ద‌ర్శ‌కుడు మారుతీ విడుద‌ల‌ చేసిన‌ `కొత్త కొత్త‌గా..’ ​నుంచి డైమండ్ రాణి సాంగ్ కు మంచి స్పంద‌న‌

Kottakottaga Movie song relesed by director Maaruthi

అజయ్‌, వీర్తి వఘాని, హీరో హీరోయిన్లుగా, ఆనంద్ (సీనియర్ హీరో), తులసి, కాశీవిశ్వనాద్, కల్యాణి నటరాజన్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టిస్తున్న చిత్రం `కొత్త కొత్త‌గా`. బి జి గోవిందరాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మిస్తున్నారు యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి హనుమాన్ వాసంశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలోని `డైమండ్ రాణి ..`సాంగ్ ను శుక్ర‌వారం ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతీ ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. శేఖర్ చంద్ర సంగీతం దర్శకత్వంలో కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, అనురాగ్ కులకర్ణి పాడిన `డైమండ్ రాణి ..`సాంగ్ ను ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల చేసిన కొద్ది సేప‌టికే మంచి స్పంద‌న రావ‌డం విశేషం. మంచి ప్రేమ‌క‌థా చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను…

‘న‌ల్ల‌మ‌ల’ చిత్రంలోని `మ‌న్నిస్తారా మూగ‌జీవులారా…` పాట‌కి స్పంద‌న‌

Nallamala movie

అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్, తనికెళ్ల భరణి, అజయ్‌ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం `నల్లమల`. నల్లమల అడవి చుట్టూ జరిగిన ఎన్నో చీకటి కోణాలను, సామాన్య జనానికి తెలియని అవినీతి ఒప్పందాల నేప‌థ్యంలో ఆస‌క్తిక‌ర క‌థా క‌థ‌నాల‌తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి ఆర్‌.ఎమ్ నిర్మాత‌. ఈ మూవీలోని సిద్ శ్రీ‌రామ్ పాడిన ఏమున్న‌వే పిల్లా సాంగ్ మిలియ‌న్స్ కి పైగా వ్యూస్ సాధించి సోష‌ల్ మీడియాలో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, అన్ని పాట‌ల‌కి విశేష స్పంద‌న ల‌భించింది. తాజాగా ఈ చిత్రంలోని `మ‌న్నిస్తారా మూగ‌జీవులారా…` పాట‌ను ద‌ర్శ‌కేంద్రుడు కే.రాఘ‌వేంద్ర‌రావు విడుద‌ల‌చేశారు. ఈ సంద‌ర్భంగా .. ద‌ర్శ‌కేంద్రుడు మాట్లాడుతూ – “ద‌ర్శ‌కుడు ర‌విచ‌ర‌ణ్ మ‌న్నిస్తారా పాట‌ను చాలా బాగా చిత్రీక‌రించాడు. అప్పుడ‌ప్పుడు న‌ల్ల‌మ‌ల సినిమా ప్రోమోస్ చూస్తుంటాను. కొత్త…

Mahesh Babu :మహేష్ బాబు ప్లాన్ మళ్లీ మారింది!!

Hero Maheshbabu news

ప్రస్తుతం తెలుగు చిత్రాలకు బాలీవుడ్ లో సూపర్ మార్కెట్ ఏర్పడింది. మన టాలీవుడ్ హీరోలు గతంలో నటించిన చిత్రాలు యూట్యూబ్ లో భారీ వ్యూస్ అందుకుంటున్నవిషయం తెలిసిందే. దాంతో తెలుగు హీరోలు అక్కడ బాగా పాపులర్ అయిపోతున్నారు. సౌత్ నుంచి నార్త్ కు వెళ్తున్న సినిమాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అందుకే సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు కూడా బాలీవుడ్‌ వైపు అడుగులు వేస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. హ్యాండ్ సమ్ హీరోస్ లిస్ట్ విషయానికొస్తే ఇండియాలోనే టాప్ 5లో లిస్ట్ లో మహేశ్‌ బాబు పేరు కూడా ఉంటుంది. కేవలం టాలీవుడ్ చిత్రాలతోనే కాదు.. బాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు సూపర్ స్టార్. అందుకే ఉత్తరాదిన చాలా మంది హీరోయిన్స్ మహేశ్‌తో…

Dhanush Divorce: ఆ హీరోయిన్ల వల్లే ధనుష్‌-ఐశ్వర్యలు విడిపోయారు!?

