జస్ట్ ఆర్టినర్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.2 మూవీగా రూపొందుతోన్న చిత్రం ‘మాయా పేటిక’. ఈ సినిమా టైటిల్ లుక్ను టాలీవుడ్ హండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి విడుదల చేశారు. ‘థాంక్యూ బ్రదర్’ వంటి వైవిధ్యమైన చిత్రాన్ని రూపొందిన ఇదే నిర్మాణ సంస్థలో మరో వెరైటీ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమవుతోంది. రమేష్ రాపార్తి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్నాథ్ బొమ్మి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు గుణ బాల సుబ్రమణియమ్ సంగీతాన్ని సమకూరుస్తుండగా సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కామెడీ, డ్రామా జోనర్లో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు. సాంకేతిక నిపుణులు : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రమేష్ రాపార్తి నిర్మాతలు : మాగుంట శరత్…
Category: FILM NEWS
నిర్మాతగా ‘గాడ్సే’ వంటి సినిమా చేయడం గర్వంగా ఫీల్ అవుతున్నా : ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్
వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వెర్సటైల్ హీరో సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకుడు.ఈ చిత్రం జూన్ 17న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇంతకు సత్యదేవ్ – గోపి గణేష్ కాంబినేషన్లో ‘బ్లఫ్ మాస్టర్’ వంటి సూపర్ హిట్ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ హిట్ కాంబో కలిసి చేస్తోన్న గాడ్సే చిత్రం ట్రైలర్ను గురువారం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా జరిగిన పాత్రికేయుల సమావేశంలో.. నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ ‘‘135 కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో ఈ మధ్య గాడ్సే గురించి చర్చలు నడుస్తున్నాయి. చాలా కాంట్రవర్సీలు కూడా అవుతున్నాయి. కానీ సి.కళ్యాణ్ నిర్మించిన ఈ గాడ్సే అలాంటి గాడ్సే కాదు. అయితే ఈ సినిమా…
‘విక్రమ్’ విజయం దర్శకుడు లోకేష్ కనగరాజ్ దే : శ్రేష్ఠ్ మూవీస్ అధినేత సుధాకర్ రెడ్డి
కమల్ హాసన్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్` జూన్3న విడుదలై విశ్వవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతోంది. తెలుగు, తమిళ రాష్ట్రాల లోనూ కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. ఈ సినిమాను తెలుగులో హీరో నితిన్ తండ్రి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి తమ స్వంత బేనర్ శ్రేష్ఠ్ మూవీస్ ద్వారా విడుదల చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 400 థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల చేసి మంచి సక్సెస్ను సాధించారు. ఈ సందర్భంగా గురువారం సుధాకర్ రెడ్డి మీడియా సమావేశంలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, పలు విషయాలను తెలియజేశారు. # `విక్రమ్` తీసుకున్నప్పుడు మీరేమనుకున్నారు? ఇప్పుడు ఎలా వుంది? -కమల్ హాసన్ అభిమాని అయిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ తీశాడంటే ఖచ్చితంగా మంచి…
‘అంటే సుందరానికీ’ అన్నీ ఎమోషన్స్ వున్న అరుదైన కథ : నజ్రియా నజీమ్ ఇంటర్వ్యూ..
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘అంటే సుందరానికీ’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నజ్రియా ఫహద్ తెలుగులో పరిచయం కాబోతున్న ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్ , మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యంలో హీరోయిన్ నజ్రియా పంచుకున్న’అంటే సుందరానికీ’ విశేషాలివి… * తెలుగులోకి రావడానికి చాలా సమయం తీసుకున్నారు .. కారణం ? – నిజంగా నేను ఏదీ ప్లాన్ చేసుకోనండి. కథలు ఎంపిక విషయంలో కొంచెం పర్టిక్యులర్ వుండే మాత్ర వాస్తవమే. ఐతే…
సత్యదేవ్ ‘గాడ్సే’ నుంచి ‘రా రమ్మంది ఊరు..’ వీడియో విడుదల
‘‘రా రమ్మంది ఊరు.. రయ్యిందీ హుషారు రాగమందుకుంది జ్ఞాపకాల జోరు పచ్చనైన చేలు పల్లె పరిసరాలు ఎంత కాలమైనా మరువ లేరు నా పేరు… ’’ అంటూ చాలా ఏళ్ల తర్వాత ఊరికి వచ్చిన ఓ యువకుడు తన చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటే వారెలా రియాక్ట్ అయ్యారనే విషయలను తెలుసుకోవాలంటే ‘గాడ్సే’ సినిమా చూడాల్సిందే అని అంటున్నారు నిర్మాత సి.కళ్యాణ్. వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వెర్సటైల్ హీరో సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకుడు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్లో ‘బ్లఫ్ మాస్టర్’ వంటి సూపర్ హిట్ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ హిట్ కాంబో కలిసి చేస్తోన్న గాడ్సే చిత్రంపై టైటిల్ అనౌన్స్మెంట్ నుంచి అంచనాలు నెలకొన్నాయి. సినిమాను…
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని, మైత్రీ మూవీ మేకర్స్ # NBK107 ఫస్ట్ హంట్ లోడింగ్
నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రేజీ కాంబినేషన్ లో ఓ మాస్ మసాలా ఎంటర్టైనర్న రూపుదిద్దుకుటుంది. #NBK107 వర్కింగ్ టైటిల్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం నుండి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. ఫస్ట్ హంట్ విడుదల కానుంది. “NBK107 ఫస్ట్ హంట్ లోడింగ్” అని బాలకృష్ణ చేతులను మాత్రమే చూపిస్తున్న పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ఫస్ట్ హంట్ ని ప్రకటించింది. బాలకృష్ణ పుట్టిన రోజు కానుక గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ వార్త గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ ఈ సినిమాతో విలన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. వరలక్ష్మి శరత్కుమార్…
‘మేజర్’ టీమ్ కు హీరో విజయ్ దేవరకొండ అభినందనలు!!
