తి.. జూలై 30న విడుదల
డిఫరెంట్ సినిమాలు, పాత్రలను ఎంచుకోవడమే కాదు.. ఆ పాత్రల్లో ఒదిగిపోయే నటన ఉంటే ప్రేక్షకుల హృదయాల్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకోవచ్చు అనడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ సత్యదేవ్. ‘బ్లఫ్ మాస్టర్ , ఉమామహేశ్వరాయ ఉగ్రరూపస్య’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న సత్యదేవ్ మరోసారి ‘తిమ్మరుసు’గా మెస్మరైజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ను పొందింది. జూలై 30న సినిమాను భారీ లెవల్లో విడుదల చేయడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.ఈస్ట్కోస్ట్ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్ కోనేరుతో పాటు ఎస్ ఒరిజినల్స్ బ్యానర్పై ‘మను’ వంటి డిఫరెంట్ చిత్రాన్ని అందించిన నిర్మాత సృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. రీసెంట్గా సినిమాలో హీరో సత్యదేవ్ క్యారెక్టర్ను ఎలివేట్ చేసేలా రూపొందించిన ప్రమోషనల్ సాంగ్ను…
