పూజా హెగ్డే.. కీర్తి సురేష్..రష్మిక మందన్న తెలుగు చిత్రసీమలో కథానాయికల గురించి చెప్పుకోవాలంటే ప్రస్తుతం మనం ముగ్గురి గురించే చెప్పుకోవాలి. ఆ ముగ్గురూ ఎవరో కాదు.. పూజా హెగ్డే.. రష్మిక మందన్న, కీర్తి సురేష్. వీళ్లు ముగ్గురూ..ముగ్గురే! తమ అందచందాలతో టాలీవుడ్ ని తమ వైపునకు తిప్పుకొని ఆధిపత్యాన్ని చెలాయిస్తూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముగ్గురి భామల టైం నడుస్తుంది. ఈ ముగ్గురు ప్రస్తుతం టాలీవుడ్ ని కుదుపేస్తున్నారని చెప్పొచ్చు. అందులో ఎలాంటి సందేహం లేదు. వీరిలో పూజా హెగ్డే, రష్మిక మందన్నల జోరు అయితే మామూలుగా లేదు. వరుసగా సినిమాలు చేసేస్తూ తోటి తారలకు ముచ్చెమటలు పట్టేలా చేస్తున్నారు. అంతే కాదు.. అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్నట్లుగా కూడా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ సమయంలో వీరిద్దరు కలిసి నటించబోతున్నారు అనే ప్రచారం ఇండస్ట్రీ…
Author: M.D ABDUL - Tollywoodtimes
అందుకే తాప్సీ వాటిని వదులుకోవాల్సి వచ్చింది?!
నన్ను బికినీలో చూడటానికి నా అభిమానులు ఇష్టపడరని అంటోంది తాప్సీ. ప్రతిఒక్కరికీ వారి ఎంపికలు ఉంటాయి. బికినీ ధరించాలా వద్దా అనేది వారి వారి ఇష్టం. బికినీ నాకు సౌకర్యంగా అనిపించదు. ఎందుకంటే నా అభిమానులకు నేను అలా కనిపించడం నచ్చదు అని చెప్పింది. ప్రారంభ చిత్రాల్లో తాప్సీ బికినీ ధరించినప్పుడు తనకు ఎదురైన అనుభవాల రీత్యా తాను కూడా అసౌకర్యం ఫీలవుతోందని అర్థమవుతోంది. అన్నట్టు పింక్ – నామ్ షబానా అంటూ తన ఇమేజ్ ని తానే మార్చేసుకుంది. గ్లామర్ నాయికగా కంటే రెబల్ యాటిట్యూడ్ ఉన్న యాక్షన్ నాయికగానే తాను పాపులరైంది. ఇప్పుడు బికినీ వేసినా ఎవరూ పట్టించుకోరు. తనకంటూ అర్థవంతమైన కాన్సెప్టులతోనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు తాప్సీ నటిస్తున్నవి కూడా అలానే ఉన్నాయి. రష్మి రాకెట్-హసీనా దిల్ రుబా ఇవన్నీ నటనకు…
నిత్య లిప్ లాక్ చేసింది ఎవరితో తెలుసా?
