తెలుగుచిత్రసీమలో తదుపరి సినిమాల జాతర షురూ కాబోతోంది. పవర్ స్టార్ పవ కళ్యాణ్ ధైర్యం చేయడంతో ఫిబ్రవరి నుంచి సమ్మర్ వరకు `ఆర్ఆర్ఆర్, `రాధేశ్యామ్`, `సర్కారువారిపాట`, `భీమ్లా నాయక్`, `ఆచార్య’ చిత్రాలు ప్రేక్షకులకు కనువిందు చేయబోతున్నాయి. కరోనా ప్రభావంతో సినిమాలన్నీ వరుసగా వాయిదా పడుతూ వస్తున్నాయి. గత రెండేళ్లుగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతికి విడుదల కావాల్సిన `ఆర్ఆర్ఆర్`, `భీమ్లా నాయక్`, `సర్కారు వారి పాట`, `రాధేశ్యామ్` చిత్రాలు వాయిదా పడ్డసంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్లు సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్నాయి. ఫిబ్రవరి నెల నుంచి ప్రేక్షకులకి సినిమా పండగ తెచ్చేందుకు రెడీ అవుతున్నాయి. అందులో భాగంగా సంక్రాంతికి రావాల్సిన పవన్ కళ్యాణ్ `భీమ్లా నాయక్` వాయిదా పడిన విషయం తెలిసిందే. `ఆర్ఆర్ఆర్`,…