సరస్వతి పుత్రుడు ‘కందికొండ’ని కాపాడుకుందాం..

ప్రముఖ సినీ గేయ రచయిత, శాలివాహన ముద్దు బిడ్డ, సరస్వతి పుత్రుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి, కష్టపడి చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీలో పీ.హచ్. డి పూర్తి చేసుకొని మన తెలంగాణా సంస్కృతి, సాంప్రదాయాలను, పండుగల విశష్టతలను, విశేషాలను తెలియజేసే ఎన్నో పాటలని రాసిన “కందికొండ గిరి ” ప్రస్తుతం త్రోట్ క్యాన్సర్ వ్యాధితో భాధపడుతూ గత కొన్ని రోజులుగా హస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.జీ.హెచ్. ఎం.సి, తెలంగాణ బోనాల పాట, సమ్మక్క సారక్కల పాట, కాళేశ్వరం పాట, దీపావళి పాట,సంక్రాంతి పాట మరియు ఎన్నో హిట్ సినిమాలైన దేశముదురు,పోకిరి,మున్నా,ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి మరెన్నో చిత్రాలలో దాదాపు 1200 పాటలు రాసాడు.గత 15 రోజుల నుండి అపోలో హస్పిటల్ లో చికిత్స నిమిత్తం అత్యధికంగా…

కోవిడ్ వాక్సిన్ వేసుకున్నా కూడా, కరోనా ఎందుకు వస్తుంది ?

కోవిడ్ వాక్సిన్ వేసుకున్నా కూడా, కరోనా ఎందుకు వస్తుంది ? వాక్సిన్ వేసుకున్నా కూడా కోవిడ్ వల్ల మనుషులు ఎందుకు మరణిస్తున్నారు ? ఇది వాక్సిన్ వైఫల్యమా మానవ తప్పిదమా ? అసలు వాక్సిన్ ఏమిటి, అది ఏమి చేస్తుంది. కోవిడ్ వాక్సిన్ లో కరోనా అవశేషాలు ఉంటాయి. కవిడ్ యొక్క జినోమ్ స్ట్రక్చర్ ఉంటుంది. అ స్ట్రక్చర్ ద్వారా మన శరీరంలోని ఇమ్మ్యూనిటి అంటే తెల్ల రక్తకణాలకి కరోనా వైరస్ నించి రక్షించే వలయం ఏర్పాటుచేయ్యడం నేర్పిస్తుంది. తద్వారా మన శరీరంలో ఇమ్మ్యూన్ సిస్టం అంటే రక్షణ వలయం ఏర్పారుచుకుంటుంది. అంటే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ఇక్కడ వాక్సిన్ మందు కాదు. కరోనాని ఆపేది వాక్సిన్ కాదు. రక్షణ వలయం ఏర్పాటు చేసేదీ వాక్సిన్ కాదు. అదీ కేవలం ఫార్ములా చూపిస్తుంది అంతే, మొత్తం…

సీనియర్ సభ్యులు బి.ఏ రాజు కుటుంబానికి ఎఫ్‌సిఏ సహకారం

గత కొన్ని సంవత్సరాలుగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (ఎఫ్.సి.ఎ) సభ్యులు ఎవరైనా మరణిస్తే, వారి కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 25 వేలను అసోసియేషన్ అందిస్తోంది. అందులో భాగంగా, ఇటీవల అనారోగ్యంగా కన్నుమూసిన ఎఫ్.సి.ఎ. సీనియర్ సభ్యులు, స్వర్గీయ బి.ఏ రాజు కుటుంబాన్ని కలిసి, పరామర్శించి రూ. 25 వేల చెక్కుని అందచేసింది. ‘రాజు గారి మరణం జర్నలిస్టు కుటుంబానికే కాకుండా సినీ పరిశ్రమకు, పి ఆర్ ఓ కుటుంబాలకీ తీరని లోటు’ అని ఎఫ్.సి.ఎ. అధ్యక్షులు శ్రీ సురేశ్ కొండేటి అన్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని ప్రధాన కార్యదర్శి ఇ. జనార్దన్ రెడ్డి తెలియచేశారు. రాజు లేని లోటు వారి కుటుంబానికి తీర్చలేనిది. వారికి అవసరమైన సాయం చేయడానికి ఎఫ్.ఎ.సి. ముందు ఉంటుందని జాయింట్ సెక్రెటరీ పర్వతనేని రాంబాబు చెప్పారు. స్వర్గీయ రాజు కుమారులు అరుణ్…

జర్నలిస్టు రఘు అక్రమ అరెస్టుపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసిన జర్నలిస్టు సంఘాలు

