ఓవర్సీస్‌లో ‘అఖండ’ ప్రభంజనం!

Akhanda Movie still

నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన హ్యాట్రిక్‌ చిత్రం ‘అఖండ’. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది. అయితే 2021లో ఒక తెలుగు చిత్రానికి ఈ తరహా కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి అని అంటున్నారు. అమెరికాలో ఈ చిత్రం హాఫ్ మిలియన్ (500K+) డాలర్స్ మార్క్‌ని సంపాదించుకుందిట. ఇదే జోరు కొనసాగితే ఈ వీకెండ్ వరకూ వన్ మిలియన్ మార్క్ చేరుకోవడం గ్యారంటీ అని చెబుతున్నారు. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

‘హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు’ నుంచి నిధి అగర్వాల్ ఔట్ నర్గీస్ ఫక్రి ఇన్ !

nidhi agarwaal

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘హరి హర వీర మల్లు’. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న తొలి పీరియాడిక‌ల్ డ్రామా ఇది.అయితే ఈ చిత్రం నుంచి నిధి అగర్వాల్ తీసేసి ఈ బ్యూటీ స్థానంలో బాలీవుడ్ స్టార్ నర్గీస్ ఫక్రిను తీసుకున్నట్టు తెలిసింది. నిధి అగర్వాల్ హావభావాలు నచ్చక ఆమెను చిత్రం నుంచి తొలగించినట్టు సమాచారం. నిధి అగ‌ర్వాల్ పంచ‌మి అనే పాత్ర‌లో నటించాల్సింది. అయితే ఈ పాత్రకు ఆమె ఈ మాత్రం సూట్ అవడంలేదని దర్శకుడు క్రిష్ భావించారట. అందుకే ఈ చిత్రం నుంచి ఆమెను తొలగించి ఆమె చేయాల్సిన ‘పంచమి’ క్యారక్టర్ లో బాలీవుడ్ స్టార్ నర్గీస్ ఫక్రిను ప్రవేశ పెట్టినట్టు తెలిసింది. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేసుకున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే షెడ్యూల్స్ ప్లాన్…

నిధి అగర్వాల్ ఔట్ నర్గీస్ ఫక్రి ఇన్ !

పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘హరి హర వీర మల్లు’. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న తొలి పీరియాడిక‌ల్ డ్రామా ఇది.అయితే ఈ చిత్రం నుంచి నిధి అగర్వాల్ తీసేసి ఈ బ్యూటీ స్థానంలో బాలీవుడ్ స్టార్ నర్గీస్ ఫక్రిను తీసుకున్నట్టు తెలిసింది. నిధి అగర్వాల్ హావభావాలు నచ్చక ఆమెను చిత్రం నుంచి తొలగించినట్టు సమాచారం. నిధి అగ‌ర్వాల్ పంచ‌మి అనే పాత్ర‌లో నటించాల్సింది. అయితే ఈ పాత్రకు ఆమె ఈ మాత్రం సూట్ అవడంలేదని దర్శకుడు క్రిష్ భావించారట. అందుకే ఈ చిత్రం నుంచి ఆమెను తొలగించి ఆమె చేయాల్సిన ‘పంచమి’ క్యారక్టర్ లో బాలీవుడ్ స్టార్ నర్గీస్ ఫక్రిను ప్రవేశ పెట్టినట్టు తెలిసింది. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేసుకున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగానే షెడ్యూల్స్ ప్లాన్…

నా కల నెరవేరింది : హీరోయిన్ కేతిక శర్మ

Kethika Sharma || Telugu Actress Interview

‘లక్ష్య’లో పక్కింటి అమ్మాయిలా కనిపిస్తా యంగ్ అండ్ వర్సటైల్ యాక్టర్ నాగ శౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రాబోతోన్న చిత్రం ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 10న విడుదల కానుంది. ఈ సందర్బంగా హీరోయిన్‌గా కేతిక శర్మ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..-కరోనా వల్ల ఇలా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ వచ్చాయి. రొమాంటిక్ సినిమా షూటింగ్ చివరి రోజు. షూట్ మొత్తం పూర్తయింది. సంతోష్ గారు కలిసి ఓ కథ చెప్పారు. అదే రోజు ఓ సినిమా షూట్ పూర్తవ్వడం, ఇలా వెంటనే మరో కథ రావడం ఆనందంగా అనిపించింది. రొమాంటిక్ చిత్రంలో చేసిన పాత్రకు, లక్ష్య సినిమాలో చేసిన కారెక్టర్‌కు సంబంధం ఉండదు. నా నటనలోని వైవిధ్యాన్ని చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను ఒప్పుకున్నాను.-లక్ష్య సినిమాలో రితిక…