Dhanush Divorce:

భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తరువాత తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ పేరు మరోసారి సంచలనమైంది. తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకే కాదు కోలీవుడ్ కు ఊహించని షాక్‌ ఇచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐశ్వర్య- ధనుష్‌లు18 ఏళ్ల తర్వాత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. మంచి స్నేహితులుగా, దంపతులుగా, ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా ఇంతకాలం కలిసి జీవిస్తున్న తాము ఇకపై భార్యభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. నిజానికి వీరిద్దరి మధ్య సుచీలీక్స్‌ వ్యవహారంతోనే కలహాలు మొదలయ్యాయని కోలీవుడ్‌ టాక్‌. తమిళనాట స్టార్‌ హీరోగా పేరు సంపాదించుకున్న ధనుష్‌ పేరు సుచీ లీక్స్‌లో బయటపడటం అప్పట్లో సెన్సేషన్‌కు దారితీసిన విషయం తెలిసిందే. 2017లో కోలీవుడ్‌ను ఊపేసిన అత్యంత వివాదాస్పద…

‘జీ 5’ ఓటీటీలో సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’

ZEE5 to release Sumanth's ‘Malli Modalaindi’

‘జీ 5’ ఓటీటీ లక్ష్యం ఒక్కటే… వీక్షకులకు వినోదం అందించడమే. అది కామెడీ కావచ్చు, డ్రామా కావచ్చు, యాక్షన్ కావచ్చు. జానర్ ఏదైనా… ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డమే లక్ష్యంగా ‘జీ 5’ ఓటీటీ ఎప్పటికప్పుడు విలక్షణ కథలు, కథాంశాలతో రూపొందించిన వైవిధ్యమైన ఒరిజినల్ సిరీస్‌లు, డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్‌లు, కొత్త సినిమాలను అందిస్తోంది. లేటెస్టుగా మరో సినిమాను ఎక్స్‌క్లూజివ్‌గా, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. సుమంత్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘మళ్ళీ మొదలైంది’. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహించారు. ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకం మీద రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ సినిమాను ‘జీ 5’ ఓటీటీ ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల చేయనుంది. ఓటీటీ రైట్స్‌ను దక్కించుకుంది. ఫిబ్రవరిలో సినిమాను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. విడాకులు…

ZEE5 to release Sumanth’s ‘Malli Modalaindi’

ZEE5 to release Sumanth's ‘Malli Modalaindi’

The relationship drama is going to be a ZEE5 exclusive Hyderabad, 20 January 2022: ZEE5 has got one goal. It’s to offer unlimited entertainment to its viewers in various genres, be it comedy, drama, action, or any other genre. In this endeavour, the OTT platform has picked Originals, direct-to-digital releases, and new films offering a variety of stories and subjects since its inception. Latest, it is gearing up to release a direct-to-digital movie exclusively. ‘Malli Modalaindi’, starring Sumanth in the lead, is the one. Directed by TG Keerthi Kumar, the…

టాలీవుడ్ స్టార్ హీరోల రేంజ్ ఇది !?

special Story Tollywood Heros

పాన్ ఇండియా పాట పాడుతున్న మన టాలీవుడ్ స్టార్ హీరోలు.. అంతే రేంజ్ లో భారీ రెమ్యూనరేషన్ లు కూడా అందుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ‘బాహుబలి’ ఎప్పుడైతే విడుదలైయిందో.. మన టాలీవుడ్ రేంజే పూర్తిగా మారిపోయింది. మన హీరోలంతా.. పాన్ ఇండియా జపం చేయడంతో టాలీవుడ్ సినిమాల పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. దాంతో మన కథలకు మన హీరోలకు దేశవ్యాప్తంగా డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు మన టాలీవుడ్ ను చిన్న చూపు చూసిన బాలీవుడ్, కోలీవుడ్ లాంటి ఇండస్ట్రీలే ఇప్పుడు బాప్..రే టాలీవుడ్ అంటున్నాయి. దాంతో మన హీరోల స్థాయి కూడా అమాంతం పెరిగిపోయింది. దాంతో పాటు వారి రెమ్యూనరేషన్లు కూడా భారీగా రెట్టింపు అయ్యాయి. అందులో భాగంగానే దేశ వ్యాప్తంగా ఇఫ్పుడు భారీ పారితోషికం తీసుకుంటున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. పాన్…

రామ్ చరణ్ ‘రంగస్థలం’ హిందీలోకి అడుగుపెడుతోంది!

