సంతోష్ శోభన్ హీరోగా ‘ప్రేమ్ కుమార్’

సంతోష్ శోభన్ హీరోగా సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి. శివప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్న చిత్రానికి ‘ప్రేమ్ కుమార్’ టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంతో అభిషేక్ మహర్షి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో రాశీ సింగ్ హీరోయిన్. కృష్ణచైతన్య, రుచిత సాధినేని, కృష్ణతేజ, సుదర్శన్, అశోక్ కుమార్, ప్రభావతి, మధు ఇతర తారాగణం. ఆల్రెడీ 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. లాక్‌డౌన్ తర్వాత మిగతా భాగం పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈరోజు చిత్రాన్ని ప్రకటించడంతో పాటు టైటిల్ వెల్లడించారు.  దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ “సాధారణంగా తెలుగు సినిమా పతాక సన్నివేశాల్లో హీరో వచ్చి స్పీచ్‌లు ఇచ్చి హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటాడు. కానీ, అదే పెళ్లి పీటలు మీద ఉన్న పెళ్లికొడుకును మాత్రం ఎవరూ పట్టించుకోరు. అటువంటి ఓ పెళ్లికొడుకు తనకు పెళ్లి అవ్వడం లేదనే ఫ్రస్ట్రేషన్‌లో…

రక్షిత్శెట్టి పాన్ ఇండియా మూవీ ‘777 చార్లి’ టీజర్ విడుద‌ల చేసిన నేచుర‌ల్ స్టార్ నాని

అతడే శ్రీమన్నారాయణ చిత్రంతో పాన్ ఇండియా ప్రేక్ష‌కుల హృద‌యాల్లో స్థానాన్ని సంపాదించుకున్న క‌థానాయ‌కుడు ర‌క్షిత్ శెట్టి మ‌రో విభిన్న‌మైన క‌థా చిత్రం ‘777 చార్లి’తో ఆడియెన్స్‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. క‌న్న‌డ‌, తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రం విడుద‌ల‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇందులో ఓ కుక్క టైటిల్ పాత్ర‌లో న‌టించ‌డం విశేషం. ర‌క్షిత్ శెట్టి ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టిస్తూ జి.ఎస్‌.గుప్తాతో క‌లిసి ఈ సినిమాను నిర్మించారు. కిర‌ణ్ రాజ్‌.కె ద‌ర్శ‌కుడు. ఆదివారం(జూన్‌6) నాడు ర‌క్షిత్ శెట్టి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ సినిమా తెలుగు టీజ‌ర్‌ను ఆదివారం నేచుర‌ల్ స్టార్ త‌న వాల్‌పోస్ట‌ర్ సినిమా యూ ట్యూబ్ ఛాన‌ల్‌లో విడుద‌ల చేసి యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు.టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే.. ‘ఏంటో ఏమో ఎవ‌రెవ‌రో నిండిన దారుల్లో…’ అంటూ సాగే ఈ…

భానుశ్రీ ప్రధాన పాత్రలో ‘సర్వే నెం.3’ చిత్రం ప్రారంభం

వాయిజా సినీ క్రియేషన్స్ పతాకంపై బిగ్‌బాస్ ఫేమ్ భానుశ్రీ ప్రధాన పాత్రలో.. డి. రామకృష్ణ (ఆర్.కె) దర్శకత్వంలో మేకా హేమసుందర్(మేకా ప్రసాద్) నిర్మిస్తోన్న చిత్రం ‘సర్వే నెం.3’. ఓ ప్రముఖ హీరో గెస్ట్ పాత్రలో నటించనున్న ఈ చిత్రం శనివారం (జూన్ 5) పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘బిల్లా’ మూవీ నిర్మాత డి. నరేందర్, నిర్మాత బెల్లంకొండ సురేష్ హాజరై చిత్రయూనిట్‌ను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా దర్శకుడు ఆర్.కె. మాట్లాడుతూ.. ‘‘నిర్మాత హేమసుందర్‌గారికి కూడా ఈ కథ ఎంతగానో నచ్చింది. ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు ఆయన ఎంతగానో సపోర్ట్ అందిస్తున్నారు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము. మా చిత్ర పూజా కార్యక్రమాలకు వచ్చి.. మమ్మల్ని ఆశీర్వదించిన పెద్దలందరికీ ధన్యవాదాలు..’’ అని తెలిపారు.నిర్మాత మేకా హేమసుందర్ మాట్లాడుతూ.. ‘‘ముందుగా…

సుద్దాల హనుమంతు

సుద్దాల హనుమంతు(06.06.1910 – 10.10.1982)జన్మ స్థలం:- నేటి యాదాద్రి-భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలోని పాలడుగులోతల్లిదండ్రులు:- బుచ్చిరాములు, లక్ష్మీనరసమ్మ“పల్లెటూరి పిల్లగాడాపసులుగాసే మొనగాడాపాలు మరిచి యెన్నాళ్ళయ్యిందో ఓ పాలబుగ్గల జీతగాడా కొలువు కుదిరి ఎన్నాళ్ళయ్యిందో”తెలంగాణలో ఈపాట పాడని పల్లె లేదు. పట్నం లేదు. జనుల నాలుకల మీదికెక్కిన ఈ అర్ద్ర మానవతాగీతం రాసింది తెలంగాణా సాయుధపోరాటంలో పెన్నూ, గన్నూ ధరించి పోరాడిన ప్రజాగెరిల్లాకవి సుద్దాల హనుమంతు. సాయుద పోరాటకాలంలో ప్రజల్ని యోధులుగా మార్చిన పాటలెన్నో ఆయన రాసారు. ఆమరణాంతం నమ్మిన సిద్ధాంతాలను ఆచరించినవాడు, ఆచరణకు అడ్డుపడ్డ అన్నింటినీ తృణప్రాయంగా త్యాగం చేసిన ధన్యజీవి.సుద్దాల హనుమంతు నేటి యాదాద్రి-భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలోని పాలడుగులో పుట్టాడు. నిజానికి వీరి తాతలవూరు ఇడుకుడ. హనుమంతు తాత పేరు కృష్ణహరి, నాయనమ్మ వెంకటరావమ్మ. తాతగారు హరికథ కళాకారుడు. హనుమంతు తండ్రి బుచ్చిరాములు, తల్లి…

