(T-Times News – ALER) ఉపాధ్యాయుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి అన్నారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళ ఉపాధ్యాయులు గుండెపోటుతో బలవన్మరణానికి పాల్పడ్డారు. 317 జీవోను వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నీళ్లు నిధులు నియామకాల పేరుతో ప్రభుత్వం ప్రజలను దగా చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త నియామకాలు చేయకపోగా, ఉన్న ఉద్యోగాలకు ఎసరు పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా జిల్లాలను విభజించి ఉపాధ్యాయులను మారుమూల ప్రాంతాలకు పంపిస్తూ వారి కుటుంబాలలో నిప్పులు పోస్తున్నారని దుయ్యబట్టారు. భార్యాభర్తలు ఒకే దగ్గర పని చేయాలనే నిబంధనలు తుంగలోకి తొక్కార ని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాధ్యాయులకు అన్యాయం జరిగితే ఊరుకునే…
Year: 2022
ఘనంగా వడ్డెమాన్ నరేందర్ జన్మదిన వేడుక
T-Times News- ALER ఆలేరు, జనవరి 9: యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో ఆదివారం సాయంకాలం వడ్డెమాన్ నరేందర్ జన్మదిన వేడుక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు పూల నాగయ్య కేక్ కట్ చేసి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బి జె పి జిల్లా కార్యదర్శి తునికి దశరథ, తునికి చంద్రశేఖర్, తునికి రవికుమార్, ఆర్.తునికి గణేష్, ఆలేటి చంద్రమౌళి పాల్గొన్నారు ఈ సందర్బంగా ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు పూల నాగయ్య తన శుభాకాంక్షలను అందజేస్తూ.. వడ్డెమాన్ నరేందర్ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, నరేందర్ కు ఆ భగవంతుడు అన్ని విధాలా అష్టఐశ్వర్యాలు ఇవ్వాలని ఆకాంక్షించారు.
‘పల్లె గూటికి పండగొచ్చింది’ మోషన్ పోస్టర్ విడుదల
కే ప్రవీణ్ సమర్పణలో దివ్య తేజస్విని పతాకంపై రోహిత్ కృష్ణ సంతోష్ నిఖిత హర్షిత నటీనటులుగా తిరుమల్ రావు దర్శకత్వంలో కె లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం “పల్లె గూటికి పండగొచ్చింది”. ఈ చిత్రం మోషన్ పోస్టర్ ను హైదరాబాదులోని ఫిల్మ్ ఛాంబర్ లోని పాత్రికేయుల సమక్షంలో విడుదల చేశారు.అనంతరం జరిగిన సమావేశంలో.. చిత్ర దర్శకుడు తిరుమల్ రావు మాట్లాడుతూ . పల్లెల్లో ఉన్న యువత ఏ రకంగా చెడు మార్గం లో వెళుతున్నారు.వారి ప్రవర్తనను మంచి మార్గంలో చేసుకుంటే ప్రభుత్వ సహకారం లేకుండానే ఎలా స్మార్ట్ విలేజ్ చెయ్యచ్చు అనేదే చిత్ర కథాంశం. నిజంగా రాజకీయ నాయకుల సహకారం లేకుండా కూడా ఒక పల్లె ను ఏ రకంగా అభివృద్ధి పథంలో నడిపించవచ్చు అనే మెయిన్ పాయింట్ గా తీసుకొని మంచి కాస్టింగ్ తో చాలా బాగా…
సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ కు మిజోరాం గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు సత్కారం
