అదిరిపోయే ‘ఆచార్య’ స్టెప్పులు!

Acharya Megastar chiranjivi dance

మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకులముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రం నుంచి చిరంజీవి, రెజీనాలపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం ‘కల్లోలం కల్లోలం.. ఊరు వాడా కల్లోలం’ అనే పాటని మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ.. చూసేవాళ్ల కళ్లు కాకులెత్తుకు పోనీ..’ అంటూ జోరుగా ఎంతో హుషారుగా సాగిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించగా, రేవంత్‌, గీతామాధురి ఆలపించారు. ప్రేమ్‌ రక్షిత్‌ నృత్యరీతులు సమకూర్చారు. నైట్‌ ఎఫెక్ట్‌లో పాటని చిత్రీకరించిన విధానం, బీట్‌కి తగ్గట్లుగా మెగాస్టార్ వేసిన హుషారైన స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.…

నాగ చైతన్య-సమంతకు మళ్లీ దగ్గరవుతున్నారా!?

Nagachaithanya-Samantha

సమంత నుంచి విడిపోయాక నాగచైతన్య మళ్లీ ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడా?.. సామ్ ను మరచిపో లేకపోతున్నాడా?.. సమంత మదర్ కు ఫోన్ చేసిన నాగ చైతన్య తన భాదంతా వెళ్లగక్కడా ? ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవ్వరినోటవిన్నా ఇవే ప్రశ్నలు. నాగ చైతన్య -సమంత విడిపోయారన్నవార్తను అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు తెగపోస్టులు పెడుతూ హల్ చల్ సృష్టిస్తున్నారు. నాగ చైతన్యకు భార్యగా అక్కినేని ఫ్యామిలీలో ఎంటర్ అయిన తర్వాత సమంత క్రేజ్ మరింత పెరిగిందనడంలో సందేహం లేదు. టాలీవుడ్ స్టార్ కపుల్స్ లో సామ్-చైతూ జంట అప్పట్లో అందరికీ ఫేవరెట్ గా ఉండేది. వీరిద్దరూ ప్రేమించి మరీ పెళ్లి చేసుకోవడంతో సహజంగానే అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే.. వీరి పెళ్లి ఎంతోకాలం నిలవలేదు. పెళ్లి పీటలెక్కి అన్యోన్యంగా దాంపత్య…

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ వాయిదా!

radheshyam

డార్లింగ్ ప్రభాస్ అభిమానులను తీవ్ర నిరాశపరుస్తూ ‘రాధేశ్యామ్’ వాయిదా పడింది. కరోనా.. ఒమిక్రాన్ తీవ్రత దృష్ట్యా చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మొత్తంమీద ‘రాధేశ్యామ్’ మూవీ టీమ్ ప్రకటన అభిమానులు గత కొన్నిరోజులుగా అనుకుంటున్నదే జరిగింది. ఒమిక్రాన్ వల్ల ఏర్పడిన ఆంక్షలు, పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూసివేత వల్ల సినిమాను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించి కొత్త రిలీజ్ డేట్ త్వరలో చెబుతామని ప్రకటించింది.1970ల నాటి ప్రేమకథతో తీసిన ఈ సినిమాలో ప్రభాస్, పాలమిస్ట్ (హస్తరేఖా సాముద్రిక నిపుణుడు)గా నటించారు. పూజాహెగ్డే హీరోయిన్. కృష్ణంరాజు కీలకపాత్ర పోషించారు.ఈ సినిమాకు దక్షిణాదిలో జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించగా, తమన్ బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్ ఇచ్చారు. రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి.ప్రభాస్ ప్రస్తుతం ‘సలార్’, ‘ఆదిపురుష్’ సినిమాలతో పాటు నాగ్…

అనసూయ భరద్వాజ్ ఆనందానికి హద్దులు లేవు!!