పోలీసులపై చర్యలు తీసుకోవాలి. రఘును వెంటనే విడుదల చేసి కేసులు ఎత్తివేయాలని డిమాండ్జర్నలిస్టు రఘును అక్రమంగా, దౌర్జన్యంగా కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిన పోలీసులపై పలు జర్నలిస్టు సంఘాలు మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశాయి. రఘుపై అక్రమ కేసులు బనాయించి తీవ్రవాదిలా అరెస్టు చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్), టీ జర్నలిస్టుల ఫోరం నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, టీ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షులు పల్లె రవికుమార్, సీనియర్ పాత్రికేయులు పాశం యాదగిరి తదితరులతో కూడిన ప్రతినిధి బృందం హెచ్చార్సీ కార్యదర్శి విద్యాదర్ భట్ కు ఫిర్యాదు పత్రం అందజేశారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్న జర్నలిస్టు రఘుపై అక్రమ కేసులు బనాయించి, అరెస్టు చేయడం, అందులో…

బాల్క సుమన్ తండ్రి స్వర్గీయ బాల్క సురేష్ చిత్ర పటానికి సీఎం కేసీఆర్ నివాళులు

జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం రేగుంట గ్రామంలోని చేన్నూరు శాసన సభ్యులు, విప్ శ్రీ బాల్కసుమన్ గారి ఇంటికి హైదరాబాద్ నుండి రోడ్డు మార్గంద్వారా చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకంట్ల చంద్రశేఖర్ రావు. ఇటీవల స్వర్గస్తులైన బాల్క సుమన్ గారి తండ్రి స్వర్గీయ బాల్క సురేష్ గారి చిత్ర పటానికి పూలుచల్లి నివాలులు అర్పించి, ఆయన కుటుంబసభ్యులను పరామర్షించిన రాష్ట్ర ముఖ్యమంత్రి. అనంతరం జిల్లాలో కరోనా పరీస్థితులను గురించి జిల్లా కలెక్టర్ జి. రవి గారిని అడుగగా, జిల్లాలో లాక్ డౌన్ వలన కేసులు చాలా తగ్గుముఖం పట్టాయని, లాక్ డౌన్ పటిష్టంగా అమలు చెస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్యక్రమ ఏర్పాట్లను కమీషనర్ ఆఫ్ పోలీస్ వి. కమలాసన్ రెడ్డి, ఐజి వై. నాగిరెడ్డి, జగిత్యాల కలెక్టర్ జి. రవి, ఎస్పి శ్రీమతి సిందుశర్మ,…

వైఎస్ షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీకి హైదరాబాద్ జిల్లా సన్నాహక కమిటీ సభ్యునిగా మిడతనపల్లి విజయ్

బుధవారం లోటస్ పాండ్ లో వైఎస్ షర్మిల ఆధ్యర్యంలో జరిగిన రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశంలో సూర్యాపేట జిల్లా మోతె మండలానికి చెందిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ అధ్యక్షులు మిడతనపల్లి విజయ్, త్వరలో షర్మిల ఆధ్యర్యంలో ఏర్పాటు చేయబోయే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హైదరబాద్ జిల్లా సన్నాహక కమిటీ సభ్యునిగా వైఎస్ షర్మిల నియమించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ నన్ను హైదరాబాద్ జిల్లా సన్నాహక కమిటీ సభ్యునిగా నియమించిన షర్మిలమ్మ కు కృతజ్ఞతలు తెలిపారు. జూలై 8న మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి రోజున పార్టీ ఆవిర్భావించాల‌ని షర్మిలమ్మ నిర్ణయించార అని, అన్ని వ‌ర్గాల‌ బాగు కోసం స్థాపించ‌బోయే పార్టీకి సంబంధించి జెండా, అజెండా రూప‌క‌ల్ప‌న‌లో భాగంగా రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రి నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించాల‌ని భావించాము అని ఇందుకోసం రాష్ట్రంలోని పేద‌లు, యువ‌త‌,…

అందుకే.. ఈ బ్యూటీకి డేటింగ్‌పై నమ్మకం లేదట!

kiyara

కొత్తతరం అమ్మాయినైనా ప్రేమ విషయంలో ఆధునిక భావాల్ని వంటపట్టించుకోనని.. ప్రేమ, పెళ్లి విషయాల్లో తన ఆలోచనా విధానం పూర్తి సంప్రదాయికంగా ఉంటుందని చెప్పింది కియారా అద్వాణీ. ఆమె కథానాయికగా చేసిన హిందీ తాజా చిత్రం ‘ఇందూ కి జవానీ’. డేటింగ్‌ యాప్స్‌ నేపథ్యంలో నేటితరం యువతీయువకుల ఆలోచనారీతుల్ని చూపిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సందర్భంగా కియారా అద్వాణీ మాట్లాడుతూ .. తనకు డేటింగ్‌పై అస్సలు నమ్మకం లేదని చెప్పింది. డేటింగ్‌ యాప్స్‌ సంస్కృతిని నేను ఇష్టపడను. పాతకాలంలో మాదిరిగా స్వచ్ఛమైన, నిజాయితీతో కూడిన ప్రేమపట్ల నాకు విశ్వాసం ఉంది. ప్రేమ విషయంలో నేను పాత ఆచారాల్ని నమ్ముతాను. మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లాడి జీవితాంతం అతనితో కలిసి ఉండాలనుకుంటా’ అని చెప్పుకొచ్చింది కియారా అద్వాణీ. బాలీవుడ్‌తోపాటు ఇటు దక్షిణాదిన కూడా గుర్తింపు దక్కించుకున్న కథానాయిక కియారా…

ఏమాత్రం తీరిక దొరికినా దాన్నే ఆశ్రయిస్తా!

