మాస్ మహారాజా రవితేజ తన మొట్టమొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ `టైగర్ నాగేశ్వరరావు` చిత్రాన్ని చేస్తున్నాడు. దీనికి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, తేజ్ నారాయణ్ అగర్వాల్ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రవితేజ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రమిది. ఉగాది రోజున (ఏప్రిల్ 2న) మాదాపూర్ లోని నోవాటెల్లో (హెచ్ఐసిసిలో) టైగర్ నాగేశ్వరరావు చిత్ర ప్రధాన బృందం సమక్షంలో గ్రాండ్ లాంఛింగ్ ఈవెంట్ను నిర్వహించనున్నారు. ఉగాది నాడు మధ్యాహ్నం 12:06 గంటలకు సినిమా ప్రీ లుక్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా గురువారంనాడు తెలియజేసింది. పాన్ ఇండియా చిత్రం `ది కాశ్మీర్ ఫైల్స్`తో బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నిర్మాత అభిషేక్ అగర్వాల్ కి ఇది…
Category: FILM NEWS
‘మిషన్ ఇంపాజిబుల్’ ఎవరినీ నిరాశ పరచదు..నన్నునమ్మి సినిమా చూడండి : మెగాస్టార్ చిరంజీవి
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకత్వం వహించారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరించారు. ముగ్గురు పిల్లలు గా రోషన్, బానుప్రకాష్, జైతీర్థ నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా బుధవారంనాడు ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ఓ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, కొన్ని ఫంక్షన్లకు ప్రేమతో వస్తాం. అలా నిర్మాత నిరంజన్ రెడ్డిపై వున్న సోదర ప్రేమతో వచ్చాను. చాలా తక్కువ సమయంలో నాకు అత్యంత ఆప్తుడిగా, సోదరుడిలా కలిసిపోయాడు.…
ప్రతాని రామకృష్ణగౌడ్, లయన్ సాయివెంకట్ చేతులు మీదుగా ఘనంగా ‘బారసాల’ లోగో ఆవిష్కరణ
శ్రీ సేవాలాల్ క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ నిర్మాతగా.. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో నిర్మించబోతున్న చిత్రం ‘బారసాల’. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేసుకుని త్వరలో షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా గురువారం ఫిలిం ఛాంబర్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణగౌడ్, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శక, నిర్మాత లయన్ సాయి వెంకట్లు విచ్చేశారు. ముందుగా ప్రతాని, సాయివెంకట్ల చేతుల మీదుగా చిత్ర టైటిల్ లోగో ఆవిష్కరణ జరిగింది. అనంతరం చిత్ర దర్శకుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన రామకృష్ణగౌడ్ గారికి, సాయివెంకట్ గారికి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారికి మా యూనిట్ తరపున ధన్యవాదాలు. అలాగే నాకు దర్శకుడిగా ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత శ్రీనివాస్ గారికి థ్యాంక్స్.…
వైష్ణవ్ తేజ్ ‘రంగ రంగ వైభవంగా’ జూలై 1న విడుదల
‘ఉప్పెన’ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన యువ కథానాయకుడు వైష్ణవ్ తేజ్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్పై బాపినీడు.బి సమర్పణలో గిరీశాయ దర్శకుడిగా బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’. కేతికా శర్మ హీరోయిన్. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి జూలై 1 ఈ చిత్రాన్ని భారీ లెవల్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ డైరెక్షన్లో లవ్, ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ కలగలిసిన ఫ్యామిలీ డ్రామాగా రూపొందుతోన్న ‘రంగ రంగ వైభవంగా’ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన ఈ మూవీ టైటిల్ టీజర్, పాటకు ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. రాక్ స్టార్…
నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ ఫస్ట్ ఎటాక్ (టీజర్) విడుదల
-జూలై 8న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్ల లో విడుదల యువ కథానాయకుడు హీరో నితిన్ `మాచర్ల నియోజకవర్గం` చిత్రంలో గుంటూరు జిల్లా కలెక్టర్ గా సిద్ధార్థ్ రెడ్డి అనే IAS అధికారి పాత్రను పోషిస్తున్నాడు. ఈ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ కి MS రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్తో కలిసి శ్రేష్ట్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ రోజు (బుధవారం) నితిన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా ఫస్ట్ ఎటాక్ (టీజర్)ని విడుదల చేశారు. టీజర్ నితిన్ యాక్షన్ సీన్ను అద్భుతంగా ఎలివేట్ చేసింది. ముఖానికి పులి రంగు, ఒంటినిండా పులిచారలుతో వున్న కొందరు దుండగులు నితిన్ పై కొడవళ్ళతో దాడిచేయడం వారి నుంచి తను…
King Nagarjuna, Praveen Sattaru, Sree Venkateshwara Cinemas LLP, Northstar Entertainment’s The Ghost’s Lengthy Schedule In Dubai Completed