విశాఖపట్నం: జర్నలిజంలో అడుగుపెట్టి 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సీనియర్ జర్నలిస్ట్ నేమాల హేమసుందరరావును మిజోరాం గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు అభినందించి సత్కరించారు.నెహ్రూ యువ కేంద్ర , శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ ,రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్,ప్రకృతి చికిత్సాలయం సంయుక్త ఆధ్వర్యంలో బీచ్ రోడ్డులోని ప్రకృతి చికిత్సాలయం ఆవరణలో నిర్వహించిన స్వామి వివేకానంద 159వ జయంతి,ఆజాదీ క అమృత్ మహోత్సవ్ సేవా కార్యక్రమాలకు గవర్నర్ హరిబాబు ముఖ్యఅతిథిగా విచ్చేసి స్వామి వివేకానంద చిత్రపటం ముందు జ్యోతి వెలిగించి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు. అనంతరం రాజీవగాంధీ మానవ సేవా జాతీయ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కోవిడ్ కష్టకాలంలో వైరస్ సోకిన బాధితులకు తమ ప్రాణాలు సైతం లెక్క చేయక సకాలంలో వైద్య సేవలందించిన వైద్యులకు, పోలీస్ శాఖ ,…
దర్శకుల సంఘం సభ్యులకు ‘మెడికవర్’ హాస్పటల్స్చే ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్
“తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం” అధ్యక్షుడు.. వై. కాశీ విశ్వనాథ్, దర్శకుల సంఘం జనరల్ సెక్రటరీ.. వి.యన్ ఆదిత్య, ట్రెజరర్.. భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ కమ్ యాక్టర్ మాదాల రవి సహకారంతో, ‘మెడికవర్’ హాస్పటల్స్చే తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ మెంబర్స్కు ఫ్రీ మాస్టర్ హెల్త్ చెకప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నటుడు డాక్టర్ మాదాల రవి, మెడికోవర్ క్లస్టర్ హెడ్ డాక్టర్ దుర్గేష్ శివ (మెడికోవర్ క్లస్టర్ హెడ్), డాక్టర్ రిచా నిరాల (మెడికోవర్ సెంట్రల్ హెడ్), సంతోష్ శుక్లా (ఏ.జి.యమ్ మార్కెటింగ్ హెడ్), మరియు ” నాంది” డైరెక్టర్ విజయ్ కనకమేడల.. దర్శకులు.. రవి కుమార్ చౌదరి, వీరశంకర్, చంద్రమహేష్, సముద్ర, వీరభద్రం చౌదరి, దొరైరాజ్, నటుడు, నిర్మాత.. సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన పాత్రికేయుల…
ఓ ఉద్విగ్న వాతావరణం..ఆత్మీయుల నులివెచ్చని స్పర్శ!
● స్వగ్రామం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మౌనశ్రీ మల్లిక్ కు పౌర సన్మానం ● నేను రూ.250 ● వర్ధన్నపేట ● హైదరాబాద్ నిన్న మా స్వగ్రామం వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన పౌర సన్మాన కార్యక్రమంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మనసు నిండా చల్లని పొగమంచు ముసురుకుంది. ఆత్మీయుల నులివెచ్చని స్పర్శతో.. ఒక్కసారిగా 25ఏళ్ల ఒంటరి ప్రయాణం కళ్ళముందు కదలాడి సినిమా రీల్ లా గిర్రున తిరిగింది. ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను 250 రూపాయలు పట్టుకుని 1997 డిసెంబర్ 24వ తేదీన హైదరాబాదులో దిగాను. సముద్రంలో నీటి బిందువు పడినట్టుగా ఈ మహానగర జనారణ్యంలో అడుగు పెట్టాను. జీవితంలో ఎంత దుఃఖాన్ని భరించానో, అంత ఆనందాన్ని అనుభవించాను. దుఃఖంలో కుదేలు పడింది లేదు. ఆనందంలో కాలర్ ఎగరేసింది లేదు. ఆనంద విషాదాలను సమదృష్టితో…
సామ్రాట్ : ఒక పచ్చని జ్ఞాపకం!
