సుమంత్‌, టీజీ కీర్తికుమార్‌, రెడ్ సినిమాస్ మ‌ళ్లీ మొద‌లైంది ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

గ‌త కొన్నిరోజులుగా సుమంత్ మ‌ళ్లీ పెళ్లిచేసుకోబోతున్నారు అంటూ ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంది. దీనిపై హీరో సుమంత్ స్పందిస్తూ.. తాను మళ్లీ పెళ్లి చేసుకోవడం లేదని.. ప్రస్తుతం తాను నటిస్తున్న సినిమా డైవ‌ర్స్ మ‌రియు రీ మ్యారేజ్ కి సంభందించిన అంశాల‌తో కూడుకున్న‌ద‌ని, తెలుగులో ఇలాంటి క‌థతో మొద‌టిసారి ఓ సినిమా వ‌స్తుందని అందులో నుండే ఒక వెడ్డింగ్‌కార్డ్ లీకైంద‌ని వివ‌ర‌ణ ఇచ్చిన విష‌యం తెలిసిందే..సుమంత్ హీరోగా న‌టిస్తున్న ఆ చిత్రానికి మ‌ళ్ళీ మొద‌లైంది అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ప్ర‌క‌టించారు మేక‌ర్స్‌. విడాకులు.. మళ్లీ పెళ్లి చేసుకోవడం నేపథ్యంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రం ద్వారా టీజీ కీర్తికుమార్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. నైనా గంగూలి హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీని రెడ్ సినిమాస్ ప‌తాకంపై కె. రాజ‌శేఖ‌ర్ రెడ్డి నిర్మిస్తున్నారు.ఫస్ట్ లుక్…

విజయేంద్ర ప్రసాద్ ఆవిష్కరించిన ‘చిత్రపటం’ పాట

chithrapatam movie still

సినీ గీత రచయితగా తనకంటూ ఓ ఫ్రత్యేక గుర్తింపు పొందిన బండారు దానయ్య కవి ఇదివరకే దర్శకుడిగా మారారు. తన అభిరుచిని చాటుకుంటూ ఆయన దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘చిత్రపటం’. పార్వతీశం, శ్రీవల్లి ప్రధాన పాత్రధారులు. శ్రీ క్రియేషన్స్ పతాకంపై పుప్పాల శ్రీధరరావు నిర్మించిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని ‘నింగిని చూసి నేర్చుకున్న…’ అనే పల్లవితో సాగే లిరికల్ వీడియో పాటను ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ హైదరాబాద్ లో విడుదల చేశారు. అనంతరం విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. మంచి కథ, మంచి టైటిల్, చక్కటి సాహిత్యం, సంగీతం మేళవింపు ఈ చిత్రమని దర్శక, నిర్మాతలను, చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ.. ఇంటర్నెట్…

క్రేజీహీరో విజ‌య్ దేవర‌కొండ రిలీజ్ చేసిన ‘స్టాండప్‌ రాహుల్‌’లోని అలా ఇలా అనాల‌ని..సాంగ్‌

standap rahul telugu movie still

యంగ్‌ అండ్‌ ప్రామిసింగ్‌ హీరో రాజ్‌తరుణ్‌ స్టాండప్‌ కమేడియన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘స్టాండప్‌ రాహుల్‌’. సాంటో మోహన్‌ వీరంకి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఫీల్‌ గుడ్‌ రొమాన్స్‌ కామెడీ మూవీగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని డ్రీమ్‌ టౌన్‌ ప్రొడక్షన్స్, హైఫైవ్‌ పిక్చర్స్‌ పతాకాలపై నందకుమార్‌ అభినేని, భరత్‌ మగులూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన టీజర్‌ చాలా ఫ్రెష్‌గా ఉంటూ సినిమాపై ప్రేక్షకుల అంచనాలను పెంచేసింది. రాజ్‌ తరుణ్‌ సరసన వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తోన్న‌ ఈ సినిమా నుండి అలా ఇలా అనాలని సాంగ్‌ని క్రేజీ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ రిలీజ్ చేసి చిత్ర యూనిట్‌కు ఆల్‌దిబెస్ట్ తెలిపారు.. అలా ఇలా అనాల‌ని ఇలా ఎలా ఉందే..అవీ ఇవీ వినాల‌ని ఇవాల‌తోచిందే..అంటూ సాగే ఈ పాట‌కు అనంత శ్రీ‌రామ్ సాహిత్యం అందించ‌గా స్వీకర్‌…