ShrutiHaasan

కథానాయిక శృతిహాసన్‌ సంగీతాభిరుచి గురించి అందరికి తెలిసిందే. స్వర రచనతో పాటు సొంత గళాన్ని వినిపిస్తూ.. ఈ సుందరి కొన్ని ప్రైవేట్‌ ఆల్బమ్స్‌ రూపొందించి సత్తాచాటుకుంది. నటన, సంగీతం, గానంలో ప్రతిభను చాటుతూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఈ భామ పేరు తెచ్చుకుంది. సంగీతం మన మానసిక శక్తుల్ని పునరుత్తేజం చేసే ఓ దివ్యౌషదమని శృతిహాసన్‌ చెప్పింది… ‘ఏమాత్రం తీరిక దొరికినా సంగీతాన్ని ఆశ్రయిస్తా. మనసులోని ఆందోళనలన్నింటిని మటుమాయం చేసే శక్తి సంగీతానికి ఉంది. ఒకానొక సమయంలో నేను తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యాను. మనసంతా ఒత్తిళ్లతో నిండిపోయి ఉండేది. ఏం చేయాలో తోచేది కాదు. అప్పుడు సంగీతం నాకు ఓదార్పునిచ్చింది. నేను సాధారణ స్థితికి చేరుకోవడానికి దోహదపడింది. భవిష్యత్తులో కూడా నా సంగీత ప్రయాణాన్ని కొనసాగిస్తా’ అని చెప్పుకొచ్చింది.

అలా చేయడం తమన్నాకు మాత్రమే సాధ్యమయింది!

thamanna-actress

టాలీవుడ్ లో 15 ఏళ్ల అనుభవం తర్వాత కూడా ఇన్ని అవకాశాలు అందుకోవడం తమన్నాకు మాత్రమే సాధ్యమవుతుంది. తమన్నాతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన అనుష్క, త్రిష లాంటి వారు ఇప్పటికే బ్యాగ్ సర్దేసి అప్పుడప్పుడు తెరపై కనిపిస్తున్నారు. కానీ తమన్నా మాత్రం దీనికి పూర్తిగా భిన్నం. అందర్నీ ఆశ్చర్య పరుస్తూ ఇప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటోంది ఈ మిల్కీ బ్యూటీ. తాజాగా సత్యదేవ్ లాంటి యంగ్ హీరోతో ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలో నటిస్తుంది. ఇమేజ్ లో తన కంటే ఎన్నో రెట్లు తక్కువగా ఉన్న సత్యదేవ్ లాంటి అప్ కమింగ్ హీరోతో నటించడానికి ఎలాంటి ఈగో చూపించడం లేదు . అంతేకాదు వెబ్ సిరీస్ లతో కూడా బిజీ అయిపోయింది తమన్నా. ఇప్పటికే ‘లెవెన్త్‌ అవర్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది తమన్నా. త్వరలోనే ఈ…

రాశీఖన్నా ఫిట్‌నెస్ విషయాలు ఇవే..!

శరీరం, మనసు రెండింటి మధ్య సమన్వయం కుదిరితేనే ఆనందమయ జీవనం సాధ్యమని..యాభైఏళ్ల వయసొచ్చినా వ్యాయామాన్ని వదిలిపెట్టనని క్రేజీ బ్యూటీ రాశీఖన్నా చెబుతోంది. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటం కోసమే తాను క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తానని చెప్పింది . స్వతహాగా ఫిట్‌నెస్‌ ప్రేమికురాలైన రాశీఖన్నా సోషల్‌మీడియాలో తరచు ఫిట్‌నెస్‌ వీడియోల్ని షేర్‌ చేస్తుంది. “ప్రతి పనిలో ఉత్తమమైన ప్రతిభ కనబరచాలన్నదే నా లక్ష్యం. అది సాధ్యం కావాలంటే శారీరకంగా కూడా శక్తివంతంగా ఉండాలి. ఎవరి మెప్పుకోలు కోసమో వ్యాయాయం చేయాలనుకోను. ఫిట్‌గా ఉంటేనే రోజువారి వ్యవహారాలు కూడా సౌకర్యవంతంగా అనిపిస్తాయి. కెమెరా ముందు కూడా అందంగా, ఆహ్లాదభరితంగా కనిపిస్తాం. మహిళలు ఎక్కువగా బరువులు ఎత్తకూడదనే అపోహ ఉంది. ఓ మోస్తరు బరువులు ఎత్తడం వల్ల శరీరంలోని కొవ్వు తగ్గడంతో పాటు ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. శరీరఛాయ…