King Akkineni Nagarjuna is presently starring in a high-octane action entertainer The Ghost under the direction of creative director Praveen Sattaru. Sonal Chauhan is playing the leading lady opposite Nagarjuna in the film. Meanwhile, the team has completed a crucial shooting schedule in Dubai. High intense stunt sequences, some important scenes and a romantic song was filmed in this schedule. Being made on lavish and grand scale, in terms of its visuals, locations, top-notch technicalities, and other grandeur, The Ghost is going to offer a holistic experience of movie watching…
‘ర్యాంబో’గా రచ్చచేయనున్న ఉడుంబు
-టైటిల్ పాత్రలో యువ హీరో ఆశిష్ గాంధి – గంగపట్నం శ్రీధర్ నిర్మాణం.. -రత్నాకరం అనిల్ రాజు దర్శకత్వంలో మార్చి 28 నుంచి సెట్స్ పైకి!! మలయాళంలో మంచి విజయం సాధించిన “ఉడుంబు” తెలుగు రీమేక్ రైట్స్ ప్రముఖ నిర్మాత గంగపట్నం శ్రీధర్ సొంతం చేసుకోవడం తెలిసిందే. టి.సి.ఎస్.రెడ్డి సమర్పణలో శ్రీవిఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి “ర్యాంబో” అనే టైటిల్ పెట్టారు. యువ కథానాయకుడు ఆశిష్ గాంధీ టైటిల్ పాత్ర పోషించనున్నాడు. దర్శకత్వ శాఖలో విశేష అనుభవం కలిగిన యువప్రతిభాశాలి “రత్నాకరం అనిల్ రాజు” ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తమ తమ శాఖలలో నిష్ణాతులైన స్టార్ టెక్నిషియన్స్ “ర్యాంబో” చిత్రానికి పని చేస్తున్నారు. హోలీ పండుగను పురస్కరించుకుని “ర్యాంబో” ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మార్చి 28 నుంచి…
ఏప్రిల్ 2న ఉగాది సినీ పురస్కారాలు
ఏప్రిల్ 2వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు తెలుగు సంవత్సరాది ఉగాది నాడు… ప్రసాద్ ల్యాబ్ లో.. చిత్ర పరిశ్రమకు సంబంధించిన అన్ని విభాగాల నుంచి.. సీనియర్ కళాకారులను, కార్మికులను ఎంపిక చేసి వారికి ఉగాది పురస్కారాలు ప్రదానం చేస్తామని నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు జె.వి.మోహన్ గౌడ్ తెలుగు సినిమా వేదిక వ్యవస్థాపకులు పాకలపాటి విజయ్ వర్మ, కూనిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కూనిరెడ్డి శ్రీనివాస్ సంయుక్తంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. 90 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో అన్ని విభాగాలను గుర్తించి సత్కరించి ఉగాది పురస్కారం అందజేయనుండడం ఇదే ప్రథమం అని చెప్పారు. వివిధ విభాగాలకు చెందిన వారికి దాసరి నారాయణరావు, డి.రామా నాయుడు, దొరస్వామిరాజు స్మారక అవార్డ్ లను అంద జేయనున్నామన్నారు. అలాగే డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్…
పుట్టినరోజు సందర్భంగా నూతన చిత్రాలు ప్రకటించిన విశ్వక్ సేన్
తొలి చిత్రం `ఈ నగరానికి ఏమైంది`లోనే తన మార్క్ను క్రియేట్ చేసిన నటుడు విశ్వక్ సేన్. ఆ తర్వాత భిన్నమైన కథలను ఎంచుకుంటూ ఫలక్నామా దాస్ నుంచి దాస్ కా ధమ్కీ వరకు భిన్నమైన కథలను ఎంచుకుంటున్నాడు. యంగ్ ఏజ్లోనే నిర్మాతగానూ, దర్శకుడిగానూ మల్టీటాలెంటెడ్ హీరోగా గుర్తింపు పొందిన విశ్వక్ సేన్ పుట్టినరోజు వేడుక మంగళవారం రాత్రి అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. హైదరాబాద్ ప్రసాద్ల్యాబ్ ఆవరణలో జరిగిన ఈ వేడుకకు విశ్వక్ సేన్ తో చిత్రాలు తీస్తున్న రచయితలు, నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విశ్వక్సేన్పై విడుదల చేసిన స్పెషల్ పాట ఆకట్టుకుంది. ఈ సందర్భంగా విశ్వక్సేన్ రెండు కొత్త చిత్రాలను వెల్లడించారు. ఇప్పటికే `ముఖ చిత్రం`లో పవర్ఫుల్ లాయర్గా కనిపించబోతున్నాడు. యువి.క్రియేషన్స్లో `గామి` అనే భారీ సినిమా చేస్తున్నాడు. ఓరి దేవుడా, దాస్…
రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెలకు ప్రతిష్టాత్మక పురస్కారం
సెలబ్రిటీ హోదా సామాజిక సేవకు ఉపయోగించాలని నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల. మన సొసైటీకే కాదు పర్యావరణ హితమైన కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటారు. హ్యూమన్ లైప్ తో పాటు వైల్డ్ లైఫ్ ను కాపాడాలనేది ఉపాసన ఆలోచన. ఈ దిశగా తన సేవలను ఆపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ వైస్ ఛైర్ పర్సన్ గా కొనసాగిస్తున్న ఉపాసన కొణిదెలకు ప్రతిష్టాత్మక నాట్ హెల్త్ సీఎస్ఆర్ అవార్డ్ దక్కింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషికి గుర్తింపుగా 2022 ఏడాదికి గాను ఆమె ఈ పురస్కారాన్నిఅందుకోనున్నారు. ఓ గొప్ప కార్యక్రమంలో తమల్ని భాగం చేసిన తాతయ్య అపోలో ఆస్పత్రుల ఫౌండర్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డికే ఈ అవార్డ్ ఘనత దక్కుతుందని ఉపాసన…
