‘యానిమల్’తో ఒక్కసారిగా ఫేమ్ సొంతం చేసుకున్నారు బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రి . ఈ సినిమా తర్వాత యూత్లో ఆమెకు ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. దీంతో ఆమె నేషనల్ క్రష్గా గుర్తింపు సొంతం చేసుకున్నారు. అభిమానులు తనని ‘నేషనల్ క్రష్’ అని పిలవడంపై తాజాగా త్రిప్తి స్పందించారు. ఆ ట్యాగ్ విషయంలో తాను ఆనందంగా ఉన్నట్లు చెప్పారు. బాలీవుడ్లో కెరీర్ మొదలుపెట్టి దాదాపు ఏడేళ్లు అయ్యింది. అందుకు సంతోషంగా ఉన్నా. గొప్ప నటీనటులు, దర్శకులతో వర్క్ చేస్తానని కెరీర్ ఆరంభంలో ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే, యాక్టింగ్ను నేను సీరియస్గా తీసుకోలేదు. మొదటి సినిమా పూర్తయిన తర్వాత కెరీర్ను విధికే వదిలేశా. ‘ఒక సినిమా పూర్తి చేశా. అదృష్టం ఉంటే రెండో సినిమా రావొచ్చు’ అనుకున్నా. అలాంటి సమయంలో ‘లైలా మజ్ను’ కోసం ఆడిషన్లో పాల్గొన్నా. ఆనాటి నుంచి…