ATTACHMENT DETAILS Saved. anasuya_bharadwajs_first_look_as_alice_from_malayalam_movie_bheeshma_parvam_is_out_main

అల్లు అర్జున్ ‘పుష్ప’ చిత్రంలో దాక్షాయణి గా అదరగొట్డిన యాంకర్ అనసూయ భరద్వాజ్ ఆ సినిమాతో దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఈ హాట్ హాట్ బ్యూటీకి మలయాళం సినిమా నుంచి బంపర్ ఆఫర్ వచ్చింది. అది కూడా మమ్ముట్టి సినిమాలో రావడంతో అనసూయ ఆనందానికి హద్దులు లేవు. ఒక విధంగా చెప్పాలంటే ఇది అదిరిపోయే ఛాన్సే! మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి సరసన జంటగా నటించడమంటే మాటలుకాదు.. గ్యాంగ్ స్టర్ నేపధ్యంలో సాగే ఆ సినిమా పేరు ‘భీష్మ పర్వం’. షూటింగ్ తదితర కార్య క్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఫిబ్రవరి లో విడుదల చేయబోతున్నారు. ఇటీవల `పుష్ప`లో దాక్షాయణి పాత్రలో ఆకట్టుకున్న అనసూయ అంతకు ముందు సుకుమార్ `రంగస్థలంలో రంగమ్మత్తగా పాపులారిటీని సొంతం చేసుకుంది. నటిగా సిల్వర్‌ స్క్రీన్‌పై బిగ్‌ బ్రేక్‌ని…

అనసూయ హంగామా అంతా ఇంతా కాదు!!

Anasuya-Bharadwaj

`జబర్దస్త్` యాంకర్‌ అనసూయ అందంపై సోషల మీడియాలో ఎప్పుడూ చర్చ జరుగుతుంటుంది. ఆమె దిగే ఫొటో షూట్లు వివాదాలుగా మారుతుంటాయి. ఆమె వేసుకునే డ్రెస్‌ ట్రోల్‌కి గురవుతుంటుంది. మొత్తంగా అనసూయ ఏం చేసినా లోపాలను ఎత్తేందుకు లక్షల కళ్లు తీక్షణంగా చూస్తుంటాయి. అనసూయ `జబర్దస్త్` షోతో యాంకర్‌ గా ఎంతో గుర్తింపుని తెచ్చుకుంది. ముఖ్యంగా తన అందాలతో ఆడియెన్స్ ని కనువిందు చేస్తుంది. పొట్టి దుస్తుల్లో ఆమె చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈ బ్యూటీ కోసమే `జబర్దస్త్` షో చూసే వాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అంతగా బుల్లితెరపై అందాల విందు వడ్డిస్తున్న అనసూయ మేకప్‌పై తాజాగా మరోసారి సోషల మీడియాలో చర్చ మొదలైంది. మేకప్‌లో ఎవరైనా అందంగా కనిపిస్తారు. ముఖ్యంగా చాలా మంది హీరోయిన్లని మేకప్‌ లేకుండా చూడలేం అనేట్టుగా ఉంటారు. అలానే…

నిజాయితీ పాలనకు నిదర్శనం బిజెపి ప్రభుత్వం : బిజెపి మహబూబ్‌నగర్ జిల్లా ఇంచార్జి ప్రేమ్ రాజ్ యాదవ్

ALER BJP NEWS

(టాలీవుడ్ టైమ్స్ ప్రతినిధి – ఆలేరు ) పాలనలో స్వార్దం లేకుండా నిజాయితీ గా పరిపాలన కొనసాగిస్తే దేశ ప్రజలు అంతే విధంగా బాగుంటారని బిజెపి మహబూబ్‌నగర్ జిల్లా ఇంచార్జి ప్రేమ్ రాజ్ యాదవ్ అన్నారు. ఆలేరు పట్టణంలో రెండు రోజుల బిజెపి రాజకీయ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి మంగళవారం హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రధాని మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులను కేటాయిస్తూ నిజాయితీ పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోఅనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం పధకాలకు తమ సొంత పేరు పెట్టుకొని ప్రజలకు అందిస్తుందని‌ చెప్పారు.మోడీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.తెలంగాణ లోని…

‘ఆచార్య ’లో తనదైన మార్క్ స్టెప్పులతో దుమ్ములేపిన మెగాస్టార్

megastar Acharya song

మెగాస్టార్ చిరంజీవి. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలను జ‌రుపుకుంటోంది. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 4న విడుద‌ల చేస్తున్నారు. సోమవారం ‘ఆచార్య’ సినిమాలోని మరో పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘సానా కష్టం వచ్చేసిందే మందాకిని..’ అంటూ సాగే ఈ స్పెష‌ల్ సాంగ్‌ను మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ రెజీనా క‌సాండ్ర‌ల‌పై చిత్రీక‌రించారు. టాలీవుడ్‌లో డాన్స్‌, ఇర‌గ‌దీసే స్టెప్పులంటే వెంట‌నే గుర్తుకొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవి. ఇక స్పెష‌ల్ సాంగ్‌లో ఆయ‌న డాన్సింగ్ పెర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న‌దైన మార్క్ స్టెప్పుల‌తో చిరంజీవి డాన్స్ అద‌ర‌గొట్టేశారు.…

