ఫహాద్ ఫాజిల్ తన మొదటి స్ట్రెయిట్ తెలుగు సినిమా చిత్రీకరణను ప్రారంభించారు. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ షూటింగ్ను ఆదివారం గ్రాండ్గా ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో హైదరాబాద్లో వేసిన సెట్కి ఆయన అభిమానులు భారీగా వచ్చారు. వెర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్ తన మీద అభిమానంతో వచ్చిన ఫ్యాన్స్ను చూసి హ్యాపీగా ఫీలయ్యారు. అభిమానుల సందోహం మధ్యే ఆయన తన షూటింగ్ను ప్రారంభించారు. అలాగే షూటింగ్ నుంచి కాసేపు విరామం తీసుకుని ఫహాద్ ఫాజిల్ తన అభిమానుల్ని పలకరించారు. అభిమానుల ప్రేమ, ఉత్సాహాన్ని గుర్తించి అక్కడకు వచ్చిన వారిని హృదయపూర్వకంగా పలకరించాడు. వచ్చిన అభిమానులు ఫహాద్ ఫాజిల్ను చూసి ఆనందపడటం, ఫ్యాన్స్ని చూసి ఫహాద్ ఫాజిల్ సంతోషించడంతో అక్కడంతా పండుగ వాతావరణం నెలకొంది. సెట్లో సినిమా మొదటి రోజు ఓ పండుగ వైబ్ కనిపించినట్టు అయింది.…
Year: 2026
మెగా కుటుంబంలో అద్భుత ఘడియలు
* కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన * గుడ్ న్యూస్ షేర్ చేసిన చిరంజీవి మెగా కుటుంబంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ అద్భుత ఘడియలు రానే వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి ఇంట పండగ వాతావరణం నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఈ సంతోషకరమైన వార్తను స్వయంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారు. జనవరి 31 శనివారం రాత్రి అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఒక బాబుకి, ఒక పాపకి జన్మనివ్వడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. మనవడు, మనవరాలు ఇద్దరూ ఒకేసారి తమ జీవితాల్లోకి రావడం పట్ల చిరంజీవి సురేఖ దంపతులు ఎంతో ఉద్వేగానికి…
Ram Charan Blessed With Twins : మెగా కుటుంబంలో అద్భుత ఘడియలు
* కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన * గుడ్ న్యూస్ షేర్ చేసిన చిరంజీవి మెగా కుటుంబంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ అద్భుత ఘడియలు రానే వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి ఇంట పండగ వాతావరణం నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఈ సంతోషకరమైన వార్తను స్వయంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారు. జనవరి 31 శుక్రవారం రాత్రి అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఒక బాబుకి, ఒక పాపకి జన్మనివ్వడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. మనవడు, మనవరాలు ఇద్దరూ ఒకేసారి తమ జీవితాల్లోకి రావడం పట్ల చిరంజీవి సురేఖ దంపతులు ఎంతో ఉద్వేగానికి…
ఈ సంక్రాంతి ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోతుంది : ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సవ వేడుకలో నవీన్ పొలిశెట్టి
కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందని చెప్పడానికి ఉదాహరణ ఈ ‘అనగనగా ఒక రాజు’ చిత్రం: ప్రముఖ నిర్మాత, టీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు మెగాస్టార్ చిరంజీవి గారు మెచ్చిన హీరో నవీన్ పొలిశెట్టి: ప్రముఖ దర్శకుడు బాబీ కొల్లి సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం ‘అనగనగా ఒక రాజు’. స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి, సంచలన విజయాన్ని అందుకుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు మారి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించారు. భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు…
ప్రముఖ నటులు, నిర్మాత మురళీ మోహన్ గారి చేతుల మీదుగా “అమరావతికి ఆహ్వానం” సినిమా టీజర్ విడుదల, ఫిబ్రవరి 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్
శివ కంఠమనేని, ధన్య బాలకృష్ణ, ఎస్తేర్, సుప్రిత, హరీష్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన సినిమా “అమరావతికి ఆహ్వానం”. ఈ మూవీలో సీనియర్ నటులు అశోక్ కుమార్, భద్రమ్, జెమిని సురేష్, నాగేంద్ర ప్రసాద్ ఇతర కీలక పాత్రలు పోషించారు. డైరెక్టర్ జీవీకే ఈ మూవీని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాత ముప్పా వెంకయ్య చౌదరి గారి నిర్మాణ సారథ్యంలో జి. రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్పై కేఎస్ శంకర్రావు, ఆర్ వెంకటేశ్వర రావు ఈ సినిమాను నిర్మించారు. శుక్రవారం హైదరాబాద్ లో ఈ సినిమా టీజర్ ను ప్రఖ్యాత నిర్మాత – నటులు మురళీ మోహన్ గారు రిలీజ్ చేశారు. “అమరావతికి ఆహ్వానం” సినిమా ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో… నటుడు అశోక్…
‘సీతా పయనం నుంచి ‘పయనమే’ అంటూ సాగే రొమాంటిక్ పాట విడుదల
శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై మల్టీ టాలెంటెడ్ నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త చిత్రం ‘సీతా పయనం’. ఈ మూవీలో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా తెరకు పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో నిరంజన్, సత్యరాజ్, ప్రకాష్ రాజ్, కోవై సరళ ఇతర ముఖ్య పాత్రల్ని పోషించారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా ఓ ప్రత్యేకమైన పాత్రలో నటించారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతోన్నారు. ఇక ప్రమోషన్స్లో భాగంగా ఇప్పటి వరకు వదిలిన కంటెంట్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ క్రమంలో ‘పయనమే’ పాటను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఈ పాటను కాసర్ల శ్యాం రచించారు.…
పద్మశ్రీ మురళీ మోహన్ : ఐదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో తనదైన ముద్ర
లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చింది : పద్మశ్రీపై మురళీ మోహన్ గణతంత్ర దినోత్సవ వేళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో తనకు పద్మశ్రీ పురస్కారం దక్కడంపై సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ హర్షం వ్యక్తం చేశారు.‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసిన పద్మ అవార్డు ఆదివారం సాయంత్రం ప్రకటించినప్పటి నుంచి అనేక మంది మిత్రులు, శ్రేయోభిలాషులు ఫోన్ చేశారు. వాళ్లందరితో నా సంతోషాన్ని పంచుకునే అవకాశం లభించింది. ‘మీకు ఎప్పుడో రావాల్సింది.. ఇప్పుడైనా వచ్చింది’ అని అంటుంటే.. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చింది అని చెప్పాను. అన్నీ మనం అనుకున్నప్పుడే రావు. ఏదైనా ఎదురు చూపుల తర్వాత దొరికితే దాని విలువ ఎక్కువ. మిత్రులందరికీ నా శుభాకాంక్షలు. ఇంత మంచి అవార్డును ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీగారికి,ఏపీ సీఎం…
‘మన శంకర వర ప్రసాద్ గారు’కు ఇంత గొప్ప సక్సెస్ ఇచ్చి గత వైభవాన్ని పునరావృతం చేసిన తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు : ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్ లో మెగాస్టార్ చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ల ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో అలరించారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రంలో నయనతార కథానాయిక నటించారు. శ్రీమతి అర్చన ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం మెగా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకొని రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ (రీజనల్ ఫిల్మ్స్) సెలబ్రేషన్ ని గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో సినిమా యూనిట్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కి షీల్డ్స్ అందించారు. దర్శకులు…
‘100 డేస్ లవ్ స్టోరీ’ ట్రైలర్ విడుదల
శ్రీ సాయి శివ ప్రియ క్రియేషన్స్ పతాకంపై పురిపండ .వి. వెంకటరమణ మూర్తి శర్మ నిర్మాతగా.. విజయమిత్ర దర్శకత్వంలో ‘100 డేస్ లవ్ స్టోరీ’అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. ‘అతి ప్రేమ భయానకం’ అనేది క్యాప్షన్. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ శుక్రవారం ప్రసాద్ ల్యాబ్ లో నిర్మాత సాయి వెంకట్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘100 డేస్ లవ్ స్టోరీ’ చిత్రం ట్రైలర్ అత్యంత అద్భుతంగా ఉంది. ట్రైలర్ ని చూస్తే చక్కటి ప్రేమకథలా అనిపిస్తుంది. ఈ చిత్రానికి క్యాప్షన్ గా ‘అతి ప్రేమ భయానకం’ని పెట్టడంలోనే సినిమా ఎలా ఉండబోతోందో అంచనా వేయొచ్చు అన్నారు. ప్రస్తుతం ప్రేమ పేరుతో సమాజంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. యువత ప్రేమ మోజులో జీవితాలను కోలోతున్నారు. ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా…
శోభిత ధూళిపాళ ‘చీకటిలో’కు ప్రముఖల ప్రశంసలు
శోభిత ధూళిపాళ, విశ్వదేవ్ రచకొండ ప్రధాన పాత్రలలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’ ఇటీవల ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ప్రైమ్ వీడియో చాలా కాలంగా భారతదేశంలో వినోదానికి వేదికగా ఉంది. వివిధ జానర్లలో అనేక ఐకానిక్ షోలు, సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ ఓటీటీలో ఆధిపత్యం చెలాయిస్తోంది ప్రేమ్ వీడియో. తన అద్భుతమైన లైనప్కు జోడిస్తూ, ఈ ప్లాట్ఫారమ్ ఇటీవల మరో ఉత్కంఠభరితమైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’ను తీసుకువచ్చింది. ఇది ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని చెప్పినట్లుగానే ఆ స్థాయిలో ప్రశంసలు అందుకుంటుంది. ప్రేక్షకులతో పాటు ప్రముఖుల చేత ఒకే విధంగా ఆసక్తిని రేకెత్తించిన దాని ట్రైలర్ ఆ తర్వాత జనవరి 23న ప్రైమ్ వీడియోలో విడుదలైంది. శోభిత ధూళిపాళ, విశ్వదేవ్ రచకొండ ప్రధాన పాత్రలలో నటించిన ‘చీకటిలో’ ఒక సరికొత్త విభిన్నమైన కథను అందిస్తుంది. ఈ…