‘ విక్రమ్’లోని పాటను విడుదల చేసిన శేఖర్ మాస్టర్

‘విక్రమ్’ చిత్రంలోని “పడిపోయా పడిపోయా….” అంటూ సాగే రెండవ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ విడుదల చేశారు.నాగవర్మ బైర్రాజును హీరోగా పరిచయం చేస్తూ, హరిచందన్ దర్శకత్వంలో ఏ బ్రాండ్ ఇండియా మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. హీరో నాగవర్మ బైర్రాజు సరసన దివ్యాసురేశ్ కథానాయికగా నటించింది. కాగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో శనివారం ఈ చిత్ర హీరో, నిర్మాత నాగవర్మ బైర్రాజు పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను హైదరాబాద్ లో విడుదల చేశారు. అనంతరం ముఖ్య అతిథి శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ, “ఒకప్పుడు ప్రముఖ హీరో నాగార్జున గారు “విక్రమ్” అనే పేరు గల చిత్రంతో పరిచయమయ్యారు. అదే టైటిల్ తో వస్తున్న హీరో నాగవర్మకు కూడా ఈ తొలి చిత్రం మంచి విజయాన్ని అందించి… అతను హీరోగా…

జర్నలిస్ట్ రఘు పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తి వేయాలి -కీసర చౌరస్తాలో జర్నలిస్టుల నిరసన

జర్నలిస్టుల పై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలని జర్నలిస్ట్ రఘును బేషరతుగా విడుదల చేయాలని టీయూడబ్ల్యూజే ఐజేయు మేడ్చల్ జిల్లా కీసర మండలం విలేకరులు డిమాండ్ చేశారు. శుక్రవారం కీసర అంబేద్కర్ చౌరస్తాలో విలేకరులు రఘు అరెస్టుకు నిరసనగా ధర్నా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కు ను టిఆర్ఎస్ ప్రభుత్వం హరిస్తుందని నిజాలు నిర్భయంగా రాస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. పోలీసు యంత్రాంగం కక్షసాధింపు లో భాగంగా రఘు నివాసం నుండి మఫ్టీలో కిడ్నాప్ చేసి కోర్టుకు తరలించడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. జర్నలిస్టు రఘును భేషరతుగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున టీయూడబ్ల్యూజే ఐజేయూ ఆధ్వర్యంలో లో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా గా…

రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్.. మరో సోనూసూద్

తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, మెయిన్ విలన్‌గా అనేక భూమికలు పోషించిన రియల్ స్టార్ అఫ్సర్ ఆజాద్.. ఈ కరోనా కష్టకాలంలో తన ‘ఆజాద్ ఫౌండేషన్’ ద్వారా ఎందరికో సహాయాన్ని అందిస్తూ.. రియల్ హీరో అనిపించుకుంటున్నారు. కరోనా కష్టకాలం మొదలైనప్పటి నుంచి తన ఫౌండేషన్ ద్వారా.. తనకు చేతనైనంతగా సహాయం అందిస్తూనే ఉన్నారు. ట్యాబ్‌లెట్స్, ఇంజక్షన్స్, ఫుడ్, నిత్యావసర సరుకులు.. ఇలా ఎవరికి ఏ అవసరం ఉంటే.. ఆ అవసరం తీర్చుతూ.. దాదాపు 1400 కుటుంబాలను ఆయన ఈ కష్టకాలంలో ఆదుకున్నారు. అలాగే వందల మందికి కరోనా ఆయుర్వేద మందును అందజేశారు. ఆయన సాయం అందుకున్న వారంతా.. ఆయనని ‘మరో సోనూసూద్’ అంటూ పిలుస్తుండటం విశేషం. జూన్ 5 అఫ్సర్ ఆజాద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు ఇలాంటి శక్తి మరింతగా లభించాలని కోరుతూ.. ఆయన నుంచి సాయం…

మా ‘తీరం’ చిత్రంలోని పాటలు ఎస్.పి. బాలుకి అంకితం

గాన గంధర్వుడు స్వర్గీయ శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా.. “తీరం” చిత్రంలోని పాటలన్ని ఆయనకు అంకితం చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.. తీరం చిత్రంలోని ఆయన పాడిన చివరి పాట “అసలేంటీ ప్రేమా” పాటతోబాటు, చిత్రంలోని మిగిలిన 8 పాటలను కూడా ఎస్.పి. బాలూ గారికి అంకితం చేశారు. ఆయన సృతికి అంకితం చేసిన ఈ పాటలను ఏ ఆడియో కంపెనీకీ అమ్మకుండా, శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులకోసం పూర్తి ఉచితంగా “ఫ్రీ టు ఎయిర్” గా విడుదల చేశారు. ఈ సందర్బంగా జూన్ 4న హైదరాబాద్ జూబ్లీహిల్స్ సినెటేరియా కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో “తీరం” సినిమా హీరో శ్రావణ్ వైజిటి, మరో హీరో మరియు దర్శకులు అనిల్ ఇనమడుగు, హీరోయిన్ క్రిష్టెన్ రవళి, సినెటేరియా అధినేత వెంకట్ బులెమోని, సినెటేరియా…