Kannada star Kicha Sudeep needs no special introduction for Telugus. He is very much familiar for audience here for his mass appealing roles in several films. Now, Sudeep is gearing up for release of a mass action entertainer K3 Kotikokkadu directed by Shiva Karthik.K3 was released on 15th of this month in Kannada to massive response with 40.5 Cr Gross in just 4 days and the film is expected to become one of the biggest hits for Sudeep, as per trade experts of Sandalwood. The Telugu version of the film…
Author: M.D ABDUL - Tollywoodtimes
కిచ్చా సుదీప్, శివ కార్తీక్, గుడ్ సినిమా గ్రూప్ ‘కే3 కోటికొక్కడు’ నవంబర్ 12న గ్రాండ్ రిలీజ్
తెలుగు ప్రేక్షకులకు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ప్రస్తుతం సుదీప్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకులను పలకరించబోతోన్నారు. శివ కార్తీక్ దర్శకత్వంలో సుదీప్ కే3 కోటికొక్కడు అనే సినిమాను చేశారు.కన్నడలో కే 3 చిత్రం విడుదలైంది. కన్నడ పరిశ్రమ ట్రేడ్ లెక్కల ప్రకారం రిలీజ్ చేసిన నాలుగు రోజుల్లోనే దాదాపు 40 కోట్లు వసూలు చేసి సుదీప్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని నవంబర్ 12న తెలుగులో విడుదలచేయనున్నారు.ఈ క్రమంలోనే కే3 కోటికొక్కడు ట్రైలర్ను విడుదల చేశారు. ఇందులో సుధీర్ రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తున్నారు. విదేశాల్లో బాంబ్ బ్లాస్ట్ జరగడం, మీడియా అంతా కూడా ఘోస్ట్ గురించి ప్రస్థావించడం, ఆ బాంబ్…
విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘రౌడీ బాయ్స్’ నుంచి ‘ప్రేమే ఆకాశం.. ’ పాట విడుదల
దిల్రాజు ప్రొడక్షన్, ఆదిత్య మ్యూజిక్ అసోసియేషన్తో … శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో దిల్రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’. తెలుగు ప్రేక్షకుల అభిరుచిగా తగినట్లు ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను అందించిన దిల్రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అవుతున్నారు ఆశిష్(శిరీష్ తనయుడు). బుధవారం ఈ సినిమా నుంచి ‘ప్రేమే ఆకాశం..’ అనే పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ సాంగ్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా…విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘‘డైరెక్టర్ ఆశిష్, అనుపమ, డైరెక్టర్ శ్రీహర్షకు నాకు పరిచయం ఉంది. వీరి కాంబినేషన్లో వస్తున్న రౌడీ బాయ్స్ సినిమాలోని సాంగ్ లాంచ్ చేయడం హ్యాపీగా ఉంది. పెళ్లిచూపులు ముందు నుంచి శ్రీహర్ష నాకు…
మాజీ హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ ఆవిష్కరించిన ‘దర్జా’ టైటిల్ లుక్ పోస్టర్
శ్రీ కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి శివశంకర్ పైడిపాటి నిర్మాత. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా రవి పైడిపాటి వ్యవహరించనున్నారు. ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్ను మాజీ హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘శివ శంకర్ నాకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆయన నిర్మిస్తోన్న ‘దర్జా’ చిత్ర టైటిల్ లుక్ చాలా బాగుంది. ఈ చిత్రయూనిట్కు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను..’’ అన్నారు.ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మా చిత్ర టైటిల్ లుక్ని విడుదల చేసిన శ్రీ…
నవంబర్ 12న తెలుగు, హిందీ భాషల్లో ‘స్ట్రీట్ లైట్’ విడుదల
మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం “స్ట్రీట్ లైట్”.ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకులనుడి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 12న దీపావళికి తెలుగు, హిందీ భాషల్లో థియేటర్లలలో ప్రేక్షకుల తీసుకు వస్తున్నారు. ఈ సందర్భంగా..చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ స్ట్రీట్ లైట్ సినిమాని దీపావళి సందర్భంగా నవంబర్ 12న థియేటర్లలలో రిలీజ్ చేస్తున్నాము. సినిమా చాలా బాగా వచ్చింది. మాకు ఓటిటి నుండి చాలా ఆఫర్స్ వచ్చాయి.సేవ్ థియేటర్స్ అనే కాన్సెప్ట్ తో థియేటర్స్ సేవ్ చేయాలని ఓటిటి లో…
షోయబుల్లాఖాన్ జయంతి సభ ఏర్పాట్లను పరిశీలించిన చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు
యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక ఎస్ వి హోటల్ లో 18న జరగనున్న షోయబుల్లాఖాన్ జయంతి సభ ఏర్పాట్లను రాష్ట్ర చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు యూసఫ్ బాబు పరిశీలించారు. చిన్న పత్రిక ల సంఘం ఛలో హుజరబాద్ కార్యక్రమానికి వెళుతూ మధ్యలో భువనగిరిల ఆగి ఏర్పాట్ల ను పరిశీలించారు. వారి వెంట చిన్న పత్రికల సంఘం రాష్ట్ర నాయకులు భూపతి రాజు ( భూపతి టైమ్స్) గంజి శ్రీనివాస్ (మెగా జ్యోతి) వి. రామకృష్ణ (ఆజ్ కా తెలంగాణ) యాదాద్రి భువనగిరి జిల్లా మైనార్టీ జర్నలిస్టుల సంఘము అధ్యక్షుడు హమీద్ పాషా, సుజావొద్దీన్, సలావోద్దీన్, మహ్మద్ ఇసాక్ మరియు స్థానిక జర్నలిస్టులు పాల్గొన్నారు.
