తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని ఫాలోయింగ్ను సంపాదించుకుంది అగ్ర కథానాయిక సమంత. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేస్తూ సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. ‘ఫ్యామిలీమెన్-2’ సిరీస్ ద్వారా బాలీవుడ్లో సత్తా చాటింది. ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తి చేసిన ఈ బ్యూటీ ‘యశోద’ సినిమా కూడా చేస్తోంది. మరోవైపు శివనిర్వాణ-విజయ్ దేవరకొండ లవ్ స్టోరీ ఖుషీలోనూ నటిస్తోంది. దీంతోపాటు హిందీలో వరుణ్ ధావన్తో కలిసి వెబ్ ప్రాజెక్టు చేస్తోంది. ఈ బ్యూటీ ప్రస్తుతం హిందీ ప్రాజెక్టుల పై ఎక్కువ ఫోకస్ పెట్టిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే.. దక్షిణాది ప్రేక్షకులందరికీ సుపరిచితురాలైన ఈ భామ ఇప్పటివరకు మలయాళ సినిమాలో మాత్రం నటించలేదు. తాజా సమాచారం ప్రకారం సమంత మలయాళ అరంగేట్రానికి రంగం సిద్ధమైందని తెలిసింది. మలయాళంలో సీనియర్ దర్శకుడైన షాజీ కైలాస్ ‘పింక్ పోలీస్’ పేరుతో…
Category: FILM NEWS
మ్యాస్ట్రో ఇళయ రాజా సంగీత సారథ్యంలో శర్మన్ జోషి, శ్రియాశరన్ నటించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’ షూటింగ్ పూర్తి
లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయ రాజా సంగీత సారథ్యం వహించిన తాజా చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ మోస్ట్ అవెయిటెడ్ మూవీపై ప్రారంభం నుంచి అంచనాలు నెలకొన్నాయి. హైదరాబాద్, గోవా సహా పలు ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణను జరిపారు. తాజాగా హైదరాబాద్లో జరిగిన షెడ్యూల్తో చిత్రీకరణంతా పూర్తయ్యింది. ఈ సినిమాలో మొత్తం 11 పాటలున్నాయి. అందులో కేవలం మూడు పాటలు కేవలం మ్యూజిక్తోనే సాగుతాయి. సినిమాటోగ్రాఫర్ కిరణ్ డియోహన్స్ తన కెమెరా పనితనంతో విజువల్స్ను గ్రాండ్గా తెరకెక్కించి సినిమాను నెక్ట్స్ లెవల్లో తీసుకెళ్లారని రైటర్ – డైరెక్టర్ పాపారావు బియ్యాల భావిస్తున్నారు. అలాగే శర్మన్ జోషి, శ్రియా శరన్ ప్రాణం పెట్టి తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ కిరణ్ డియోహన్స్ మాట్లాడుతూ…
బెక్కం వేణుగోపాల్ సమర్పణలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ‘అనుకోని ప్రయాణం’
ఆపిల్ క్రియేషన్స్ బ్యానర్ పై డా.జగన్ మోహన్ డి వై నిర్మాతగా వెంకటేష్ పెదిరెడ్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అనుకోని ప్రయాణం’. నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని బెక్కం వేణుగోపాల్ సమర్పణలో విడుదలకు సిద్దమైయింది. వైవిధ్యమైన కధాంశంతో తెరకెక్కిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ డైలాగ్ అందించడం మరో విశేషం. ఈ చిత్రం నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. నలఫై ఏళ్ళ సినీ ప్రయాణంలో ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి లాంటి కొన్ని కథలు విన్నప్పుడు షాకైనమాటే వాస్తవామే. కానీ దర్శకుడు వెంకటేష్ ‘అనుకోని ప్రయాణం’ కథ చెప్పినపుడు ఫ్రీజ్ అయ్యాను. 45ఏళ్ళ తర్వాత మళ్ళీ గొప్ప సినిమా చేస్తున్నాననే భావన కలిగింది. కరోనా సమయంలో వలస కూలీలు ప్రయాణం నుండి పుట్టిన…
సందడిగా సాగిన ‘సురాపానం’ కిక్ అండ్ ఫన్ ట్రైలర్ విడుదల
సంపత్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా “సురాపానం”. కిక్ అండ్ ఫన్ అనేది ట్యాగ్ లైన్. ప్రగ్యా నయన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని అఖిల్ భవ్య క్రియేషన్స్ పతాకంపై మట్ట మధు యాదవ్ నిర్మిస్తున్నారు. ఫాంటసీ థ్రిల్లర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 10 న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ముఖ్య అతిథి మామిడి హరికృష్ణ మాట్లాడుతూ…ట్రైలర్ లాంఛ్ కార్యక్రమానికి రావడం సంతోషంగా ఉంది. మనిషికే కాదు దేవుళ్లకు కూడా ఉత్సాహాన్ని ఇచ్చేది సురాపానం అని మన…
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ‘కిరోసిన్’ చిత్రం ట్రైలర్ విడుదల
మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అలభిస్తుంటుంది. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాయి. అలాంటి ఓ మిస్టరీ కథను తీసుకొని ఎంతో వైవిధ్యభరితంగా తెరకెక్కించి కిరోసిన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. బిగ్ హిట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ధృవ ప్రధాన పాత్రలో దీప్తి కొండవీటి, పృద్వీ యాదవ్ నిర్మాతలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ధృవ దర్శకత్వం వహించడంతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ కూడా అందించారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకోగా, జూన్ 17 న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్లో భాగంగా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా కిరోసిన్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రిగా సేవలందిస్తున్న…
