బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపుతోన్న ‘కమిటీ కుర్రోళ్ళు’.. రెండు రోజుల్లో రూ.3.69 కోట్లు వసూళ్లు

'Committee Kurrollu' which is showing its power at the box office.. collected Rs. 3.69 crores in two days

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ఆగస్ట్ 9న వంశీ నందిపాటి విడుదల చేశారు. డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్‌, అటు యూత్‌ను ఆక‌ట్టుకున్న ఈ చిత్రం సూప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. తొలి రోజు కంటే రెండో రోజు కలెఓన్స్ పెరగటం సినిమాకు దక్కిన ఆద‌రణ‌ను తెలియచేస్తోంది. రెండు రోజుల్లోనే క‌మిటీ కుర్రోళ్లు సినిమా రూ. 3.69 కోట్ల‌ను రాబ‌ట్టింది. మంచి ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణంలో స్నేహం, ప్రేమ‌, కుటుంబంలోని భావోద్వేగాల‌ను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు…