‘భగవంత్‌ కేసరి’పై అప్పుడే దుమారం..హరికృష్ణ ‘స్వామి’కి కాపీ అంటూ విమర్శలు

'Bhagwant Kesari' has been criticized as a copy of Harikrishna 'Swami'
'Bhagwant Kesari' has been criticized as a copy of Harikrishna 'Swami'
Spread the love

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ’భగవంత్‌ కేసరి’ సినిమా అక్టోబర్‌ 19న విడుదలకు సిద్ధం అవుతోన్న వేళ విమర్శల దాడి జరుగుతోంది. ‘భగవంత్‌ కేసరి’ నందమూరి హరికృష్ణ నటించిన ’స్వామి’ సినిమాకి అనధికార రీమేక్‌ అని పుకార్లు వచ్చాయి. దీనికి అనిల్‌ రావిపూడి దర్శకుడు కాగా, ఇందులో శ్రీలీల, కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్నారు. అయితే శ్రీలీల, బాలకృష్ణకి కూతురుగా వేస్తోంది, అలాగే బాలకృష్ణ ఇందులో ఒక మధ్యవయస్కుడిగా కనిపించనున్నాడు. అతని పోస్టర్స్‌ కూడా విడుదలయ్యాయి. ఇప్పుడు సాంఫీుక మాధ్యమంలో ఈ సినిమా గురించి ఒక వార్త చక్కర్లు కొడుతోంది, ఈ విషయాన్ని ఈ చిత్ర నిర్మాతలు ఖండించారు. ఇది రీమేక్‌ కాదు అని చెప్పారు. ఈ సినిమాకి సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మాతలు. ఇందులో బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ నటిస్తున్నాడు, అతని షూటింగ్‌ కూడా అయిపోయింది అని అతను, బాలకృష్ణ కలిపి పోజు ఇచ్చిన ఫోటోస్‌ కూడా పోస్ట్‌ చేసాడు, అవి కూడా వైరల్‌ అవుతున్నాయి.ఈ సినిమాలో బాలకృష్ణ కూతురుగా శ్రీలీల వేస్తోంది, అందులో కూడా హరికృష్ణకి ఒక కూతురు, భార్యగా మీనా వేశారు, ఇందులో భార్యగా కాజల్‌ అగర్వాల్‌ అని, అలా ఆ సినిమాకి, ఈ సినిమాకి పోలికలు పెడుతూ 2004 లో విడుదలైన హరికృష్ణ సినిమాకి, ఇప్పుడు అతని తమ్ముడు బాలకృష్ణ సినిమాకి ముడి పెట్టారు చాలామంది. దానికి చాలా గట్టిగానే బదులిచ్చారు నిర్మాతలు. ఇది రీమేకా కాదా అన్నదానికి నిర్మాతలు సమాధానం చెపుతూ, ’అసలు నిజం ఏంటి అంటే అక్టోబర్‌ 19న భారీగా చూస్తారు. ఇంతకు ముందు ఎన్నడూ చూడని బాలకృష్ణ ని బిగ్‌ స్క్రీన్స్‌ మీద చూస్తారు’ అని పోస్ట్‌ చేశారు.