Rancharan in Rangasthalam Movie in Hindhi

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ త‌న‌ న‌ట‌విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించిన సినిమా ‘రంగస్థలం’. ఈ సినిమా కేవ‌లం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా దిగ్విజ‌యంగా ప్ర‌ద‌ర్శించ‌బ‌డి అన్ని చోట్ల విజ‌య‌దుంధిబి మోగించి బాక్సాఫీస్ ను ఒక్క‌సారి షేక్ చేసేసింది. ఈ సినిమా 2018లో విడుద‌లై ప్రేక్ష‌కుల‌ను, అభిమానుల‌ను ఎంత‌గానో అల‌రించింది. ఇక‌ బ‌య్య‌ర్ల‌కు, సినిమా ప్రొడ్యూస‌ర్ల‌కు ఎంతగానో కాసులవ‌ర్షం కురిపించిన ‘రంగ‌స్థ‌లం’ ఇప్పుడు హిందీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించడానికి సిద్ద‌మవుతోంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత మనీష్ షా ఈ సినిమాను ఉత్తారిదిన విడుద‌ల చేయడానికి ముందుకొచ్చారు. మైత్రీ మూవీస్ మేక‌ర్స్ బ్యానర్ పై క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ సారథ్యం వహించిన ‘రంగస్థలం’ మార్చి 30, 2018న విడుద‌లై, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతిపెద్ద విజయాన్ని సాధించింది. ఒక్క మాట‌లో చెప్పాలంటే రంగస్థలం ఇండస్ట్రీ హిట్ అని…

మలినేని గోపీచంద్ సినిమాలో బాల‌య్య 60 ఏళ్ల వృద్ధుడిగా కనిపించబోతున్నారా?

NBK-Malineni Gopichand

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సాధించిన కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. దాంతో ఇప్పుడు ఎవ్వరినోటా విన్నా బాలయ్య జపమే! యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ‘అఖండ’ సినిమా స‌క్సెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నవిషయం తెలిసిందే. ‘అఖండ’ ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంతో పాటు విజయవంతంగా 50 రోజులు 103 థియేటర్లలో పూర్తిచేసుకుంది. అస‌లు ఇప్పుడు ఉన్న ఈ క్లిష్ట ప‌రిస్థితుల్లో ఓ సినిమాకు లాంగ్ ర‌న్ ఉండ‌డం లేదు. అలాంటిది ‘అఖండ’ ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 50కు పైగా కేంద్రాల్లో 50 రోజులు పూర్తిచేసుకోవడమంటే మాటలు కాదు. . మ‌రోవైపు బుల్లితెర‌పై అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే షోతో అక్క‌డ కూడా బాల‌య్య షేక్ చేస్తున్నాడు. ఇదే ఊపులో బాల‌య్య వ‌రుస పెట్టి సినిమాలు అంగీక‌రిస్తున్నాడు. ఆయన తదుపరి చిత్రం మ‌లినేని…

విశ్వ‌క్ సేన్ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ నుంచి ‘ఓ ఆడ‌పిల్లా నువ్వ‌ర్ధం కావా..’ లిరికల్ సాంగ్ రిలీజ్

Ashokavanamlo Arjuna kalyanam song relese

”మాట రాని మాయ‌వా మాయ జేయు మాట‌వా మాటులోని మ‌ల్లెవా మ‌ల్లె మాటు ముల్లువా వ‌య్యారివా.. క‌య్యారివా సింగారివా..సింగాణివా రాయంచ‌వా.. రాకాసివా లే మంచులో లావా నీవా ఓ ఆడ‌పిల్లా నువ్వ‌ర్ధం కావా నా జీవితంతో ఆటాడుతావా…” -అంటూ అర్జున్ (విశ్వ‌క్ సేన్‌) త‌న ప్రేయ‌సి (రుక్స‌ర్ థిల్లాన్‌) కోసం పాట పాడుతున్నారు. అస‌లు వీరి క‌థేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ మేకర్స్. ఫ‌ల‌క్‌నుమాదాస్ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’. ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రాజావారు రాణిగారు’ మూవీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ చిత్రానికి…