సాయిధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కె.వి. ధీరజ్, నవకాంత్, చమ్మక్ చంద్ర ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం `షికారు` శ్రీసత్యసాయిబాబాగారి ఆశీస్సులతో నాగేశ్వరి (పద్మ) సమర్పణలో పి.ఎస్.ఆర్. కుమార్ (బాబ్జీ, వైజాగ్) నిర్మాతగా శ్రీసాయి లక్ష్మీ క్రియేషన్స్ బేనర్మీద హరి కొలగాని దర్శకత్వంలో రూపొందింది. (యాన్ అన్లిమిటెడ్ ఫన్ రైడ్) అనేది ట్యాగ్లైన్. శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చిన షికారు నుండి `దేవదాసు పారు వల్ల బ్యాడు` అనే క్రేజీ సాంగ్ను చిత్ర బృందం శనివారంనాడు ఫిలింఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో విడుదలచేసింది. ఈ కార్యక్రమంలో ఛాంబర్ కార్యదర్శి ప్రసన్నకుమార్, నిర్మాత వివేక్ కూచిభట్ట, ఆదిత్య మహేంద్ర, చిత్ర బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు చమక్ చంద్ర మాట్లాడుతూ, చాలాకాలం తర్వాత మంచి పాత్ర పోషించాను. ఒక పాట నామీద చిత్రీకరించారు. అది నేను ఊహించలేదు.…
Category: FILM NEWS
‘విరాట పర్వం’ మొదలు పెట్టినప్పుడు మాకు పాన్ ఇండియా ఆలోచన లేదు : రానా దగ్గుబాటి ఇంటర్వ్యూ..
పాన్ ఇండియా స్టార్ రానా దగ్గుబాటి, సాయిపల్లవి జంటగా వేణు ఊడుగుల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న చిత్రం ‘విరాటపర్వం’. డి. సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానున్న నేపధ్యంలో హీరో రానా మీడియాతో మాట్లాడారు. ఆయన పంచుకున్న ‘విరాటపర్వం’ విశేషాలివి. * అరణ్య నుండి విరాటపర్వంలోకి రావడం ఎలా అనిపించింది ? -అడవులకూ నాకూ ఏదో అనుబంధం ఉన్నట్లుంది.(నవ్వుతూ) గత నాలుగేళ్ళుగా అడవుల్లోనే ఎక్కువ షూటింగులు జరిగాయి. అక్కడే ఎక్కువ గడిపాను. విరాట పర్వానికి వచ్చేసరికి 90లో జరిగే కథ. దళం సభ్యులు అడవుల్లో వుండే రోజులు.,నాటి వాతావరణం.. చాలా యదార్ధంగా తీశాం. నా కెరీర్ లో ఫస్ట్ టైం ఒక గ్రేట్ లవ్ స్టొరీ చేశాను. చాలా లోతైన ప్రేమకథ.…
‘గాడ్సే’తో టాలీవుడ్ లో అడుగుపెట్టడం హ్యాపీగా ఉంది : ఐశ్వర్య లక్ష్మి ఇంటర్వ్యూ..
వెర్సటైల్ హీరో సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకత్వం వహించారు. సి.కె.ఎంటర్టైన్మెంట్ ప్రై.లి. బ్యానర్పై సి.కళ్యాణ్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 17న గ్రాండ్ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఇతర ప్రమోషనల్ యాక్టివిటీస్తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా నటించింది. సినిమా విడుదల సందర్భంగా ఐశ్వర్య లక్ష్మీ ఇంటర్వ్యూ విశేషాలు ఆమె మాటల్లోనే… – నేను హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసి మూడేళ్లు అవుతుంది. నా తొలి చిత్రాన్ని మలయాళంలో చేశాను. రెండో చిత్రాన్ని తెలుగులోనే చేయాల్సింది. కానీ కుదరలేదు. తర్వాత దర్శక నిర్మాతలు అనుకున్న పాత్రలకు నేను సూట్ కాకపోయి ఉండొచ్చు. వచ్చిన పాత్రలు నాకు నచ్చలేదు.. ఇలా పలు కారణాలతో తెలుగులో సినిమాలు చేయలేకపోయాను.…
‘విక్రమ్’ను బిగ్గెస్ట్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు : కమల్ హాసన్
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘విక్రమ్’. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్ లోరూపొందిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రేష్ఠ్ మూవీస్’ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సుధాకర్ రెడ్డి తెలుగులో భారీగా విడుదల చేశారు. జూన్ 3 విడుదలై ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకొని హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో రానా దగ్గుబాటి ఈ వేడుకకు అతిధిగా హాజరయ్యారు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. విక్రమ్…
ఇన్స్టాగ్రామ్లో సమంత నెల సంపాదన ఎంతో తెలుసా?