దోహా లో అంబరాన్నిఅంటిన బతుకమ్మ సంబరాలు
తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో దోహా లో నిర్వహించిన బతుకమ్మ-దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా భారత రాయబారి కార్యాలయ కార్యదర్శి శ్రీమతి శ్రీ పద్మ కర్రీ గారు మరియు ఐసీబీఫ్ అధ్యక్షుడు జాయిద్ ఉస్మాన్ గారు ఐసీసీ ప్రధాన కార్యదర్శి కృష్ణకుమార్ గారు ఐసీసీ సలహదారుల కమిటీ చైర్మన్ శ్రీ కె ఎస్ ప్రసాద్ గారు ఐసీబీఫ్ కమిటీ సభ్యురాలు రజినీ మూర్తి గారు తెలంగాణ ప్రజా సమితి అడ్వైజరి కమిటీ చైర్మన్ శ్రీ చెనవేణి తిరుపతి, గారు మరియు ఖతర్ లోని ఇతర తెలుగు సంఘాల నాయకులూ పాల్గొని వేడుకలను తిలకించారు. స్థానిక లయోలా స్కూల్ వేదికగా ఈ సంబరాలను తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు శ్రీ గద్దె శ్రీనివాస్ గారి అధ్యక్షతనా వేడుకలు ప్రారంభం అవగా వాక్యతలుగా శ్రీమతి చెన్న ప్రత్యుష…
నేడే ‘ఆరాధన’ 26వ వార్షికోత్సవం
విశిష్టమైన కార్యక్రమాల ద్వారా ఉన్నతమైన సేవలను అందిస్తూ హైదరాబాద్ కు చెందిన ‘ఆరాధన’ సంస్థ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలుపుకుంటోంది. గత 25ఏళ్లుగా లెక్కకు మించి కార్యక్రమాలు నిర్వహించి వివిధరంగాలకు చెందిన ఎందరినో గుర్తించి సత్కరించి..అవార్డులను అందజేస్తూ వస్తోంది. అందులో భాగంగానే నేడు (18న) తన 26వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ‘విజయంలో భార్యాభర్తల భాగస్వామ్యం’ పేరుతో నిర్వహించే ఈ వార్షికోత్సవం సోమవారం 18న హైదరాబాద్ లోని చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభలో సాయంత్రం 6 గంటలకు జరగనుందని ‘ఆరాధన’ వ్యవస్థాపకులు, ప్రధానకార్యదర్శి లోకం కృష్ణయ్య తెలిపారు.ఈ సందర్బంగా నిర్వహించే వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా ప్రముఖ సాహితీవేత్త డా. ఓలేటి పార్వతీశం, సన్మాన కర్తలుగా సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి దేవస్థానం కు చెందిన ప్రధానార్చకులు శ్రీ బి. రామతీర్థ శర్మ, శ్రీమతి బి. రాజ్యలక్ష్మి, సభాధ్యక్షులుగా లయన్స్ క్లబ్…
మెగాస్టార్ చిరంజీవి కుడి చేతికి సర్జరీ!
కరోనా మహమ్మారి విజృంభించి తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆక్సిజన్ బ్యాంకు ద్వారా సేవలు అందించిన మెగా అభిమానులతో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. కరోనా మహమ్మారి రెండో దశ విరుచుకు పడుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లో, జిల్లా స్థాయిలో ఆక్సిజన్ బ్యాంకు నెలకొల్పిన సంగతి తెలిసిందే.. ఈ ఆక్సిజన్ బ్యాంకు సేవలలో అన్ని జిల్లాల మెగా అభిమాన సంఘాల ప్రతినిధులు కూడా పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం నాడు తెలంగాణ జిల్లాల ఆక్సిజన్ బ్యాంకుల సేవలో పాల్గొన్న ప్రతినిధులను పిలిచి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో చిరంజీవి పాల్గొనగా ఆయన కుడి చేతికి బ్యాండేజ్ లా ఉండడం అభిమానులందరినీ…
కరోనా క్రైసిస్ లో ఆక్సిజన్ బ్యాంక్ సేవలందించిన అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు
కరోనా క్రైసిస్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ బ్యాంకుల్ని స్థాపించి మెగాస్టార్ చిరంజీవి ఇరు తెలుగు రాష్ట్రాల్లో సేవలందించిన సంగతి తెలిసిందే. ఈ సేవల్లో అన్ని జిల్లాల నుంచి మెగాభిమాన సంఘాల ప్రతినిధులు పాలుపంచుకున్నారు. అందుకే ఆదివారం రోజు తెలంగాణ జిల్లాల నుంచి ఆక్సిజన్ సేవల్లో పాల్గొన్న ప్రతినిధుల్ని పిలిచి మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. హైదరాబాద్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేదికపై అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు మహేష్ చింతామణి మరియు రమణం స్వామినాయుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుల నిర్వాహకులు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు మహేష్ చింతామణి మాట్లాడుతూ “కరోనా కష్ట కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్ని కాపాడేందుకు చిరంజీవి గారు ఆక్సిజన్ సిలిండర్స్…
