కొన్ని కాంబినేషన్స్ గురించి వినగానే బ్లాక్బస్టర్ విజయం ఖాయం అనిపిస్తుంది. అచ్చంగా అలాంటి కాంబినేషనే.. కమర్షియల్ మాస్ బ్లాక్బస్టర్స్ దర్శకుడు బోయపాటి శ్రీను, అగ్ర నిర్మాత స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్లది. 2016లో ఇద్దరి కలయికలో ఐకాన్స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ నిర్మించిన భారీ ప్రాజెక్ట్ ‘సరైనోడు’ చిత్రం ఎలాంటి అఖండ విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్-బో్యపాటి కలయికలో రూపొందిన ‘సరైనోడు’ మాసివ్ బ్లాక్బస్టర్ చిత్రంగా నిలిచి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. అయితే తాజాగా ఈ బ్లాక్బస్టర్ కలయికలో మరో భారీ ఎంటర్టైనర్ రాబోతుంది. భద్ర తులసి, సింహా, లెజెండ్, సరైనోడు, అఖండ వంటి కమర్షియల్ బ్లాక్బస్టర్ చిత్రాలను తన అద్బుతమైన మాస్మేకింగ్ స్కిల్స్ తో తెరకెక్కించి మాస్ చిత్రాలకు కేరాప్ అడ్రస్గా నిలిచే బోయపాటి శ్రీను,…
Category: FILM NEWS
శ్రీ చిరంజీవి గారికీ, శ్రీ వెంకయ్య నాయుడు గారికీ హృదయపూర్వక అభినందనలు
• పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారికి అభినందనలు : పవన్ కళ్యాణ్ భారత చలన చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని స్వయంకృషితో సాధించుకున్న అన్నయ్య శ్రీ చిరంజీవి గారిని ‘పద్మవిభూషణ్’ పురస్కారం వరించడం ఎనలేని సంతోషాన్ని కలిగించింది. నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను, చిత్రాన్నీ మనసుపెట్టి చేశారు. కాబట్టే ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు. అగ్రశ్రేణి కథానాయకుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య శ్రీ చిరంజీవి గారు చేస్తున్న సేవలు ఎందరికో ఆదర్శంగా నిలిచాయి. పద్మవిభూషణ్ పురస్కారానికి ఎంపికైన శుభ సందర్భంగా శ్రీ చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు గారు ‘పద్మవిభూషణ్’ పురస్కారానికి ఎంపిక కావడం ముదావహం. విద్యార్థి నాయకుడు దశ నుంచి ఉప రాష్ట్రపతి స్థాయికి…
మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం!
మెగాస్టార్ చిరంజీవిని మరో అత్యున్నత పురస్కారం వరించింది. కేంద్ర ప్రభుత్వం గణత్రంత దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాల్ని ప్రకటించింది. చిరంజీవిని పద్మ విభూషణ్ పురస్కారం వరించింది. కరోనా, లాక్డౌన్ సమయంలో సినీ కార్మికులతోపాటు సామాన్యులకు ఆయన అందించిన సేవలను గురించిన భారత ప్రభుత్వం చిరంజీవిని పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించనుంది. గురువారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పద్మ అవార్డులను ప్రకటించారు. సినీ, రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలకుగానూ 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మ భూషణ్ పుర్కస్కారం అందజేసిన విషయం తెలిసిందే. నాలుగు దశాబ్ధాల కెరీర్లో ఆయన ఈ స్థాయిలో ఉండటానికి కారణం.. కృషి, పట్టుదల, తపన అని చెబుతుంటారు చిరంజీవి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, సినిమాల మీదున్న ఆసక్తితో ఎలాంటి నేపథ్యం, ఎవరి సహకారం లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి నంబర్వన్…
అక్షయ్ కుమార్, టైగర్ శ్రఫ్, పృథ్విరాజ్ ‘బడే మియా చోటే మియా’ టీజర్ విడుదల !!!