దక్షిణాదిలో తిరుగులేని గుర్తింపును సంపాదించుకున్న టాలీవుడ్ బ్యూటీ సమంతకు ఇన్స్టాగ్రామ్లో రెండుకోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ‘ఫ్యామిలీమెన్-2’’ వెబ్సిరీస్తో బాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైన ఈ భామ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే ప్రకటనల ద్వారా నెలకు మూడు కోట్ల వరకు ఆర్జిస్తున్నదని సమాచారం. నెలకు మూడు కోట్లా..? అని ఆశ్చర్యపోకండి! సోషల్మీడియా ప్రభావంతో సినీ తారలకు కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో వారికి ఉన్న ఫాలోవర్లు, పాపులారిటీని బట్టి వ్యాపార సంస్థలు తమ ప్రకటనల కోసం భారీ మొత్తంలో తారలకు చెల్లింపులు జరుపుతున్నాయి. ఈ వరుసలో సమంత ముందున్నది చెబుతున్నారు. తాజాగా ఈ భామ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ల్లో పలు బ్రాండ్లకు సంబంధించిన ప్రకటనలు జోరుగా కనిపిస్తున్నాయి. యువతరంలో ఈ భామకున్న క్రేజ్ దృష్ట్యా ఇన్స్టాగ్రామ్ ప్రకటనల కోసం భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నదని…
ఆహా ఒరిజినల్ ‘అన్య’స్ ట్యుటోరియల్’ టీజర్ ను లాంచ్ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్
ఆహా అంటే ఆహా అనిపించే రీతిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా వారి హారర్ వెబ్ సిరీస్ ‘అన్య’స్ ట్యుటోరియల్’ టీజర్ ను శుక్రవారం సాయంత్రం లాంచ్ చేసారు. రెజీనా కెసాండ్రా మరియు నివేదితా సతీష్ ముఖ్య పాత్రధారులుగా రూపుదిద్దుకున్న ఈ వెబ్ సిరీస్ ను బాహుబలి ప్రొడ్యూసర్స్ ఆర్కా మీడియా నిర్మిస్తుంది. ఆహా ఈ వెబ్ సిరీస్ తెలుగు మరియు తమిళ్ భాషలలో అతి త్వోరలోనే లాంచ్ చేయనుంది. టీజర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ, “అన్య’స్ ట్యుటోరియల్ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ టీజర్ లాంచ్ చేయడం నాకు సంతోషంగా ఉంది. అల్ ది బెస్ట్ టు టీం అఫ్ అన్య.” https://fb.watch/dy_MnVIpVj/ ప్రపంచం మొత్తం ఇప్పుడు డిజిటల్ దిక్కు అడుగులు వేస్తుంది. కానీ అదే డిజిటల్ రంగం అందరిని…
జూన్ 17న తెలుగు ఇండియన్ ఐడల్ మెగా ఈవెంట్ జరగబోతోంది..అందరూ ఎంజాయ్ చేయండి : స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్
అత్యుత్తమమైన తెలుగు గాత్రాన్ని కనుగొనే ఉద్దేశంతో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్జేజ్ ప్రోగ్రామ్ తెలుగు ఇండియన్ ఐడల్ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. సంగీత ప్రియుల మధ్య గణనీయమైన ఆదరణ పొందిన తెలుగు ఇండియన్ ఐడల్ షో ముగింపుకు వచ్చింది. స్వర మాధుర్యంతో అలరించిన ఐదుగురు ఫైనలిస్టులతో ఓ ప్రోగ్రాంను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో.. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్.ఎస్.తమన్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి షోను ఓ టీంగా చేసినందుకు నాకు ఆనందంగా ఉంది. టీంగా మేం గెలిచాం. గత ఆరు నెలలుగా ఈ టీంతో ప్రయాణిస్తూ వచ్చాను. నాకు చాలా సిగ్గు. కానీ నేను ఎలా మారిపోయానో నాకే తెలియడం లేదు. ఆ స్పేస్ క్రియేట్ చేసిచ్చిన అరవింద్ గారికి థ్యాంక్స్. ఆయన నన్ను రెండు విషయాల్లో చాలా మార్చారు. నేను చాలా లో స్టేజ్లో ఉన్నప్పుడు…
ఎం.ఎస్. రాజు ‘7 డేస్ 6 నైట్స్’ ట్రైలర్ కి అనూహ్య స్పందన!!