‘విరాటపర్వం’ ఓ అద్భుతం : ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో ‘విరాటపర్వం’ టీమ్
పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కర్నూల్ లో జరిగింది. మూడు నిమిషాల నిడివి గల ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ట్రైలర్ లో యాక్షన్, డ్రామా, డైలాగ్స్ , ఎమోషన్స్, విజువల్స్ పవర్ ఫుల్ గా వున్నాయి. నక్సల్ మూమెంట్ నేపధ్యంలో ఓ అద్భుతమైన ప్రేమకథని తెరపై ఆవిష్కారించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. కామ్రేడ్ రావన్న పాత్రలో రానా నటన అవుట్ స్టాండింగా వుంది. వెన్నెల పాత్రలో సాయి పల్లవి ప్రేక్షకులని ఆకట్టుకుంది. ‘చిన్న ఎవడు.. పెద్ద ఎవడు.. రాజ్యమేలే రాజు ఎవడు..…
నిఖిల్ చిత్రం ‘స్పై’ ఇంట్రో గ్లింప్స్ విడుదల
యంగ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కధానాయకుడి గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మల్టీ లాంగ్వెజ్ చిత్రం ‘స్పై’. ఎవరు, గూడాచారి, హిట్ లాంటి సూపర్ హిట్ చిత్రాల ఎడిటర్ గా చేసిన గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో ఎడ్ ఎంటర్టైన్మెంట్స్ పై చరణ్ తేజ్ ఉప్పలపాటి సిఈఓగా నిర్మాత కె. రాజ శేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా నిఖిల్ ని ‘స్పై’ గా పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ ఒక గ్లింప్స్ వీడియోని విడుదల చేసింది. చేతిలో ట్రాన్స్మిటర్ తో మంచు పర్వతాల మీద నడుస్తున్న నిఖిల్ వెపన్స్ వున్న రహస్య ప్రదేశాన్ని చేరుకోవడం, వెపన్స్ పట్టుకొని బైక్ నడుపుతూ శత్రువులను వేటాడడానికి రంగంలో దిగడం ఈ పవర్ ఫుల్ గ్లింప్స్ లో చూపించారు. ఇందులో నిఖిల్ స్లిక్,…
‘గంధర్వ’ లిరికల్ వీడియోసాంగ్ విడుదల
అటు నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఆహ్లాదకరమైన మాటలతో, ఇటు సినిమాపై గట్టి నమ్మకంతో విడుదలచేస్తున్న ఎస్.కె. ఫిలిమ్స్ అధినేత సురేష్కొండేటి పవర్ఫుల్ డైలాగ్లతో `గంధర్వ` చిత్రం లిరికల్ వీడియో సాంగ్ విడుదల, సినిమా విడుదల తేదీ ప్రకటన కార్యక్రమం జరిగాయి. ఆదివారంనాడు ప్రసాద్ల్యాబ్ ప్రివ్యూ థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి చిత్ర హీరో సందీప్ మాధవ్, సాయికుమార్, బాబూమోహన్, చిత్ర నిర్మాత సబాని, దర్శకుడు అప్సర్, సంగీత దర్శకుడు ర్యాప్ రాక్ షకీల్ తదితరులు హాజరయ్యారు. సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్. సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం `గంధర్వ`. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ బేనర్ పై ఎస్.కె. ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. ఈ సందర్భంగా గంధర్వ చిత్ర పోస్టర్ను బాబూమోహన్ ఆవిష్కరించగా, జులై1న విడుదలచేస్తున్నట్లు ఛిత్ర హీరో సందీప్ మాధవ్ ప్రకటించారు. లిరికల్…
జూన్ 24న అవికా గోర్-శ్రీరామ్ల ‘టెన్త్ క్లాస్ డైరీస్’ విడుదల
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్పతాకాలపై రూపొందిన చిత్రం ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యంసంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ చిత్రంతో ప్రముఖఛాయాగ్రాహకులు ‘గరుడవేగ’ అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. జూన్ 24నసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘రోజ్ విల్లా’, ‘ముగ్గురు మొనగాళ్లు’ చిత్రాల తర్వాత అచ్యుత రామారావు నిర్మించినచిత్రమిది. ఇందులో శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ రామారావు, అర్చన (వేద), హిమజ, శివబాలాజీ, మధుమిత, ‘సత్యం’ రాజేష్, భాను శ్రీ, నాజర్, శివాజీ రాజా, సంజయ్ స్వరూప్, దీపా సాయిరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకులకు చేరువయ్యాయి. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన అవికా గోర్పరిచయ గీతం ‘ఎగిరే ఎగిరే…’తో పాటు ‘పియా పియా…’, ‘కుర్రవాడా…
విక్రాంత్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పార్క్’కు మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హెషమ్ వహాబ్ సంగీతం!
విక్రాంత్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా హై బడ్జెట్తో డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్ బ్యానర్పై రూపొందుతోన్న చిత్రం ‘స్పార్క్’. ఈ చిత్రాన్ని చేయబోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మే నెలలో పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి కుంటోంది. సినిమా అనౌన్స్ చేసిన రోజునే ప్రముఖ సంగీత దర్శకుడు ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తారని మేకర్స్ చెప్పిన సంగతి తెలిసిందే. చెప్పినట్లే హెషమ్ వహాబ్కు స్పార్క్ సినిమా సంగీత సారథ్య బాధ్యతలను అప్పగించారు. ప్రణవ్ మోహన్ లాల్, కళ్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన మలయాళ సూపర్ హిట్ ‘హ్రిదయం’ సినిమాకు మ్యూజిక్ను అందించారు. హ్రిదయం సినిమాలో ప్రతి పాట ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ డమ్ను అందుకున్న హెషమ్ వహాబ్ ఇప్పుడు…
