గొంతులేని సామాన్యుల భావ వ్యక్తీకరణకు సోషల్ మీడియా వేదిక ఎంతో దోహదపడుతుందని, అయితే కొందరు ఇదే అదనుగా భావిస్తూ, హద్దు,అదుపు లేకుండా స్వేచ్ఛ పేరిట ఉచ్ఛరించడానికి వీలుకాని భాషను ఉపయోగిస్తున్నారని, ఇలాంటి వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం నాడు ఫిల్మ్ నగర్ లోని, ఫిల్మ్ ఛాంబర్ లో, టీయూడబ్ల్యూజే అనుబంధ సంస్థ అయిన ఫిల్మ్ క్రిటిక్స్ (సినిమా బీట్ జర్నలిస్టుల) అసోసియేషన్ నిర్వహించిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. నీతి, నిజాయితీ, నిర్భీతితో పనిచేస్తూ, ప్రజల గొంతుకగా నిలబడే మీడియా సంస్థలకు, జర్నలిస్టులకు తాత్కాలికంగా కష్టాలు ఎదురైనా, భవిష్యత్తులో ఖచ్చితంగా మంచిరోజులే ఉంటాయని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. మీడియాను తమ చేతుల్లోకి తీసుకుంటున్న బడా వ్యాపార, వాణిజ్య వేత్తలు…