ఎం.ఎస్. రాజు దర్శకునిగా ‘డర్టీ హరి’ తో గతేడాది బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నారు. తాజాగా, మెగా బ్యానర్ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఆయన దర్శకత్వం వహించిన మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘7 డేస్ 6 నైట్స్’ జూన్ 24న విడుదల కి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త ట్రైలర్ కి అద్భుతమైన స్పందన రావడంతో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. సరికొత్త ట్రీట్మెంట్ తో, విజువల్స్ తో ట్రైలర్ లో సుమంత్ అశ్విన్, మెహెర్ చాహల్ తో పాటు రోహన్, క్రితిక శెట్టి మరో జంటగా కనిపించారు. కామెడీ తో యూత్ ఫుల్ కంటెంట్ ని కలిపి పూర్తిగా ఆకట్టుకునే విధంగా చిత్రం ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా హీరో, నిర్మాత సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ “ఈ చిత్రాన్ని…
జులై 15న సత్యదేవ్, తమన్నా ‘గుర్తుందా శీతాకాలం’ విడుదల
టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరో సత్యదేవ్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా నాగ శేకర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. ప్రతీ ఒక్కరు తమ జీవితంలో సెటిల్ అయిన తర్వాత కొన్ని విషయాల్ని ఎప్పటికీ మరిచిపోరు. ముఖ్యంగా టీనేజ్, కాలేజ్ ఆ తర్వాత వచ్చే యూత్ లైఫ్లో జరిగే సంఘటనలు జీవితాంతం గుర్తుకు వస్తూనే ఉంటాయి. ఇలాంటి ఆహ్లాదకరమైన సంఘటణలు ప్రేక్షకులకి గుర్తు చేసే ఉద్దేశంతో నాగశేఖర్ మూవీస్ బ్యానర్, మణికంఠ ఎంటర్టైన్మెంట్స్, వేదాక్షర ఫిల్మ్స్ బ్యానర్స్పై భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చినబాబు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా గుర్తుందా శీతాకాలం. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన రామారావు చింతపల్లి గారు వరస సినిమాలతో ఇండస్ట్రీలో తన మార్క్ చూపించుకుంటున్నారు. క్రేజీ ప్రాజెక్టులను ఆయన నిర్మిస్తూ హ్యాపెనింగ్ ప్రొడ్యూసర్గా మారుతున్నారు.…
మైత్రీ మూవీ మేకర్స్ విజయాలకు అవే నిదర్శనం : నరేశ్ వి.కె ఇంటర్వ్యూ…
నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘అంటే సుందరానికీ`. ఈ చిత్రం ట్రైలర్ విడుదలయ్యాక భారీ అంచనాలు నెలకొన్నాయి. నజ్రియా ఫహద్ తెలుగులో పరిచయం కాబోతుంది. జూన్ 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్న నేపధ్యంలో నాని తండ్రిగా నటించిన నరేశ్ వి.కె మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు. # మీ కెరీర్లో ఎన్నో పాత్రలను పండించారు. ‘అంటే సుందరానికీ` చిత్రంలో మీ పాత్ర ఎంత వైవిధ్యంగా వుండబోతోంది? -ఈ ఎరాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అద్భుతమైన పాత్రలు పోషించడం అదృష్టం. నేను పోషించిన తండ్రి పాత్రలకు ఆడపిల్లలనుంచి మంచి ఫాలోయింగ్ వచ్చింది. అ..ఆ., భలేభలేమగాడివోయ్, సమ్మోహనం వంటి చిత్రాల్లో బెస్ట్ ఫాదర్…