అన్ని భాషల్లోనూ ప్రతిభ గల నటిగా పేరుతెచ్చుకుందినిత్యా మీనన్. ఓటీటీలోకి అడుగుపెట్టి ఓ వెబ్ సిరీస్లో కూడా నటించింది తాజాగా రెండు పాటలను రికార్డ్ చేయడం మాత్రమే కాకుండా, సినిమా కథ కూడా రాసిందట.“ నేను ఇటీవల రెండు పాటలను రికార్డ్ చేశాను. సినీ జీవితంలో నాకు తెలిసిన మరో ముఖ్యమైన అంశం సంగీతం. మంచి రొమాంటిక్ మెలోడీ, అలాగే లండన్కు చెందిన ఆర్టిస్ట్తో కలిసి ఓ క్లాసికల్ సాంగ్ రికార్డ్ చేశాను. అలాగే స్క్రిప్టు వర్కు కూడా కొంత చేశాను. స్క్రిప్టు రాయడాన్ని నేను చాలా ఇష్టపడతాను. కొన్ని నెలల్లో ఆ వర్కు పూర్తవుతుందని తెలిపింది. అలాగేబ్రీత్వెబ్సిరీస్ గురించి స్పందిస్తూ.. తన కెరీర్లోని అద్భుత పెర్ఫార్మెన్సులలో ఇది ఒకట”ని చెప్పింది.. అభిషేక్ బచ్చన్, నిత్యా మీనన్ నటించిన వెబ్ సిరీస్బ్రీత్: ఇన్ టు ద షాడోస్.…
నేను ఊహించనిది జరిగింది : ఇలియానా
‘బర్ఫీ’లో శ్రుతి ఘోష్ పాత్రని దక్షిణాది ప్రేక్షకులు ఎలా తీసుకునేవారో తెలియదుగానీ..బాలీవుడ్లో మాత్రం ‘బహు బాగా నటించావు’ అని ప్రశంసించారు.. అని చెప్పింది ఇలియానా తన బాలీవుడ్ ఎంట్రీ చిత్రం గురించి చెబుతూ. ‘‘దక్షిణాదిలో సుపరిచితం అయినప్పటికీ, బర్ఫీ చేస్తున్నప్పుడు మాత్రం ఇక్కడి ప్రేక్షకులకు కొత్త నటినే. అది ప్లస్ అయింది. నాకైతే ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపించింది. ప్రయోగాలు చేయడానికి ఒక వేదిక దొరికినట్లయింది. ప్రేక్షకులకు నా పాత్ర ఎంతగానో నచ్చింది. ఇది నేను ఊహించనిది. నేను ఎప్పుడూ కంఫర్ట్జోన్ను ఇష్టపడను. అది దాటి బయటికి వచ్చినప్పుడు వైవిధ్యమైన పాత్రలు చేయడానికి అవకాశం దొరుకుతుంది’’ అంటోంది ఇలియానా .మాంచి మాస్ మసాలా సినిమా ద్వారా బాలీవుడ్లోకి ఎంట్రీ కావాలనుకుంది ఇలియానా. అయితే ‘బర్ఫీ’ మసాలా సినిమా కాదు. ‘‘స్టోరీ విన్నప్పుడు నిర్ణయం తీసుకోవడానికి మూడు…
ధరలను అదుపు చేయలేని మోడీ ప్రభుత్వం గద్దే దిగాలి
సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ డిమాండ్ ప్రజల పట్ల బాధ్యత లేకుండా,ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, వారంలో రెండు,మూడు, సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం,ప్రజలపై ఆర్ధిక భారాలను మోపడం,ప్రజలకు జవాబుదారీగా ఉండకుండా,కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా దోపిడీ పాలనను అనుసరిస్తున్న మోడీ తక్షణమే గద్దె దిగాలని సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్, సీపీఐ (ఎం)ఆలేరు పట్టణ కమిటీ కార్యదర్శి ఎం.ఎ.ఇగ్బాల్ డిమాండ్ చేశారు. గురువారం నాడు ఆలేరు పెట్రోల్ బంక్ ముందు సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ,సీపీఐ, సీపీఐ (ఎం)పార్టీల ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఉపసంహరించుకోవాలని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. పై పార్టీల రాష్ట్ర కమిటీల పిలుపు లో భాగంగా ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా జనార్ధన్,వెంకటేష్,ఇగ్నాల్ లు మాట్లాడుతూ,మోడీ ప్రభుత్వం నేల విడిచి సాము చేసినట్లుగా,ప్రజలను విడిచి…
‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ టీజర్ వచ్చేసింది
విడుదల చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ రమణ్ కథానాయకుడిగా సిరి మూవీస్ బ్యానర్పై కె. శిరీషా రమణారెడ్డి నిర్మిస్తున్నచిత్రం రెడ్డిగారింట్లో రౌడీయిజం. ఎం. రమేష్, గోపి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. వర్ష విశ్వనాథ్, ప్రియాంక, పావని, అంకిత హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొరివి పిచ్చిరెడ్డి, సరస్వతి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టీజర్ను టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ విడుదల చేశారు. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉందని, సినిమా పెద్ద హిట్ కావాలని అభిలషిస్తూ చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు వినాయక్. ఈ సందర్భంగా….హీరో రమణ్ మాట్లాడుతూ ‘‘మా ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ మూవీ టీజర్ను విడుదల చేసి అభినందించిన వినాయక్గారికి స్పెషల్ థాంక్స్. సినిమా విషయానికి వస్తే… పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. నటీనటులు, సాంకేతిక నిపుణులు సహకారంతో సినిమాను సకాలంలో పూర్తి చేశాం. మేకింగ్లో ఎక్కడా కాంప్రమైజ్…
