విజయ్ దేవరకొండ సమంత జంటగా నటించిన తాజా చిత్రం ‘ఖుషి’ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం సక్సెస్ఫుల్ టాక్తో స్క్రీనింగ్ అవుతోంది. ఐదేళ్ల తర్వాత విజయ్ దేవరకొండకు మళ్లీ సూపర్ హిట్ పడ్డట్టు ఇప్పటివరకు వచ్చిన రిపోర్ట్స్ చెబుతున్నాయి. ‘లైగర్’ డిజాస్టర్ తర్వాత మంచి సక్సెస్ అందుకోవడంతో విజయ్ దేవరకొండ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో విజయ్ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు. ఖుషి చిత్రం ద్వారా తాను సంపాదించినయమొత్తంలో రూ.కోటిని వంద కుటుంబాలకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. విశాఖపట్నంలో నిర్వహించిన ఖుషి ప్రొమోషనల్ ఈవెంట్లో విజయ్ మాట్లాడుతూ.. ‘ఖుషి చిత్రం ఇవాళ ఫేక్ రివ్యూలను, తప్పుడు ప్రచారాలను అధిగమించి విజయవంతంగా ప్రదర్శితమవుతోందంటే అందుకు కారణం అభిమానులే. కొందరు డబ్బులిచ్చి మరీ ఖుషి చిత్రంపై వ్యతిరేక ప్రచారం చేయిస్తున్నారు. కానీ,…