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ తో కలిసి నటిస్తున్న సినిమా ‘బడే మియా చోటే మియా’. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇటీవలే ఫస్ట్ పోస్టర్ బయటకి వచ్చింది. అక్షయ్, టైగర్ ఇద్దరు గన్స్ పట్టుకోని యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్న పోస్టర్ తో రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ లో మియా చోటే మియా సినిమా రిలీజ్ కాబోతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన టీజర్… యాక్షన్ మోడ్ లోకి షిఫ్ట్ అయ్యి ఇంటెన్స్ యాక్షన్ బ్లాక్స్ తో ఇంప్రెస్ చేసింది. టీజర్ లో… “ప్రళయం రాబోతోంది… ఆ మహా ప్రళయం భూత, వర్తమాన, భవిషత్తు కాలలను మార్చివేస్తుంది… ఆ మహా ప్రళయం మంచి…
Soldiers Akshay Kumar and Tiger Shroff fight their villain Prithviraj in this action-packed teaser of Bade Miyan Chote Miyan!
In January, fans were in for heaps of surprises from the team of Bade Miyan Chote Miyan. Following a series of captivating posters and glimpses from the film, the makers have finally unveiled the teaser today. Directed by Ali Abbas Zafar, Bade Miyan Chote Miyan features the two action heroes, Akshay and Tiger, who will be seen together in India’s biggest action film for the first time. Armed with enthralling action sequences and a patriotic vibe, the teaser has left audiences eagerly anticipating the film. Shot across stunning locations such…
రఫీ స్వీయ దర్శకత్వంలో ‘నెరవేరిన కల’
రఫీ, కుసుమాంజలి, షఫీ, నాగినీడు, సుజాత రెడ్డి, వైభవ్, టి.ఎస్.రాజు ముఖ్య తారాగణంగా రూపొందిన చిత్రం ‘నెరవేరిన కల’. జాస్మిన్ ఆర్ట్స్ బ్యానర్ పై సయ్యద్ రఫీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులన్నీ పూర్తి చేసుకొని సెన్సార్ లో ఉంది. ఈ సందర్బంగా దర్శకుడు సయ్యద్ రఫీ చిత్ర విశేషాలను వివరిస్తూ.. ”తెలంగాణ ప్రాంతంలోని మారుమూల పల్లెల్లో మూడు తరాలనుండి ఎన్నో పోరాటాలు, బలిదానాలు చేసినా నెరవేరని కల ఇప్పుడు ఎలా నెరవేరిందో కళ్లకు కట్టినట్టు చూపే ఇతివృత్తమే ఈ చిత్ర కథాంశం. తరతరాల ఫ్యూడలిజం అంతమొందించే క్రమంలో జరిగిన పరిణామాలు ఎలాంటివి.. వాటిని ప్రజలు ఎలా ఎదుర్కొన్నారు అనే సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని..ఆలోచింపజేస్తాయి. సినిమాలో ప్రతీ ఫ్రేమ్ లో వచ్చే సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతాయి. ఓ పత్రికలో…
రష్మి ఘాటుగా రిప్లై …
టాలీవుడ్ నటి రష్మి గౌతమ్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో ద్వారా యాంకర్గా బుల్లితెరకు పరిచయమై ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ సంపాదించుకుంది. అంతకుముందు సినిమాల్లో నటించినా ఈ భామకు పెద్దగా గుర్తింపురాలేదు. ఈ షో ద్వారా వచ్చిన క్రేజ్తో బిగ్ స్క్రీన్పై అప్పుడప్పుడు మెరుస్తోంది. మరోవైపు సోషల్ విూడియాలో లేటెస్ట్ ఫొటో షూట్స్తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇదిలావుంటే రష్మి తాజాగా ఓ నెటిజన్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవంపై ఆనందం వ్యక్తం చేస్తూ రష్మి ఇటీవల ఒక పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్పై నెటిజన్ రిప్లయ్ ఇస్తూ.. కాషాయపు రంగు చీర కట్టి.. అన్నీ చెడ్డ పనులు చేస్తున్నావు. అంటూ కాస్త అసభ్య పదజాలం వాడాడు. దీంతో రష్మికి మండిపోయినట్టుంది. ఆ ట్వీట్కు రిప్లై ఇస్తూ గట్టిగా…