వెండితెరపై ప్రథమ భూదాత వెదిరె రామచంద్రారెడ్డి బయోపిక్

ప్రముఖ దర్శకుడు నీలకంఠ దర్శకత్వంలో 1951సo.లో గాంధీజీ ప్రియశిష్యుడైన ఆచార్య వినోబాభావే అడగగానే ప్రధమ భూదాతగా 100 ఎకరాల భూమిని పోచంపల్లికి చెందిన వెదిరె రామచంద్రారెడ్డి గారు దానంగా ఇచ్చారు. ప్రపంచ చరిత్రలో భూమికోసం ఎన్నో భూ పోరాటాలు జరిగాయి. అయితే ఒక్క రక్తపు బొట్టు చిందకుండా 58 లక్షల ఎకరాల భూమి పేద ప్రజలకు అందజేయడం ఒక మహా అద్భుతం. ఇదో మహాయజ్ఞం గా సాగింది. ఇంతటి చరిత్ర కలిగిన పోచంపల్లి భూదాన్ గురించి నేటి తరానికి తెలియజేయాలన్న ఉద్దేశ్యముతో ఈసినిమా రూపకల్పనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. భూ పంపిణీకి స్ఫూర్తినిచ్చిన రామచంద్రారెడ్డి గారి జీవిత కథతో సినిమా తెరకెక్కించేందుకు రామచంద్రారెడ్డి మనవడు అరవింద్ రెడ్డి సమర్పణలోఅల్లు అర్జున్ మామగారు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్ట్ కు ప్రముఖ…

పల్లా రాజేశ్వర్ రెడ్డిని కలిసిన ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్

ఎమ్మెల్సీ రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని శుక్రవారం ఆలేరు మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

‘పెళ్లి సంద‌D’లో వ‌శిష్ట‌గా వెండితెర‌పై ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు సంద‌డి

pellisandhaD'lo vasistagaa k ragavendrarao

ద‌ర్శ‌కేంద్రుడు, శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్రరావు .. తెలుగు సినీ ప్రేక్ష‌కుడికి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. తెలుగు సినిమాను క‌మ‌ర్షియ‌ల్ పంథాను మ‌రో మెట్టు ఎక్కించిన ఈ స్టార్ డైరెక్ట‌ర్ విక్ట‌రీ వెంక‌టేశ్‌, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, లేడీ సూప‌ర్‌స్టార్ శ్రీదేవి, శిల్పాశెట్టి, ఖుష్బూ, ట‌బు, తాప్సీ వంటి ఎంద‌రో స్టార్స్‌ను వెండితెర‌కు త‌న గోల్డెన్ హ్యాండ్‌తో ప‌రిచ‌యం చేసి సూప‌ర్ డూప‌ర్ హిట్స్‌, బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించారు. శ‌తాధిక చిత్ర ద‌ర్శ‌కుడిగా త‌న‌దైన తెలుగు సినిమా చ‌రిత్ర‌లో త‌నదైన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న రాఘ‌వేంద్ర‌రావు, తొలిసారి వెండితెర‌పై న‌టుడిగా మెప్పించ‌నున్నారు. రాఘ‌వేంద్ర రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో, ద‌ర్శ‌కేంద్రుడి శిష్యురాలు గౌరి రోణంకి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘పెళ్లి సంద‌D’. ఈ చిత్రంలో రాఘవేంద్ర‌రావు తొలిసారి న‌టిస్తుండ‌టం…

Naga Shaurya’s ‘LAKSHYA’ Friday Special Poster Out

naga Shaurya's 'LAKSHYA' Friday Special Poster Out

Talented actor Naga Shaurya’s milestone 20th film ‘Lakshya’, India’s first movie based on ancient archery, is being directed by Dheerendra Santhossh Jagarlapudi. The sports drama promises to be entertaining and exciting. The movie shows Naga Shaurya in a never before look.Presented by Sonali Narang, the film is produced by Narayan Das K. Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar in Sri Venkateswara Cinemas LLP, and Northstar Entertainment Pvt Ltd banners. Ketika Sharma is playing as heroine in this film while versatile actor Jagapathi Babu will be seen in a crucial…