ముంబై ఉగ్రదాడి అమరుడు, వందల మందిని కాపాడిన రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో తెరకెక్కిన మేజర్ సినిమాను ప్రశంసించారు హీరో విజయ్ దేవరకొండ. మేజర్ చిత్రాన్ని హైదరాబాద్ లో చూసిన విజయ్.. సినిమాలో చిత్ర బృందం ప్యాషన్, ప్రేమ, సిన్సియారిటీ కనిపించించాయని అన్నారు. హీరో అడివి శేష్ సహా టీమ్ మెంబర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మేజర్ సందీప్ జీవితం ఆదర్శవంతమని, దేశభక్తి విషయంలో ఆయన్ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ అన్నారు. ఇలాంటి వీర పుత్రున్ని కన్న సందీప్ తల్లిదండ్రులు గొప్పవారని విజయ్ దేవరకొండ ట్వీట్ లో పేర్కొన్నారు.
నెట్టింట వైరల్గా మారిన సత్యదేవ్ పాట!!
ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు సత్యదేవ్. నటనకు ప్రాధాన్యమున్నవైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ అటు హీరోగా ఇటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్న అతడు అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నాడు. ప్రస్తుతం సత్యదేవ్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘గాడ్సె’ ఒకటి. ‘బ్లఫ్ మాస్టర్’ ఫేం గోపి గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలే ఉన్నాయి. అవినీతిమైన రాజకీయనాయకులను, ఒంటి చేత్తో ఎదుర్కొన్న యువకుడి పాత్రలో సత్యదేవ్ నటించనున్నాడు. యాక్షన్ థిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 17న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం అప్డేట్లను స్టార్ చేసింది. తాజాగా మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రకటించారు. ఈ చిత్రంలో ‘రారమ్మంది.. ఊరు’ అంటు సాగే పాటను జూన్ 7న విడుదల చేయబోతున్నట్లు…
Rashikhanna : శర్వానంద్కు జోడీగా.. !
టాలీవుడ్ లో గత కొంత కాలంగా మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు టాలీవుడ్ యువ హీరో శర్వానంద్. ప్రస్తుతం శర్వానంద్ పీపుల్స్ మీడియా నిర్మాణంలో కృష్ణచైతన్యతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కొత్తగా కనిపించేందుకు మేకోవర్ మార్చుకునే పనిలో ఉన్నాడట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఒకటి తాజాగా బయటకు వచ్చింది. అదే.. రాశీఖన్నాతొలిసారి శర్వానంద్కు జోడీగా నటించబోతుందని టాలీవుడ్ సర్కిల్ తాజా సమాచారం. రాశీఖన్నా ప్రస్తుతం మారుతి-గోపీచంద్ కాంబినేషన్లో వస్తున్న పక్కా కమర్షియల్లో నటిస్తోంది. శర్వానంద్ అనుకున్న ప్రకారం మేకోవర్ పూర్తయిన వెంటనే ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుందట. కృష్ణచైతన్య ఇప్పటికే నితిన్తో పవర్ పేట్ సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు..అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ ప్రాజెక్టు రద్దయింది. ఇపుడిదే చిత్రాన్ని లేదా దానికి అనుబంధంగా ఉండే స్టోరీని…
బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న’విక్రమ్’
జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘విక్రమ్’ మూవీలో కమల్ యాక్షన్ సీన్స్తో అదరగొట్టాడు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత ‘విక్రమ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చిన వచ్చిన లోకనాయకుడు కమల్ హాసన్ కలెక్షన్లతో బాక్సాఫీస్ను బెంబేలెత్తిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటిదాకా వచ్చిన లెక్కలు చూస్తుంటే బాప్ రే.. అనిపిస్తోంది. తొలి రోజే రూ.45 కోట్లకు పైగా రాబట్టిన విక్రమ్ తాజాగా రూ.150 కోట్ల మార్క్ను దాటేసింది. వీకెండ్ను బాగా క్యాష్ చేసుకున్న ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు అందుకుంది. అంతర్జాతీయ మార్కెట్లోనూ విక్రమ్ దుమ్ము దులుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ వీకెండ్ (జూన్ 3 నుంచి 5 వరకు) అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రాల్లో విక్రమ్ మూడో స్థానంలో ఉంది. 167 మిలియన్ డాలర్లతో టాప్ గన్ మావెరిక్ మొదటి స్థానంలో, 55…
