చాలా వేగంగా ఇటీవలి కాలంలో వెబ్ సీరీస్ నిర్మాణం బాగా ఊపందుకున్న సంగతి తెలిసిందే. పలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లు పుట్టుకురావడం.. కంటెంట్ కోసం పోటాపోటీగా విభిన్న కథాంశాలతో వెబ్ సీరీస్ నిర్మించడం చూస్తున్నాం. బిజీ తారలు సైతం వీటికి సై అంటున్నారు. అదే కోవలో ఇటీవల కథానాయికగా మళ్లీ బిజీ అయిన అందాలతార శ్రుతిహాసన్ కూడా చేరింది. తాజాగా ఓ వెబ్ సీరీస్ లో నటించడానికి ఆమె గ్రీన్స్ సిగ్నల్ ఇచ్చింది. ఐదేళ్ల క్రితం రవి సుబ్రహ్మణ్యం రాసిన పాప్యులర్ నవల ‘ద బెస్ట్ సెల్లర్ షి రోట్’ ఆధారంగా ఈ వెబ్ సీరీస్ ను నిర్మిస్తున్నారు. నవలా రచయితగా సూపర్ స్టార్ అయిన ఓ రచయితకు.. అతని యువ ప్రేయసికి మధ్య జరిగే ప్రేమకథగా ఇది రూపొందుతుంది. ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు…
Author: M.D ABDUL - Tollywoodtimes
పవర్ స్టార్ స్పీడు మాములుగా లేదుగా! ?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్… తన రాజకీయ పార్టీ జనసేన కార్యక్రమాలలో ఓవైపు బిజీగా ఉంటూనే.. మరోపక్క సినిమాలలో కూడా స్పీడు పెంచుతున్నారు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని పూర్తిచేసిన ఆయన.. తాజాగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగులో కూడా ఆయన పాల్గొంటున్నారు. అలాగే, మరోపక్క మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కావచ్చాయి. దీనికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంకోపక్క ‘గబ్బర్ సింగ్’ ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందే చిత్రానికి సంబంధించిన పనులు కూడా చకచకా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో సినిమా విషయంలో కూడా పవన్ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ త్వరలో పవన్ తో ఒక చిత్రాన్ని చేయడానికి…
‘గని’గా వరుణ్తేజ్ వస్తున్నాడు
మెగాప్రిన్సు వరుణ్ తేజ్ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్సు ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ ‘గని’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వరుణ్తేజ్ ఇప్పటి వరకు చేయనటువంటి డిఫరెంట్ లుక్తో బాక్సర్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని జూలై 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషనల్ ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి జార్జ్ సి.విలియమ్స్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
‘ఐ లైక్ టు కిస్.. విజయ్ దేవరకొండ’ !?
తమన్నాను అందరూ మిల్కీ బ్యూటీ అని ముద్దుగా పిలుచుకుంటారు. తన సినీ కెరీర్లో ఇప్పటి వరకు లిప్లాక్ చేయలేదట. వాహ్.. గ్రేట్ కదా! గ్లామర్ షో విషయంలో కూడా వెనుకాడని ఈ బ్యూటీ ఇప్పటి వరకు ఏ హీరోకి లిప్లాక్ మాత్రం ఇవ్వలేదు. ఇక తాజాగా తెలుగు ఓటీటీ ఆహాలో సమంత హోస్ట్ చేస్తున్న ‘సామ్ జామ్’ షోలో పాల్గొన్న తమన్నాకు లిప్లాక్ ప్రశ్న ఎదురైంది. ఇందులో ‘నో కిస్సింగ్ ఆన్ స్క్రీన్ రూల్ బ్రేక్ చేస్తే.. ఎవరితో కిస్ చేయడానికి ఇష్టపడతావు..?’ అని తమన్నాని సమంత ప్రశ్నించింది. దీనికి తమన్నా ‘ఐ లైక్ టు కిస్.. విజయ్ దేవరకొండ’.. అని చెప్పడంతో ఒకటే ఈలలు, చప్పట్లు. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్.. ఎవరు చూసినా విజయ్ దేవరకొండ పేరే చెబుతున్నారంటే.. రౌడీ హీరో రేంజ్ ఏంటో…
అమ్మో.. రష్మిక!
సెన్సేషనల్ హీరోయిన్గా దూసుకుపోతున్న రష్మిక మందన్న బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. సౌత్లో వరుసగా సూపర్ స్టార్స్తో సినిమాలు సైన్ చేసిన రష్మిక తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో సరసన హీరోయిన్ చాన్స్ కొట్టేసింది. సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా ఇండియాస్ గ్రేటెస్ట్ కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా తెరకెక్కుతున్న ‘మిషన్ మజ్ను’ అనే మూవీలో రష్మిక లీడ్ రోల్ పోషిస్తోంది. 1970వ దశకంలో జరిగిన కోవర్ట్ ఆపరేషన్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రా ఏజెంట్గా సిద్ధార్థ్ నటిస్తున్నాడు. అతని సరసన కథానాయికగా రష్మిక కనిపించనుంది. యాడ్ ఫిల్మ్ మేకర్ శాంతను బాగ్చి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ నిర్మాత రోనీ స్క్రూవాలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ మూవీలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందంటూ రష్మిక ట్వీట్ చేశారు. బాలీవుడ్ ఎంట్రీపై రష్మిక మాట్లాడుతూ..…
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్కు గుడ్ బై చెప్పేసినట్టే!