పునః ప్రారంభమైన ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రాలు
‘వరుడు కావలెను‘, ‘నరుడి బ్రతుకు నటన’ సిద్ధు జొన్నలగడ్డ ‘నరుడి బ్రతుకు నటన’ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం.హైదరాబాద్ లో ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం షూటింగ్ ఈరోజు పునః ప్రారంభం అయింది.కథానాయకుడు సిద్దు పాల్గొనగా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.టాలీవుడ్ లోని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్ యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా,‘నేహాశెట్టి‘ నాయికగా ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే.’కృష్ణ అండ్ హిజ్ లీల’ చిత్రానికి రచయిత గానూ,దర్శకత్వ శాఖలో పనిచేసిన ప్రతిభ గల యువకుడు విమల్ కృష్ణ ను ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశి.కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అంటున్నారు దర్శకుడు విమల్ కృష్ణ.చిత్రంలోని…
పునః ప్రారంభమైన ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ చిత్రాలు
‘వరుడు కావలెను‘, ‘నరుడి బ్రతుకు నటన’ నాగ శౌర్య ‘వరుడు కావలెను‘ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ యువ కథానాయకుడు నాగ శౌర్య , నాయిక ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘చిత్రం చివరి షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది. చిత్ర నాయకా, నాయికలు‘నాగ శౌర్య ,రీతువర్మ’ లపై ఓ సందర్భోచిత గీతాన్ని నృత్య దర్శకుడు శేఖర్ మాస్టర్ నేతృత్వంలో దర్శకురాలు లక్ష్మీ సౌజన్య చిత్రీకరిస్తున్నారు. ఈ గీతం తో పాటు మరికొన్ని సన్నివేశాల చిత్రీకరణతో త్వరలోనే చిత్రం షూటింగ్ పూర్తవుతుంది.‘వరుడు కావలెను‘ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు,నటీ నటుల అభినయాలు చిత్ర కథా నుగుణంగా సాగి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న…
ఎస్పీ మ్యూజిక్ పేరుతో సంగీత పరిశ్రమలోకి సురేష్ ప్రొడక్షన్స్అడుగు
1964లో డా. రామానాయుడుగారిచే స్థాపించబడిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ జాతీయ సినిమాకు 50 ఏళ్ళకు పైగా సహకారం అందించిన భారతదేశపు అతిపెద్ద చిత్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా అవతరించింది. ఎక్కువ సంఖ్యలో భారతీయ భాషల్లో సినిమాలు తీసిన ఘనత వారికి ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ వారు సినిమాల నిర్మాణమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నారు. దశాబ్దాలుగా పరిశ్రమ అభివృద్దికి తోడ్పాటు పడిన అగ్రశ్రేణి ప్రొడక్షన్ హౌస్ ఇప్పటికీ కొత్త ప్రతిభను ప్రోత్సహించే అన్ని రకాల బడ్జెట్ల చిత్రాలను నిర్మిస్తోంది. ఇప్పుడు ‘ఎస్పీ మ్యూజిక్’ అనే కొత్త మ్యూజిక్ లేబుల్ను ప్రారంభించి సంగీత పరిశ్రమలోకి అడుగుపెట్టింది సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ – ”మ్యూజిక్ అనేది మన సినిమాలకు హృదయం లాంటిది. అందుకే దాన్ని సొంతగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన…
Suresh Productions Forays Into Music Industry With SP Music
Suresh Productions, founded by D Ramanaidu in 1964, has emerged as one of India’s largest film production companies with over 50 years of contribution to national cinema. They have the distinction of producing films in most number of Indian languages. They are also into film distribution and exhibition in Andhra Pradesh and Telangana.The top most production house which is reining the industry over the decades is still producing films of all kinds of budgets encouraging good talent. Now Suresh Productions is foraying into the music industry by launching a new…