రోశ‌య్య మృతి తెలుగు వారికి తీర‌నిలోటు : యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ

aler news

ఆలేరులో రోశయ్యకు ఘన నివాళి ఆలేరు: ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా, మంత్రిగా, త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్‌గా, ప్ర‌జా ప్ర‌తినిధిగా అర్ధ‌శ‌తాబ్ధానికి పైగా ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించిన కొణిజేటి రోశ‌య్య మృతి ప‌ట్ల యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ ప్రగాఢ సంతాపం వ్య‌క్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఇందిరా భవన్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశ‌య్య గారు పరమపదించిన సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి మాట్లాడుతూ .. ఎల్ల‌ప్పుడూ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను త‌క్ష‌ణం ప‌రిష్క‌రిస్తూ, ప‌రిపాల‌నా ద‌క్షుడిగా పేరు పొందిన రోశ‌య్య మృతి తెలుగు వారికి తీర‌నిలోట‌న్నారు. రాజకీయాల్లో ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిని తెలుగు రాష్ట్రాలు కోల్పోయామని…

అఖండ కేవలం మా విజయం కాదు చలనచిత్ర పరిశ్రమ విజయం : నందమూరి బాలకృష్ణ

Akhanda Nandamuri Balakrishna press meet

న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన‌హ్యాట్రిక్ మూవీ అఖండ. డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లై అన్ని కేంద్రాల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్ తో దూసుకెళ్తోంది. అఖండ సినిమాను నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, తమన్, మిర్యాల రవిందర్ రెడ్డి హైద‌రాబాద్‌లోని ఏఎంబి మాల్‌లో ప్ర‌త్యేకంగా వీక్షించ‌డం జ‌రిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖ‌రుల స‌మావేశంలో… నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘ఆనాడు రామయణాన్ని రాసిన వాడు వాల్మీకి. ఈనాడు అఖండ సినిమాను ఇంత బాగా తీర్చిదిద్దినవాడు బోయపాటి శ్రీను. ఒకనాడు భక్తిని బతికించింది రామారావు గారు. ఈనాడు సినిమాను బతికించింది భక్తి. ఆ విషయం చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉంది. ఈ సినిమాను ఇంత విజయాన్ని చేకూర్చినందుకు తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మంచి సినిమా ఎప్పుడూ వచ్చినా కూడా ఆదరిస్తారు అని చెప్పడానికి…

నటసింహం బాలకృష్ణ గారు తన నటవిశ్వరూపం చూపెట్టారు: నందమూరి రామకృష్ణ

Nandamuri ramakrishna

గత ఒక సంవత్సరము నుండి ఎపుడా ఎపుడా అని ఎదురుచూస్తున్న అఖండ సినిమా ప్రేక్షకాధర పొంది విజయ పతాకం రెపరెప లాడుతూ విజయ శంఖముతో విజయముగా ప్రదర్షింపబడుతున్నది. మళ్లీ పాత వైభవం వచ్చింది. కరోనా మహమ్మారి తీవ్రతవల్ల సినీ పరిశ్రమ చాలా నష్టపోయింది. ముఖ్యముగా సినీ కార్మికులు, సాంకేతికనిపుణులు, ఎక్సిభిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, వీటిమీద ఆదారబడ్డ చిన్న వ్యాపారస్తులు బాగా దెబ్బ తిన్నారు. వీరందరికి ఈ అఖండ సినిమా ఒక అఖండ జ్యోతి మల్లె మంచి రోజులు వచ్చాయన్న నమ్మకం ఏర్పడింది. ఇక మన నందమూరి అందగాడు, నటసింహం బాలకృష్ణ గారు తన నటవిశ్వరూపం చూపెట్టారు. తన రికార్డు ఆయనే బద్దలు కొడతారు…. “రౌడీ ఇన్స్పెక్టర్” మించిన చిత్రం “బొబ్బిలి సింహం” మించి “నిప్పురవ్వ” మించి “పెద్దన్నయ్య” మించి “సమరసింహా రెడ్డి” మించి “నర్సింహానాయుడు” మించి “లెజెండ్” మించి…