నాగ‌శౌర్య ‘ల‌క్ష్య‌’నుండి ఫ్రైడే స్పెష‌ల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

naga Shaurya's 'LAKSHYA' Friday Special Poster Out

టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో రూపొందుతోన్న నాగ‌శౌర్య 20వ చిత్రం ‘ల‌క్ష్య’. ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలోఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని స‌రికొత్త‌లుక్‌లో క‌నిపించనున్నారు నాగ‌శౌర్య‌.సోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కీల‌క పాత్రల‌లో విలక్షణ న‌టులు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు.ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ను ఇటీవ‌ల కిక్‌ స్టార్ట్ చేసి #LAKSHYASFRIDAY హ్యాష్ ట్యాగ్ పేరుతో ప్ర‌తీ శుక్ర‌వారం ల‌క్ష్య మూవీ నుండి ఒక కొత్త అప్డేట్ ఇవ్వ‌నున్నారు.దీనిలో భాగంగా ఈ శుక్ర‌వారం నాగ‌శౌర్య‌, కేతిక శ‌ర్మ‌ల‌తో కూడిన ఒక స్పెష‌ల్ రొమాంటిక్ పోస్ట‌ర్ ను రిలీజ్…

దర్శకేంద్రులు కె.రాఘవేంద్ర రావు గారి సినీ ప్రయాణంలో ఓ కొత్త మైలురాయి: పవన్ కళ్యాణ్ ( జనసేన పార్టీ )

pavankalyan

హైదరాబాద్30-07-2021 శ్రీ కె.రాఘవేంద్ర రావు గారికి నమస్సులు.. తెలుగు సినిమాకు కమర్షియల్ సొబగులు అద్దిన శతాధిక చిత్రాల దర్శకుడిగా సినీ చరిత్రలో మీకంటూ ప్రత్యేక స్థానం ఉంది. అగ్రశ్రేణి తారల నుంచి నవతరం నటుల వరకూ అన్ని తరాలవారితోనూ హావభావాలు పలికించి వెండి తెరపై మెరిసేలా చేసిన దర్శకేంద్రులు మీరు. కెమెరా వెనక నుంచే ‘స్టార్ట్… కెమెరా… యాక్షన్…’ అనే మీరు ఇప్పుడు కెమెరా ముందుకు రావడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ‘పెళ్లి సందడి’ చిత్రంతో దర్శకులు రాఘవేంద్ర రావు గారు నటులు రాఘవేంద్ర రావు గారు కావడం ఈ సినీ ప్రయాణంలో ఓ కొత్త మైలురాయి. దర్శకుడిగా నాలుగున్నర దశాబ్దాల అనుభవం మీ నటనలో కచ్చితంగా ప్రతిఫలిస్తుంది. మీ దర్శకత్వంలో సినిమాలు చేయాలని నటులు ఎలా ఉవ్విళ్లూరారో… ఇకపై తమ దర్శకత్వంలో మీరు నటించాలని దర్శకులు…

ఘన విజయం సాధించే చిత్రం ‘క్షీరసాగర మథనం’ : స్టార్ ప్రొడ్యూసర్ శరత్ మరార్

ksheera sagara madhanam

హైలీ టాలెంటెడ్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనిల్ పంగులూరి దర్శకత్వంలో రూపొందిన ‘క్షీర సాగర మథనం’ కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందని అన్నారు ప్రముఖ నిర్మాత శరత్ మరార్. ఈ చిత్రాన్ని తాను చూశానని… దర్శకుడిగా అనిల్ పంగులూరికి ఉజ్వల భవిష్యత్ ఉందని మరార్ అభిప్రాయపడ్డారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 6… థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న “క్షీర సాగర మథనం” చిత్రం ట్రైలర్ శరత్ మరార్ విడుదల చేశారు.మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందిన ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర ప్రతినాయకుడు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.చిత్ర…