స్నేహితుల మధ్య నమ్రత పుట్టినోజు వేడుకలు
సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ తన పుట్టినరోజుని హైదరాబాదులో ఎంతో సంబరంగా జరుపుకున్నారు. మహేష్ బాబు జర్మనీలో ప్రత్యేక శిక్షణ కోసం వెళ్లారు, బహుశా నమ్రత పుట్టినరోజుని మహేష్ ఇలా మిస్ అవటం ఇదే మొదటి సారి ఏమో. అయితే నమ్రత తన స్నేహితులు చాలామందిని పిలిచారు, అందరూ హాజరయ్యారు. అలాగే తన కుటుంబ సభ్యులు కూడా చాలామంది హాజరయ్యారు. ఈసారి పుట్టినరోజు ఎంతో సంబరంగా, ఒక మంచి జ్ఞాపకంగా చేసుకున్నారు నమ్రత. మహేష్ బాబు సోదరీమణులు మంజుల, ప్రియదర్శిని, పద్మావతి తో పాటు రమేష్ బాబు భార్య కూడా నమ్రత పుట్టినరోజు సంబరాలకు హాజరైన వారిలో వున్నారు. ఇక తన పిల్లలు సితార, గౌతమ్ కూడా నమ్రత దగ్గరే వున్నారు. చాలామంది సెలెబ్రెటీలు హాజరయ్యారు. నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి…
ఈ సంవత్సరం పలు సినిమాలపై ఆసక్తి!
రానున్న నెలల్లో తెలుగు ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూసే సినిమాలు చాలానే వున్నాయి. రామ్ పోతినేని, పూరి జగన్ కాంబినేషన్ లో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’, ఎన్టీఆర్, కొరటాల శివ చేతులు కలిపిన ‘దేవర’ పార్టు వన్, అల్లు అర్జున్ తో దర్శకుడు సుకుమార్ చేస్తున్న ‘పుష్ప 2’ ఇంకా ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడి’. ఇందులో కొంచెం బడ్జెట్ ఎక్కువ వున్న సినిమాలు వున్నాయి, సీక్వెల్స్ వున్నాయి. పైన చెప్పిన సినిమాలు అన్నీ విడుదల తేదీలు అధికారికంగా ప్రకటించారు, ఇంకా రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ‘గేమ్ చెంజర్’ విడుదల తేదీ ప్రకటించలేదు కానీ.. ఆ సినిమా కూడా ఈ సంవత్సరమే విడుదలవుతుంది. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలన్నీ విడుదల తేదీలు ప్రకటించినా ఈ సినిమాలన్నీ వాయిదా…
వైవిధ్యంగా ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’
చిన్న చిన్న పాత్రలతో కమెడియన్ గా మొదలెట్టి ఇప్పుడు కథానాయకుడిగా కూడా సినిమాలు చేస్తున్న సుహాస్ ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ అనే నూతన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దీనికి నూతన దర్శకుడు దుష్యంత్ కటికనేని దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది, ఇందులో కామెడీ, చిన్న కైమ్ర్, వూర్లో వుండే చిన్న చిన్న గొడవలు కలగలిపి ఒక కథగా మలిచినట్టుగా తెలుస్తోంది. సెలూన్ షాపు నడిపే సుహాస్ ఆ వూర్లో ఏమి జరిగినా అన్నిటిని తనవిూదే వేసుకొని ఎలా చిక్కుల్లో పడ్డాడు, వాటినుంచి ఎలా బయటపడ్డాడు అనే ఇతివృత్తంగా ఈ ట్రైలర్ చూస్తుంటే కనపడుతోంది. ఇంతకు ముందు సుహాస్’కలర్ ఫోటో’ అనే చిత్రంలో కథానాయకుడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమాకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఆ తరువాత ‘రైటర్…