టియ‌ఫ్‌సిసి ఛైర్మ‌న్ మ‌రియు క‌మిటీ స‌భ్యుల ప్ర‌మాణ స్వీకార మ‌హోత్స‌వం

TFCC NEWS

ఇటీవ‌ల జ‌రిగిన‌ తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ (టియ‌ఫ్‌సిసి) ఎన్నిక‌లు ఏక‌గ్రీవంగా ముగిసిన సంగ‌తి తెలిసిందే. ఛైర్మ‌న్ గా డా.ల‌య‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్‌, టిఎఫ్‌సిసి వైస్ ఛైర్మ‌న్లు గా ఎ.గురురాజ్‌, నెహ్రు, సెక్ర‌ట‌రీగా జెవిఆర్‌. తెలంగాణ మా ప్రెసిడెంట్ గా ర‌ష్మి ఠాకూర్‌, డైరెక్ట‌ర్స్‌ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ గా ర‌మేష్ నాయుడు త‌దిత‌రులు ఎన్నిక‌య్యారు. కాగా ఈ రోజు టియ‌ఫ్‌సిసి ఛైర్మ‌న్ తో పాటు క‌మిటీ స‌భ్యుల ప్ర‌మాణ స్వీకార మ‌హోత్స‌వం ప్ర‌సాద్ ల్యాబ్ లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు అతిథులుగా హాజ‌ర‌య్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మాట్లాడుతూ…టియ‌ఫ్ ఫ్ సిసి` ఛైర్మ‌న్ గా నాల్గ‌వ…

నటి జ్యోతి పుట్టినరోజు వేడుకలు !!!

Actress Jyothi birthday vedukalu

టాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో అలరించిన నటి జ్యోతి. ఇటీవల ఆమె బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. గురువారం (డిసెంబర్ 2) జ్యోతి పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ లోని ఒక ప్రవేట్ పబ్ లో జరిగాయి. ఈ వేడుకకు సినీ తారలు మొమైత్ ఖాన్, రఘు కుంచె, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు, రాహుల్ సిప్లిగంజ్, శ్రీకాంత్ అయ్యంగార్ జివిలతో పాటు పలువులు ఫిలిం పర్సనాలిటీస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ..నా బర్త్ డే సెలెబ్రేషన్స్ కు వచ్చిన అందరికీ ధన్యవాదాలు, నేను ఈ పుట్టినరోజును మర్చిపోలేను. రాబోయే రోజుల్లో మరిన్ని మంచి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా వారికి ధన్యవాదాలు. త్వరలో నేను చేసే సినిమాల…

డైలాగ్ కింగ్ మోహన్ బాబు చేతుల మీదుగా ‘రుద్రం కోట’ టైటిల్ విడుదల

Rudramkota tittle laanch

సీనియర్ నటి జయలలిత మొట్టమొదటి సారి ఎ ఆర్ కె విజువల్స్ బ్యానర్ పై సమరిపిస్తున్న చిత్రం ‘రుద్రం కోట’. ఈ నూతన చిత్ర టైటిల్ ను డైలాగ్ కింగ్ మోహన్ బాబు చేతుల మీదుగా విడుదల చేయించారు చిత్ర యూనిట్.. ఈ కార్యక్రమానికి హాజరయిన మంచు మోహన్ బాబు టైటిల్ ను విడుదల చేసి టీమ్ కు అభినందనలు తెలియచేస్తూ.. చాలా రోజులయ్యింది ఆడియో ఫంక్షన్ లకు హాజరయ్యి.. జయలలిత చాలా మంచి అమ్మాయి.. నాకు రౌడీ గారి పెళ్ళాం చిత్రం నుంచీ నాకు ఆమె పరిచయం అప్పటి నుంచి తనంటే నాకు చాలా గౌరవం, ప్రేమ, అభిమానం అలాంటి తను ఈ రోజు మొదటి సారిగా ఒక చిత్రాన్ని సమ ర్పిస్తోంది అని తెలిసి నా వంతు సపోర్ట్ ను అందించాలని పిలవగానే వచ్చాను..…