టాలీవుడ్పై ఫోకస్ తగ్గించిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్లో పాగా వేశారు. హిట్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా బీటౌన్లో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటున్నారు. ఇప్పటికే హిందీలో ‘యారియాన్’, ‘అయ్యారే’, ‘దేదే ప్యార్ దే’ వంటి మూడు సినిమాల్లో నటించినప్పటికీ ఏదీ కూడా రకుల్కు బ్లాక్ బస్టర్ హిట్ను అందించలేకపోయాయి. అయినప్పటికీ మరో రెండు బాలీవుడ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో ‘మే డే’లో రకుల్ హీరోయిన్గా నటించారు. అమితాబ్ బచ్చన్ ఇందులో కీలకపాత్ర పోషించారు. అదే విధంగా అజయ్ దేవగన్ ‘థాంక్ గాడ్’ లోనూ ఈ మద్దుగుమ్మ నటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ యువ నటుడు ఆయుష్మాన్ ఖురానాతో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ జోడి కట్టనున్నారు. వీరిద్దరి కలయికలో రూపొందుతున్న చిత్రం ‘డాక్టర్ జీ’. కామెడీ డ్రామాగా తెరకెక్కుతున్న…
సీసీసీ ఆధ్వర్యంలో 4000 మందికి కిపైగా వాక్సిన్ తీసుకున్నారు
డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ శంకర్ కరోనా క్రైసిస్ ఛారిటిని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన సినీ కార్మికులకు వాక్సిన్ ఇస్తున్నారు. గత వారం రోజులుగా ఈ వాక్సిన్ డ్రైవ్ సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. ఈ సందర్భంగా డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ శంకర్ మాట్లాడుతూ..కరోనా క్రైసిస్ చారిటి ఆధ్వర్యంలో సినిమా వర్కర్స్ 24 క్రాఫ్ట్స్ వారికీ ఉచిత వాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమం చిరంజీవి గారి చేతుల మీదుగా ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటినుండి…
కళాత్మక దృశ్య కావ్యాల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు
శంకరాభరణం , సాగరసంగమం, స్వయంకృషి , స్వాతిముత్యం , ఆపద్బాంధవుడు , సితార , సీతాకోకచిలుక మొ: కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర చిత్ర నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి 87వ జయంతి సందర్భంగా ఆయన మనకు అందించిన ఆణి ముత్యాల్లాంటి చిత్రాల గురించి గుర్తు చేసుకుందాం . కాలేజీ రోజుల నుండి నాటక అనుభవం ఉన్నందున , ఆయన దృష్టి నటన పై పడి, మద్రాస్ రైలెక్కిన ఈయనకు నిరాశే మిగిలింది .చేసేది లేక అక్కడే స్థిరపడి చిన్నా చితకా వేషాలు వేస్తూ, డబ్బింగులు చెబుతూ , నానా కష్టాలూ పడుతూ బతుకు కొన సాగించారు . అలాంటి సమయంలో 1976 లో ఆయన మిత్రుల ప్రోత్సాహంతో సిరి సిరి మువ్వ చిత్రానికి నిర్వహణ బాధ్యతులు వహించి మంచి విజయం…
Karthi launches the slick, action-packed trailer of aha’s crime thriller web series, ‘In the Name of God’
100% Telugu platform aha is gearing up for the launch of its prestigious, blockbuster series In The Name of God (ING) on June 18. The shocking thriller drama featuring Priyadarshi, Nandini Rai and Posani Krishna Murali in key roles, is directed by Vidyasagar Muthukumar and produced by veteran filmmaker Suresh Krissna. The action-packed trailer of the much-awaited show was launched by multilingual superstar, Karthi. The trailer of In the Name of God is nothing short of a visual treat, bringing together a raw, sizzling mix of emotions, drama, action and…
ఆహా’లో యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్
జూన్ 18న విడుదల హండ్రెడ్ పర్సెంట్ అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్తో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో తిరుగులేని స్థానాన్ని దక్కించుకున్న తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’లో యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’(ఐఎన్జీ) జూన్ 18న విడుదలవుతుంది. ప్రియదర్శి, నందినీ రాయ్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించారు. విద్యాసాగర్ ముత్తు కుమార్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ ప్రముఖ సీనియర్ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మించారు. ఈ అవెయిటింగ్ వెబ్ సిరీస్ ట్రైలర్ను శనివారం తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన స్టార్ హీరో కార్తి విడుదల చేశారు.ట్రైలర్ విషయానికి వస్తే ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’(ఐఎన్జీ)డ్ వెబ్ సిరీస్ చక్కటి విజువల్ ట్రీట్గా, రా కంటెంట్, ఎమోషన్స్, డ్రామా, యాక్షన్, చక్కటి డైలాగ్స్ కలబోతగా ఉంది. ఆది(ప్రియదర్శి)…