డా. మహ్మద్ రఫీకి ‘ఇండియన్ ఐకాన్’ జాతీయ పురస్కారం

mohammed rafeeki indian icon award

మరొక ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారం డా. మహ్మద్ రఫీ అవార్డుల ర్యాక్ లో చేరింది! జాతీయ మానవ హక్కుల సంస్థ, అరుణాచల్ ప్రదేశ్ ప్రతియేటా నిర్వహించే ఇండియన్ ఐకాన్ పురస్కారం లభించింది. ఈ నెల 27న ఢిల్లీ లీనా యాంబియెన్స్ హోటల్ కన్వెన్షన్ లో జరిగిన పురస్కారాల ప్రదానోత్సవం లో పర్యావరణం, క్రీడలు, అటవీ శాఖ మంత్రి శ్రీ మామా నతుంగ్ (అరుణాచల్ ప్రదేశ్) చేతుల మీదుగా ఇండియన్ ఐకాన్ పురస్కారం స్వీకరించారు. ఈ వేడుక లో వివిధ రాష్ట్రాల నుంచి లబ్ద ప్రతిష్టులను ఎంపిక చేసి ఇండియన్ ఐకాన్ పురస్కారాలతో ఘనంగా సత్కరించారు.మహ్మద్ రఫీతో పాటు ప్రముఖ సైకాలాజిస్ట్ శ్రీ బి.వి.సత్య నగేష్, జాతీయ టెన్నిస్ క్రీడాకారిణి డాక్టర్ రేఖా గౌడ్ తెలంగాణ నుంచి ఎంపికై పురస్కారాలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు కార్పొరేషన్ ఐఇఎస్…

ధనుష్ మొదటి తెలుగు సినిమా ఎందుకు మారింది ?

hero dhanush movie news

తమిళ హీరో ధనుష్ తెలుగులో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటించబోతున్నాడని ఆ మధ్య కాలంలో వార్తలు వచ్చాయి . మదరాసు నుంచి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన సందర్భంలో కథా నేపథ్యం నడుస్తుందని కూడా వార్తలు వచ్చాయి . ధనుష్ పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అయితే ధనుష్ మొదటి తెలుగు సినిమాగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా తాజాగా మొదలయింది . సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు. మరి ధనుష్ శేఖర్ కమ్ముల సినిమా మొదట ఎందుకు ప్రారంభం కాలేదని చాలా మందిలో సందేహం వచ్చింది. శేఖర్ కమ్ముల కథ రెడీ చేయలేదేమోనని చాలా మంది భావించారు. కాని వాస్తవానికి హీరో ధనుష్ కి – ఆ చిత్ర నిర్మాతలకు మధ్య పారితోషికం విషయంగా ఏర్పడిన అభిప్రాయ భేదాల కారణంగా ముందు వెంకీ…

సమంత ‘శాకుంతలం’ ఎప్పుడు?

Samantha Shakuntalam

సీనియర్ డైరెక్టర్ గుణ శేఖర్ ‘రుద్రమ దేవి’ సినిమా తర్వాత – ఏడేళ్ళ గ్యాప్ తీసుకొని సొంతంగా నిర్మించి డైరెక్ట్ చేస్తున్న చిత్రం ‘శాకుంతలం ‘. సమంత శకుంతలగా నటిస్తున్న ఈ పౌరాణిక చిత్రంలో దుష్యంతుడి పాత్రను మళయాళ నటుడు దేవ్ మోహన్ పోషిస్తున్నారు . లోగడ తెలుగులో ‘శకుంతల‘ సినిమాలో ఎన్.టి.ఆర్, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ లో బాలకృష్ణ పోషించారు. తెలుగులో నటిస్తున్న మొదటి సినిమాలోనే దేవ్ మోహన్ కి దుష్యంతుడి పాత్ర దొరకడం అదృష్టమనే చెప్పాలి . అలాగే ‘ఫ్యామిలీ మాన్’ వెబ్ సిరీస్ తో, ‘పుష్ప’లో ఐటమ్ సాంగ్ తో జాతీయ స్థాయిలో పాపులర్ అయిన సమంతకి ఈ పాన్ ఇండియా మరింత ప్లస్ అనే చెప్పాలి . కబీర్ బేడీ , మోహన్ బాబు కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.…