మా హీరో కొడుకు ఎంట్రీ అంటే మాకెంత జోష్ ఉండాలి? అభిమానమంటే అభిమానమే. నాకు సూపర్ స్టార్ కృష్ణ అంటే పిచ్చి అభిమానం. ఎందుకో మరి… చిన్నప్పటి నుంచి ఉన్న ఆ అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నదనుకోండి. కృష్ణ వ్యక్తిత్వం కూడా ఈ అభిమానానికి కారణం కావొచ్చు. ఇక అభిమానమంటే ఒక్క ఆ హీరోకే పరిమితం కాదు. ఆ హీరో కుటుంబం నుంచి ఇంకొకరు సినీ ఎంట్రీ ఇస్తే వాళ్ళ మీదా పొంగుకొచ్చే గొప్ప అభిమానమన్నమాట. ఇది నా బాల్యంలో రమేష్ బాబుకూ, ఇప్పుడు మహేష్ కూ వర్తిస్తున్న అభిమానమే. నిన్న రమేష్ బాబు చనిపోయాడనే వార్త చెవిన పడగానే అతడితో అల్లుకున్న ఓ జ్ఞాపకం మళ్ళీ తాజా తాజాగా కదలాడసాగింది. ఈ జ్ఞాపకం జీవితాంతం వదలని జ్ఞాపకాల్లో ఒకటి. రమేష్ బాబు అనగానే…
‘హైదరాబాద్స్ ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీ బిగ్గెస్ట్ ఫిల్మ్ అండ్ బ్రాడ్ కాస్ట్ ఎక్స్ పో’ పోస్టర్ విడుదల
వివిధ రంగాలకు చెందిన పలు పరిశ్రమలకు మన హైదరాబాద్ అడ్డాగా మారింది. అందువల్ల అంతర్జాతీయంగా ఉన్న ఏ కంపెనీ అయినా… తన ప్రాడక్ట్స్ ను విక్రయించడానికి, వాటి ఉపయోగాలను తెలియచెప్పడానికి హైదరాబాద్ ను ఓ ప్రధాన కేంద్రంగా భావిస్తున్నాయి. ఇదే సమయంలో హైదరాబాద్ లోని నవతరం, అలానే సాంకేతిక నిపుణులు, పెద్ద ఇండస్ట్రీకు సంబంధించిన వారు..ఆ నవీన ఆవిష్కరణల గురించి తెలుసు కోవాలని, తమని తాము అప్ డేట్ చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కొంతకాలంగా ఎన్నో రకాల ఎక్స్ పోస్ గ్రాండ్ గా జరుగుతున్నాయి. పాన్ ఇండియా మూవీస్ కారణంగా యావత్ భారతదేశం మనవైపు చూస్తోంది. ఇక్కడి సాంకేతికతను గురించి, సాంకేతిక నిపుణుల ప్రతిభ గురించి ఆరా తీస్తోంది. అందుకే మనవాళ్ళు సైతం హాలీవుడ్ టెక్నాలజీని అర్థం చేసుకుని, లేటెస్ట్ ఇన్నోవేషన్స్ ను…
వరుస చిత్రాలతో క్రేజీ కొరియోగ్రాఫర్ గా దూసుకెళ్తున్న పోలాకి విజయ్
టాలెంట్ ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీ నెత్తిన పెట్టుకుంటుంది. మన స్టార్స్ నుంచి ఎంకరేజ్ మెంట్ కు కొదవేం ఉండదు. అలా ఈ మధ్య అల్లు అర్జున్, సమంత లాంటి స్టార్స్ తో ప్రశంసలు అందుకుంటున్నారు యంగ్ కొరియోగ్రాఫర్ పోలాకి విజయ్. ప్యాన్ ఇండియా సెన్సేషన్ పుష్ప ఫంక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొరియోగ్రాఫర్ విజయ్ పోలంకి గురించి ప్రశంసిస్తూ మాట్లాడారు. అలాగే పుష్ప లో సమంత చేసిన ఊ అంటావా, ఉ ఉ అంటావా సాంగ్ కు కూడా పోలాకి విజయ్ యే డాన్స్ మాస్టర్. ఇతని వర్క్ సమంతా కు బాగా నచ్చింది.అందుకే బెస్ట్ విశెస్ చెబుతూ ఎంకరేజ్ చేసింది. రీసెంట్ గా విజేత, కొబ్బరిమట్ట, తిప్పరా మీసం, పలాస 1978, అల్లుడు అదుర్స్, శశి లాంటి అనేక చిత్రాలకు బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ…
100 మంది ‘దేవరశాంటా’ విజేతలను అనౌన్స్ చేసిన ‘రౌడీ స్టార్’ విజయ్ దేవరకొండ
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దేవరశాంటా పేరుతో 100 మందికి 10 వేల రూపాయల చొప్పున క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తానని విజయ్ చేసిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది. దేవరశాంటా 2021 యాష్ ట్యాగ్ కు అత్యధిక సంఖ్యలో రిక్వెస్టులు వచ్చాయి. వాటిలో నుంచి 100 మందిని ఎంపిక చేశారు. ఈ 100 మందికి ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున అందించనున్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా స్పందించారు. మై లవ్స్ దేవరశాంటా విజేతల జాబితాలో మీ పేరు చెక్ చేసుకోండి. త్వరలో మా టీమ్ మిమ్మల్ని సంప్రదించి డబ్బులు ట్రాన్స్ ఫర్ చేస్తుంది. అని ట్వీట్ లో పేర్కొన్నారు. తను స్టార్ అయినప్పటి నుంచి దేవరశాంటా పేరుతో క్రిస్మస్ కు బహుమతులు ఇస్తున్నారు రౌడీ స్టార్…
